పండగ దగ్గర్లో థియేటర్ల యజమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దసరా సినిమాలు రావడానికి ఇంకో అయిదు రోజులు ఉండటంతో గంటనో యుగంగా గడుపుతున్నారు. కారణం అత్యధిక శాతం వాటిలో కనీసం అద్దెలు, కరెంట్ బిల్లులు వసూలయ్యేంత కలెక్షన్లు లేకపోవడమే. నిన్న రిలీజైన వాటిలో ఏ ఒక్కదాని మీద జనానికి ఆసక్తి లేదని వసూళ్లు స్పష్టం చేశాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడేట్టు ఇవాళ ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ దెబ్బకు అందరూ ఇళ్లలోనే ఉండిపోవడంతో బయటికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఉద్యోగం, వ్యాపారరిత్యా అవసరాలు ఉన్న బాపతు తప్ప అందరూ క్రికెట్లోనే.
అన్ని వైపులా ఇలా దెబ్బలు తగలడంతో ఎగ్జిబిటర్ల కష్టాలు మాములుగా లేవు. ఎంత చిన్న హాలైనా సరే షోకి కనీసం పది వేల కలెక్షన్ గ్రాస్ రూపంలో రానిదే కష్టమని, చేతి నుంచి వేసుకుని రోజూ చిల్లర లెక్కబెట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. నిన్న చాలా నయం. నేషనల్ సినిమా డే పేరుతో మల్టీప్లెక్సులు తెలంగాణలో 112 రూపాయలకు టికెట్లు అమ్మడం చాలా మేలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ మాత్రం అదృష్టానికి కూడా నోచుకోలేకపోయారు. ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. అందుకే మ్యాడ్, జవాన్, స్కందలతో నెట్టుకు రావాల్సి వస్తోంది.
గురువారం దాకా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. భగవంత్ కేసరి, లియోలు 19నే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఊరిలో తొంభై శాతం పైగా స్క్రీన్లు వీటినే వేసుకుంటాయి. మరుసటి రోజు టైగర్ నాగేశ్వరరావు వచ్చి తనకు కేటాయించిన వాటా తీసుకుంటాడు. వీటిలో రెండింటికి పాజిటివ్ టాక్ వచ్చినా చాలు అక్టోబర్ చివరి దాకా థియేటర్ల ఫీడింగ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పై పెచ్చు 25 వరకు స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఉంటాయి కనక కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆపై నవంబర్ నుంచి చెప్పుకోదగ్గ సినిమాలే క్యూలో ఉండటంతో ఆపై డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకోవచ్చు.
This post was last modified on October 14, 2023 5:13 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…