వారం రోజుల క్రితం జగదేకేవీరుడు అతిలోకసుందరికి చెందిన హక్కులన్నీ మావేనంటూ ఎవరు ఏ రూపంలో కాపీ కొట్టినా, స్ఫూర్తి చెందినా, రీమేక్ చేసినా తదుపరి తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వైజయంతి మూవీస్ సంస్థ పబ్లిక్ గా హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో పెద్ద చర్చే జరిగింది. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే మెగా 157ని ఉద్దేశించే ఈ ప్రకటన ఇచ్చారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరే రెండు మూడు రోజులు మాట్లాడుకుని అందరూ మర్చిపోయారు.
ఇవాళ హఠాత్తుగా మా ఇంద్రజ అంటూ అదే సినిమాలోని స్టిల్ ని తీసుకుని ఒక పోస్టర్ ని విడుదల చేసింది అశ్వినీదత్ బృందం. స్వచ్ఛత, అమాయకత్వం, శాంతికి సూచికగా అందరి హృదయాల్లో ఆమె స్థానం శాశ్వతం అంటూ ఓ సందేశం జోడించారు. బాగానే ఉంది కానీ అసలు ఇంద్రజ హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందో అంతు చిక్కడం లేదు. శ్రీదేవి పుట్టినరోజు ఆగస్టులో. చనిపోయింది ఫిబ్రవరిలో. జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయ్యింది మే నెలలో. మరి ప్రత్యేకంగా సందర్భం లేకపోయినా ఇలా మా ఇంద్రజ అంటూ ప్రత్యేకంగా హెడ్డింగ్ పెట్టడంలో ఆంతర్యం గుట్టుగా అనిపిస్తోంది.
ఏదైనా సినిమా లేదా తామే నిర్మించిన శ్రీమతి కుమారి వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమైతే అదేదో నేరుగా చెబితే సరిపోయేది. ఇలా ఇన్ డైరెక్ట్ గా పెడితే లేనిపోని డౌట్లు వస్తాయి. అసలు జగదేకేవీరుడు సీక్వెల్ ని రామ్ చరణ్ తో తీయాలని అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అశ్వినిదత్ మనసులోనూ అది ఉంది కానీ సరైన కథ దర్శకుడు కుదరాలి కదా. ఈలోగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ దేవరతో జరిగిపోయింది. మరి దగ్గరి భవిష్యత్తులో అయినా ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇంద్రజ గురించి చెప్పారు సరే మరి రాజు, మహాద్రష్టలను కూడా ఇలాగే హైలైట్ చేస్తారా.
This post was last modified on October 16, 2023 7:36 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…