యుక్త వయసులో ఒక కెరీర్ ఎంచుకుని అందులో నిలదొక్కుకోవడానికి, ఎదగడానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరూ ఒక దశ దాటాక విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. ఉద్యోగం చేస్తుండొచ్చు. వ్యాపారంలో ఉండొచ్చు.. ఇంకేదైనా పనిలో ఉండొచ్చు. ముదిమి వయసులో అన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా శేష జీవితాన్ని గడపాలనుకుంటారు.
పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. ఉన్న చోటి నుంచి దూరంగా వెళ్లిపోయి ప్రశాంత జీవనాన్ని సాగించాలనుకుంటారు. దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాంటి ప్రణాళికలోనే ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాతి జీవితం కోసం వాళ్లు ఇప్పటికే పక్కాగా ప్రణాళిక రచించుకున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని ఈదులూరు అనే గ్రామాన్ని ఎంచుకున్నారట. రిటైర్మెంట్ తర్వాత తన శేష జీవితం అక్కడే కొనసాగుతుందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు.
ఈదులూరు గ్రామ పొలిమేరల్లో తనతో పాటు కీరవాణి, ఇతర కుటుంబ సభ్యులు పక్క పక్కనే పొలాలు కొన్నామని.. ప్రస్తుతం ప్రతి నెలా ఒక ఆదివారం అక్కడికి వెళ్లి వస్తుంటామని జక్కన్న చెప్పాడు. రిటైరయ్యాక పిల్లలందరూ స్థిరపడ్డాక పెద్దవాళ్లం అక్కడి వెళ్లి ఉండాలన్నది తమ ప్లాన్ అని రాజమౌళి వెల్లడించాడు. ఐతే వచ్చే పదేళ్ల వరకు రిటైర్మెంట్ ఆలోచనలేమీ లేవని ఆయన స్పష్టం చేశాడు.
ఇప్పుడైతే వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు కానీ.. ఒకప్పుడు రాజమౌళి, కీరవాణి తదితరులంతా కలిసి చెన్నైలో ఒకే ఇంట్లో ఉండేవాళ్లు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అన్నదమ్ములే. 15 మంది దాకా ఉన్న కుటుంబాన్ని వాళ్లిద్దరే పోషించేవాళ్లు. ముందు విజయేంద్ర.. ఆ తర్వాత కీరవాణి ఇండస్ట్రీలో నిలదొక్కుకుని కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొస్తే.. తర్వాత రాజమౌళి దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి తక్కువ సమయంలోనే ఒక స్థాయిని అందుకున్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఢోకా లేకపోయింది.
This post was last modified on April 25, 2020 3:59 pm
భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్యుత్తమమైన, విభిన్నమైన చిత్రాల్లో అరవింద సమేత ఒకటి. అందులో కీలక పాత్రలు పోషించిన ఆర్టిస్టులందరికీ మంచి…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…