తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడైన ఈ కుర్రాడు.. ఇప్పటికే పవన్ అభిమానుల్లో, యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అతను హీరో కావడం లాంఛనమే అని పవన్ ఫ్యాన్స్ భావిస్తుండగా.. అకీరాకు నటన మీద ఆసక్తి లేదని.. తాను కానీ, పవన్ కానీ ఆ దిశగా ఫోర్స్ చేయట్లేదని ఇటీవల ఓ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్లలో మీడియాను కలిసిన సందర్భంగా రేణు దేశాయ్ చెప్పడం పవన్ అభిమానులకు రుచించలేదు.
అకీరా అరంగేట్రం ఎప్పుడెప్పుడా అని చూస్తున్న వారికి.. ఈ మాటలు నిరాశ కలిగించాయి. ఐతే రేణు ఇప్పటికి ఈ మాట అన్నా.. భవిష్యత్తులో అకీరా హీరో కావడం ఖాయం అనే ఆశతోనే ఉన్నారు మెగా అభిమానులు. ఇలాంటి టైంలో ‘టైగర్..’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జరిగిన పరిణామం అందరి దృష్టినీ ఆకర్షించింది.
పవన్ను ఎంతగానో అభిమానించే లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ఈ వేడుకలో అకీరా అరంగేట్రం గురించి మాట్లాడారు. స్టేజ్ మీది నుంచి ఆయన రేణును ఉద్దేశించి మాట్లాడారు. ‘‘రేణు దేశాయ్ గారూ.. మీరు సినిమా ఫీల్డుకి దూరంగా ఉండొచ్చమ్మా.. కానీ మీరు మాకు చాలా దగ్గర. మీరు చాలా త్వరలో మీ అబ్బాయిని హీరో చెయ్యాలి. అందులో ఆ అబ్బాయికి మీరే తల్లిగా యాక్ట్ చెయ్యాలి’’ అని కరతాళ ధ్వనుల మధ్య విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
అకీరాను హీరోను చెయ్యాలి అన్న టైంలో రేణు.. ఎస్ఎస్ అంటూ చేతితో సింహనాదం చేయడం విశేషం. అకీరా తొలి సినిమాలో అతడికి తల్లిగా నటించాలి అన్నపుడు కూడా ఆమె తప్పకుండా అన్నట్లుగా సంజ్ఞ చేశారు. మొన్న ఇంటర్వ్యూలో అన్న మాటలకు, ఈ వేడుకలో రేణు స్పందించిన తీరుకు అసలు పొంతన లేదు. తాజా పరిణామం పవన్ అభిమానులకు మంచి ఉత్సాహాన్నే ఇచ్చాయి.
This post was last modified on October 16, 2023 7:37 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…