రీ రిలీజుల ట్రెండ్ బాగా నెమ్మదించిన నేపథ్యంలో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ శంకర్ దాదా ఎంబిబిఎస్ మళ్ళీ విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. నవంబర్ 4 గ్రాండ్ గా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ క్లాసిక్ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలిచిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ రీమేక్ గా 2004లో వచ్చిన ఈ మెగా మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ రచన చేయగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఛార్ట్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా చిరు, శ్రీకాంత్ కామెడీ ఓ రేంజ్ లో పేలింది.
ఒకరకంగా నవంబర్ 4 మంచి డేట్ పట్టాడు శంకర్ దాదా. ఆ వారం చెప్పుకోదగ్గ భారీ రిలీజులు లేవు. ముందు రోజు కొన్ని ఉన్నాయి. తరుణ్ భాస్కర్ కీడా కోలా మీద యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రిలీజ్ నాటికి ప్రమోషన్లతో దాన్ని పీక్స్ కి తీసుకెళ్లడం ఖాయం. స్టార్ క్యాస్టింగ్ లేదు కాబట్టి కంటెంట్ మీదే ఆధారపడాలి. ఓటిటి మూవీకి సీక్వెల్ గా వస్తున్న మా ఊరి పొలిమేర 2కి బన్నీ వాస్ అండగా నిలవడంతో థియేటర్ల పరంగా చెప్పుకోదగ్గ మద్దతు దక్కుతోంది. ఇవి కాకుండా విధి, నరకాసురలు ఉన్నాయి. మొదటి రోజే హౌస్ ఫుల్స్ వేయించే రేంజ్ వీటికి లేకపోవడం వల్ల చిరు నిర్మాతలు అలా ప్లాన్ చేసుకున్నారు.
బాగానే ఉంది కానీ జనంలో పాత సినిమాలను మళ్ళీ చూసే ఆసక్తి క్రమంగా తగ్గుతోందని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. కల్ట్ క్లాసిక్ గా చెప్పుకునే 7జి బృందావన్ కాలనీ హైదరాబాద్ మినహాయించి ఎక్కడ మేజిక్ చేయలేదు. మన్మథుడు, రఘువరన్ బిటెక్ హంగామా మొదటి రోజుకు మాత్రమే పరిమితమయ్యింది. ఇలాంటి సిచువేషన్ లో శంకర్ దాదా ఎంబిబిఎస్ కు ఏ మేరకు వస్తారో చెప్పడం కష్టమే. మెగా ఫ్యాన్స్ మాత్రం ఇలాంటివి పుట్టినరోజు లేదా ఏదైనా పండగ సందర్భంలో ప్లాన్ చేయకుండా ఇలా డ్రై టైంలో రిలీజ్ చేయడం ఏమిటని కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి శంకర్, ఏటిఎంలు ట్రెండ్ ని సృష్టిస్తారో లేదో.
This post was last modified on October 15, 2023 11:33 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…