కొన్ని సినిమాలకు ఓటీటీలో వచ్చే స్పందన ఆశ్చర్యపరుస్తుంటుంది. అక్కడ అవి అద్భుతమైన స్పందన తెచ్చుకుని బ్లాక్బస్టర్ రేంజికి వెళ్తుంటాయి. ‘రాజావారు రాణివారు’ అనే చిన్న సినిమా థియేటర్లకు వచ్చి వెళ్లిన సంగతే జనాలకు తెలియదు. కానీ ఆ చిత్రం కరోనా టైంలో ఓటీటీలో మంచి స్పందన తెచ్చుకుంది. ఇటీవలే ఆహా ఓటీటీలో రిలీజైన ‘ది గ్రేట్ ఇండియన్ సుసైడ్’ కూడా యావరేజ్ కంటెంట్తోనే భారీగా వ్యూస్ తెచ్చుకుంటోంది.
రెండేళ్ల ముందు హాట్ స్టార్ ఓటీటీలో రిలీజైన ‘మా ఊరి పొలిమేర’ అనే చిన్న సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. రిలీజైనప్పటి కంటే తర్వాత తర్వాత దీనికి ఫాలోయింగ్ పెరిగి మంచి పాపులారిటీ సంపాదించింది. చేతబడుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఓటీటీలో సూపర్ హిట్ రేంజికి వెళ్లిన ఈ సినిమాకు సీక్వెల్ తీసింది చిత్ర బృందం.
ఈ సీక్వెల్కు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లోనే కాక ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ కనిపిస్తోంది. నవంబరు 3న రిలీజవుతున్న ‘మా ఊరి పొలిమేర-2’ను ఫ్యాన్స్ రేటుకు బన్నీ వాసు, నందిపాటి వంశీ కలిసి కొని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ అయింది. ఐతే ఈ ట్రైలర్ చూస్తే సీక్వెల్ ఛాయలు పెద్దగా కనిపించలేదు. ఒక కొత్త కథతో దీన్ని డీల్ చేసినట్లు కనిపిస్తోంది.
‘మా ఊరి పొలిమేర’లో ఉన్న ప్రధాన పాత్రలతో పాటు కొన్ని కొత్త క్యారెక్టర్లు యాడ్ అయ్యాయి. కథ చూస్తే ‘కార్తికేయ’, ‘సుబ్రహ్మణ్యపురం’ లాంటి చిత్రాలను తలపిస్తోంది. మిస్టరీగా మారిన ఒక గుడి నేపథ్యంలో కథ నడిచేలా కనిపిస్తోంది. అందరూ భయంతో వణికిపోయే గుడిలోకి కొమిరి (సత్యం రాజేష్) వెళ్లి ఏం చేశాడన్నదే సస్పెన్స్. ‘మా ఊరి పొలిమేర’ సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమాకు కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టి గ్రాండ్గానే తీసినట్లు కనిపిస్తోంది. ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు.
This post was last modified on October 14, 2023 5:17 pm
ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…
‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…
కీలకమైన ఎన్నికల వేళ.. ఏపీలో రెండు సంచలన విషయాలపై నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జగన్ విదేశీ…
ఏపీలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని.. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఘటనలో…
"నా అక్కలు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. తమ్ముడని కూడా చూడకుండా మాటలు…
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…