రీ రిలీజుల ట్రెండ్ బాగా నెమ్మదించిన నేపథ్యంలో చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ శంకర్ దాదా ఎంబిబిఎస్ మళ్ళీ విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. నవంబర్ 4 గ్రాండ్ గా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ క్లాసిక్ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలిచిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ రీమేక్ గా 2004లో వచ్చిన ఈ మెగా మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ రచన చేయగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఛార్ట్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా చిరు, శ్రీకాంత్ కామెడీ ఓ రేంజ్ లో పేలింది.
ఒకరకంగా నవంబర్ 4 మంచి డేట్ పట్టాడు శంకర్ దాదా. ఆ వారం చెప్పుకోదగ్గ భారీ రిలీజులు లేవు. ముందు రోజు కొన్ని ఉన్నాయి. తరుణ్ భాస్కర్ కీడా కోలా మీద యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రిలీజ్ నాటికి ప్రమోషన్లతో దాన్ని పీక్స్ కి తీసుకెళ్లడం ఖాయం. స్టార్ క్యాస్టింగ్ లేదు కాబట్టి కంటెంట్ మీదే ఆధారపడాలి. ఓటిటి మూవీకి సీక్వెల్ గా వస్తున్న మా ఊరి పొలిమేర 2కి బన్నీ వాస్ అండగా నిలవడంతో థియేటర్ల పరంగా చెప్పుకోదగ్గ మద్దతు దక్కుతోంది. ఇవి కాకుండా విధి, నరకాసురలు ఉన్నాయి. మొదటి రోజే హౌస్ ఫుల్స్ వేయించే రేంజ్ వీటికి లేకపోవడం వల్ల చిరు నిర్మాతలు అలా ప్లాన్ చేసుకున్నారు.
బాగానే ఉంది కానీ జనంలో పాత సినిమాలను మళ్ళీ చూసే ఆసక్తి క్రమంగా తగ్గుతోందని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. కల్ట్ క్లాసిక్ గా చెప్పుకునే 7జి బృందావన్ కాలనీ హైదరాబాద్ మినహాయించి ఎక్కడ మేజిక్ చేయలేదు. మన్మథుడు, రఘువరన్ బిటెక్ హంగామా మొదటి రోజుకు మాత్రమే పరిమితమయ్యింది. ఇలాంటి సిచువేషన్ లో శంకర్ దాదా ఎంబిబిఎస్ కు ఏ మేరకు వస్తారో చెప్పడం కష్టమే. మెగా ఫ్యాన్స్ మాత్రం ఇలాంటివి పుట్టినరోజు లేదా ఏదైనా పండగ సందర్భంలో ప్లాన్ చేయకుండా ఇలా డ్రై టైంలో రిలీజ్ చేయడం ఏమిటని కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి శంకర్, ఏటిఎంలు ట్రెండ్ ని సృష్టిస్తారో లేదో.
This post was last modified on October 15, 2023 11:33 am
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…