మాములుగా ఓటిటి మూవీకి కొనసాగింపంటే మళ్ళీ డిజిటల్ లోనే రావడం సహజం. కానీ సీక్వెల్ ని థియేటర్లకు సిద్ధం చేయడం అనూహ్యం. మా పూరి పొలిమేర 2 బృందం ఆ రిస్క్ చేస్తోంది. గతంలో డిస్నీ హాట్ స్టార్ కోసం తీసిన ఈ విలేజ్ హారర్ సినిమా ఆన్ లైన్లో భారీ స్పందన దక్కించుకుంది. కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టులతో డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీ కృష్ణ నిర్మించారు. ఇవాళ కార్తికేయ, హరీష్ శంకర్ బన్నీ వాస్ తదితరులు ముఖ్య అతిథులుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. మొదటి భాగం కథ తెలిసిందే కాబట్టి దానికి కంటిన్యుయేషన్ ఇందులో చూపించారు.
ఆటో డ్రైవర్ కొమురి(సత్యం రాజేష్)కు ఊరి చివర ఉన్న గుళ్లో ఏదో రహస్యం ఉన్నట్టు అనుమానం వస్తుంది. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అసలు నిజం తెలుసుకోవడానికి వస్తాడో పోలీస్ ఆఫీసర్(రాకేందు మౌళి). అయితే స్నేహితుడైన బలిజ(గెటప్ శీను), తమ్ముడు జంగయ్య(బాలాదిత్య)లకు అనుమానం రాకుండా ఏదో రహస్యంగా చేస్తున్న కొమురికి అధికారులు గ్రామానికి వచ్చాక అసలు సమస్య వస్తుంది. ఎక్కడో ఉండే పద్మనాభస్వామి ఆలయానికి ఈ ఘటనలకు సంబంధం ఉందనే విషయం బయట పడుతుంది. అసలు మిస్టరీ ఏంటనేది తెరమీద చూడాలి.
కంటెంట్ తో పాటు ఈసారి విజువల్స్ లో డెప్త్ పెరిగింది. నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి. పూర్తిగా చేతబడుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మా ఊరి పొలిమేర 2లో అదనంగా దేవుళ్ళ నేపధ్యాన్ని జోడించారు. కొత్త ఆర్టిస్టులు తోడయ్యారు. గ్యానీ నేపధ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. టెక్నికల్ గా క్వాలిటీని పెంచిన ఈ సినిమా మీద దెయ్యాల ప్రియులకు ఆసక్తి కలిగేలా ట్రైలర్ కట్ చేశారు. పెద్ద హీరోలకు మాత్రమే ఉండే సీక్వెల్ ట్రెండ్ ని ఈసారి ఇలాంటి చిన్న చిత్రానికి అనుసరించడం కొత్తగా ఉంది. ఫలితం బాగా వస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రయత్నాలు జరుగుతాయి.
This post was last modified on October 14, 2023 12:29 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…