వారం రోజుల క్రితం జగదేకేవీరుడు అతిలోకసుందరికి చెందిన హక్కులన్నీ మావేనంటూ ఎవరు ఏ రూపంలో కాపీ కొట్టినా, స్ఫూర్తి చెందినా, రీమేక్ చేసినా తదుపరి తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వైజయంతి మూవీస్ సంస్థ పబ్లిక్ గా హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో పెద్ద చర్చే జరిగింది. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే మెగా 157ని ఉద్దేశించే ఈ ప్రకటన ఇచ్చారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరే రెండు మూడు రోజులు మాట్లాడుకుని అందరూ మర్చిపోయారు.
ఇవాళ హఠాత్తుగా మా ఇంద్రజ అంటూ అదే సినిమాలోని స్టిల్ ని తీసుకుని ఒక పోస్టర్ ని విడుదల చేసింది అశ్వినీదత్ బృందం. స్వచ్ఛత, అమాయకత్వం, శాంతికి సూచికగా అందరి హృదయాల్లో ఆమె స్థానం శాశ్వతం అంటూ ఓ సందేశం జోడించారు. బాగానే ఉంది కానీ అసలు ఇంద్రజ హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందో అంతు చిక్కడం లేదు. శ్రీదేవి పుట్టినరోజు ఆగస్టులో. చనిపోయింది ఫిబ్రవరిలో. జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయ్యింది మే నెలలో. మరి ప్రత్యేకంగా సందర్భం లేకపోయినా ఇలా మా ఇంద్రజ అంటూ ప్రత్యేకంగా హెడ్డింగ్ పెట్టడంలో ఆంతర్యం గుట్టుగా అనిపిస్తోంది.
ఏదైనా సినిమా లేదా తామే నిర్మించిన శ్రీమతి కుమారి వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమైతే అదేదో నేరుగా చెబితే సరిపోయేది. ఇలా ఇన్ డైరెక్ట్ గా పెడితే లేనిపోని డౌట్లు వస్తాయి. అసలు జగదేకేవీరుడు సీక్వెల్ ని రామ్ చరణ్ తో తీయాలని అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అశ్వినిదత్ మనసులోనూ అది ఉంది కానీ సరైన కథ దర్శకుడు కుదరాలి కదా. ఈలోగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ దేవరతో జరిగిపోయింది. మరి దగ్గరి భవిష్యత్తులో అయినా ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇంద్రజ గురించి చెప్పారు సరే మరి రాజు, మహాద్రష్టలను కూడా ఇలాగే హైలైట్ చేస్తారా.
This post was last modified on October 16, 2023 7:36 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…