యుక్త వయసులో ఒక కెరీర్ ఎంచుకుని అందులో నిలదొక్కుకోవడానికి, ఎదగడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఒక దశ దాటాక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. ఉద్యోగం చేస్తుండొచ్చు. వ్యాపారంలో ఉండొచ్చు.. ఇంకేదైనా పనిలో ఉండొచ్చు. ముదిమి వయసులో అన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా శేష జీవితాన్ని గడపాలనుకుంటారు.
పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. ఉన్న చోటి నుంచి దూరంగా వెళ్లిపోయి ప్రశాంత జీవనాన్ని సాగించాలనుకుంటారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాంటి ప్రణాళికలోనే ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం వాళ్లు ఇప్పటికే పక్కాగా ప్రణాళిక రచించుకున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని ఈదులూరు అనే గ్రామాన్ని ఎంచుకున్నారట. రిటైర్మెంట్ తర్వాత తన శేష జీవితం అక్కడే కొనసాగుతుందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు.
ఈదులూరు గ్రామ పొలిమేరల్లో తనతో పాటు కీరవాణి, ఇతర కుటుంబ సభ్యులు పక్క పక్కనే పొలాలు కొన్నామని.. ప్రస్తుతం ప్రతి నెలా ఒక ఆదివారం అక్కడికి వెళ్లి వస్తుంటామని జక్కన్న చెప్పాడు. రిటైరయ్యాక పిల్లలందరూ స్థిరపడ్డాక పెద్దవాళ్లం అక్కడి వెళ్లి ఉండాలన్నది తమ ప్లాన్ అని రాజమౌళి వెల్లడించాడు. ఐతే వచ్చే పదేళ్ల వరకు రిటైర్మెంట్ ఆలోచనలేమీ లేవని ఆయన స్పష్టం చేశాడు.
ఇప్పుడైతే వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు కానీ.. ఒకప్పుడు రాజమౌళి, కీరవాణి తదితరులంతా కలిసి చెన్నైలో ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అన్నదమ్ములే. 15 మంది దాకా ఉన్న కుటుంబాన్ని వాళ్లిద్దరే పోషించేవాళ్లు. ముందు విజయేంద్ర.. ఆ తర్వాత కీరవాణి ఇండస్ట్రీలో నిలదొక్కుకుని కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొస్తే.. తర్వాత రాజమౌళి దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి తక్కువ సమయంలోనే ఒక స్థాయిని అందుకున్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఢోకా లేకపోయింది.
This post was last modified on April 25, 2020 3:59 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…