భగవంత్ కేసరి ప్రమోషన్లలో భాగంగా ఇవాళ నిర్వహించిన ప్రెస్ మీట్ లో బాలకృష్ణ, శ్రీలీల కలిసి సినిమాలోని ఎమోషనల్ సాంగ్ కి స్టేజి మీద స్టెప్పులు వేయడం బాగా ఆకట్టుకుంది. బాలయ్య కంటే ఒకింత ఆలస్యంగా వచ్చిన అమ్మాయిని ఏమి అనకుండా దగ్గరగా వచ్చినప్పుడు తల మీద చేయి పెట్టి ఆశీర్వదించడంతో మొదలుపెట్టి చిచ్చా అన్న పిలుపుని సార్ధకం చేసేలా నిజంగానే ఆమెను కంటికి రెప్పలా బయట కూడా ప్రవర్తిస్తున్న తీరు హత్తుకునేలా ఉంది. దీన్ని బట్టే ఇద్దరి మధ్య బంధం కేవలం తెరకు మాత్రమే పరిమితం కాదని అభిమానులకు అర్థమైపోయింది.
ఈ అనుబంధం ఇంత బలంగా కుదిరింది కాబట్టే స్క్రీన్ పై కూడా అదే మేజిక్ జరుగుతుందని అనిల్ రావిపూడి బలంగా నమ్ముతున్నారు. భగవంత్ కేసరి కథ మొత్తం శ్రీలీల పాత్రనే కేంద్రంగా చేసుకుని తిరుగుతుంది. ఆమెను మానసికంగా శారీరకంగా ఎలాంటి ఒత్తిళ్లనైనా తట్టుకునేలా తీర్చిదిద్దాలని తాపత్రయపడే క్యారెక్టరే బాలయ్య. పనిలో పనిగా ఆ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న గ్రౌండ్ ఫ్లోర్ కామెంట్స్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. ఇంట్లో మోక్షజ్ఞతో తాను చాలా స్నేహంగా ఉంటానని ఆ చనువుతోనే శ్రీలీల ప్రస్తావన వచ్చినపుడు అలా అన్నాడని మరోసారి నొక్కి చెప్పారు.
భగవంత్ కేసరి ట్యాగ్ లైన్ కు తగ్గట్టు ఐ డోంట్ కేర్ మనస్తత్వాన్ని నిజ జీవితంలోనూ పాటిస్తామని బాలయ్య చెప్పడం ఫ్యాన్స్ లో హుషారు నింపించింది. విగ్గు గురించి మొన్నెవరో కామెంట్ చేశారని, అయినా వాళ్లకేం బాధో అర్థం కావడం లేదని ఇటీవలే తన మీద వ్యంగ్య విమర్శలు చేసిన వాళ్లకు చురకలు విసిరారు. మొత్తానికి మంచి ఎనర్జీతో బాలయ్య టీమ్ స్టేజి మీద చేసిన సందడి బాగుంది. అక్టోబర్ 19కి ఆదివారం మినహాయించి ఇంకో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. రేపు ఎల్లుండి లోపు బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి.
This post was last modified on October 15, 2023 8:15 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…