వారం రోజుల క్రితం జగదేకేవీరుడు అతిలోకసుందరికి చెందిన హక్కులన్నీ మావేనంటూ ఎవరు ఏ రూపంలో కాపీ కొట్టినా, స్ఫూర్తి చెందినా, రీమేక్ చేసినా తదుపరి తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వైజయంతి మూవీస్ సంస్థ పబ్లిక్ గా హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. దీని మీద ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో పెద్ద చర్చే జరిగింది. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే మెగా 157ని ఉద్దేశించే ఈ ప్రకటన ఇచ్చారని రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరే రెండు మూడు రోజులు మాట్లాడుకుని అందరూ మర్చిపోయారు.
ఇవాళ హఠాత్తుగా మా ఇంద్రజ అంటూ అదే సినిమాలోని స్టిల్ ని తీసుకుని ఒక పోస్టర్ ని విడుదల చేసింది అశ్వినీదత్ బృందం. స్వచ్ఛత, అమాయకత్వం, శాంతికి సూచికగా అందరి హృదయాల్లో ఆమె స్థానం శాశ్వతం అంటూ ఓ సందేశం జోడించారు. బాగానే ఉంది కానీ అసలు ఇంద్రజ హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందో అంతు చిక్కడం లేదు. శ్రీదేవి పుట్టినరోజు ఆగస్టులో. చనిపోయింది ఫిబ్రవరిలో. జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజ్ అయ్యింది మే నెలలో. మరి ప్రత్యేకంగా సందర్భం లేకపోయినా ఇలా మా ఇంద్రజ అంటూ ప్రత్యేకంగా హెడ్డింగ్ పెట్టడంలో ఆంతర్యం గుట్టుగా అనిపిస్తోంది.
ఏదైనా సినిమా లేదా తామే నిర్మించిన శ్రీమతి కుమారి వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమైతే అదేదో నేరుగా చెబితే సరిపోయేది. ఇలా ఇన్ డైరెక్ట్ గా పెడితే లేనిపోని డౌట్లు వస్తాయి. అసలు జగదేకేవీరుడు సీక్వెల్ ని రామ్ చరణ్ తో తీయాలని అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అశ్వినిదత్ మనసులోనూ అది ఉంది కానీ సరైన కథ దర్శకుడు కుదరాలి కదా. ఈలోగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ దేవరతో జరిగిపోయింది. మరి దగ్గరి భవిష్యత్తులో అయినా ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. ఇంద్రజ గురించి చెప్పారు సరే మరి రాజు, మహాద్రష్టలను కూడా ఇలాగే హైలైట్ చేస్తారా.
This post was last modified on October 16, 2023 7:36 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…