సంక్రాంతికి తప్పుకునే సినిమాల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో కొన్ని వారాలుగా ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. గుంటూరు కారం రావడంలో ఎలాంటి సందేహం లేదు. సైంధవ్ డేట్ ఆల్రెడీ లాక్ చేసుకుంది. రేపు టీజర్ తో ఒక్కసారిగా ప్రమోషన్లకు ఊపు తేబోతున్నారు. ఇంకో రెండు రోజుల తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ (ప్రకటించబోయే టైటిల్) సైతం తగ్గేదేలే అంటూ తేదీతో సహా నామకరణం అనౌన్స్ చేయబోతున్నారు. హనుమాన్ సౌండ్ తగ్గిపోవడంతో డౌట్ గానే ఉంది కానీ ఎప్పటికప్పుడు ప్రశాంత్ వర్మతో పాటు టీమ్ మళ్ళీ మళ్ళీ వెనకడుగు ఉండదని చెబుతోంది.
ఇక నాగార్జున నా సామి రంగా ఖరారుగా చెప్పే దాకా నిర్ధారణకు రాలేం. వీటి సంగతి కాసేపు పక్కనపెడితే రవితేజ ఈగల్ తప్పుకోవచ్చనే ప్రచారం గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఊపందుకుంది. కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ సైతం అదే చెప్పుకుంటూ వచ్చాయి. అయితే ఇవాళ జరిగిన టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ ఈగల్ సంక్రాంతికి విడుదల చేయడం పక్కా అని మరోసారి ధృవీకరించారు. రెండు పండగలకు మాస్ మహారాజా నుంచి రెండు కానుకలు ఖాయమనే కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో పోటీ రసవత్తరంగా మారిపోయింది.
ఈ లెక్కన ఊహించిన దానికంటే జనవరి బాక్సాఫీస్ వేడి చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఎవరివీ చిన్న బ్యానర్లు కాకపోవడంతో రాజీ పడే ప్రసక్తి కనిపించడం లేదు. ఎటొచ్చి నాగార్జున మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. ఒకప్పుడు సోగ్గాడే చిన్ని నాయనాని భారీ కాంపిటీషన్ లోనూ బ్లాక్ బస్టర్ సాధించిన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ ఇప్పటి పరిస్థితి వేరు. అందుకే నా సామీ రంగా ఏం చేస్తుందనే సస్పెన్స్ బయ్యర్లలోనూ తీవ్రంగా ఉంది. ఇంకా చాలా టైం ఉందనుకోవడానికి లేదు. కళ్ళు మూసుకుంటే నాలుగు నెలలు గిరగిర తిరిగిపోతాయి కాబట్టి త్వరగా పనులు పూర్తి చేయాల్సిందే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…