వారం రోజుల క్రితం జగదేకేవీరుడు అతిలోకసుందరికి చెందిన హక్కులన్నీ మావేనంటూ ఎవరు ఏ రూపంలో కాపీ కొట్టినా, స్ఫూర్తి చెందినా, రీమేక్ చేసినా తదుపరి తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వైజయంతి మూవీస్ సంస్థ పబ్లిక్ గా హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో పెద్ద చర్చే జరిగింది. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే మెగా 157ని ఉద్దేశించే ఈ ప్రకటన ఇచ్చారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరే రెండు మూడు రోజులు మాట్లాడుకుని అందరూ మర్చిపోయారు.
ఇవాళ హఠాత్తుగా మా ఇంద్రజ అంటూ అదే సినిమాలోని స్టిల్ ని తీసుకుని ఒక పోస్టర్ ని విడుదల చేసింది అశ్వినీదత్ బృందం. స్వచ్ఛత, అమాయకత్వం, శాంతికి సూచికగా అందరి హృదయాల్లో ఆమె స్థానం శాశ్వతం అంటూ ఓ సందేశం జోడించారు. బాగానే ఉంది కానీ అసలు ఇంద్రజ హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందో అంతు చిక్కడం లేదు. శ్రీదేవి పుట్టినరోజు ఆగస్టులో. చనిపోయింది ఫిబ్రవరిలో. జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయ్యింది మే నెలలో. మరి ప్రత్యేకంగా సందర్భం లేకపోయినా ఇలా మా ఇంద్రజ అంటూ ప్రత్యేకంగా హెడ్డింగ్ పెట్టడంలో ఆంతర్యం గుట్టుగా అనిపిస్తోంది.
ఏదైనా సినిమా లేదా తామే నిర్మించిన శ్రీమతి కుమారి వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమైతే అదేదో నేరుగా చెబితే సరిపోయేది. ఇలా ఇన్ డైరెక్ట్ గా పెడితే లేనిపోని డౌట్లు వస్తాయి. అసలు జగదేకేవీరుడు సీక్వెల్ ని రామ్ చరణ్ తో తీయాలని అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అశ్వినిదత్ మనసులోనూ అది ఉంది కానీ సరైన కథ దర్శకుడు కుదరాలి కదా. ఈలోగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ దేవరతో జరిగిపోయింది. మరి దగ్గరి భవిష్యత్తులో అయినా ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇంద్రజ గురించి చెప్పారు సరే మరి రాజు, మహాద్రష్టలను కూడా ఇలాగే హైలైట్ చేస్తారా.
This post was last modified on October 16, 2023 7:36 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…