Movie News

‘బేబి’ ప్రొడ్యూసర్.. నలుగురు డైరెక్టర్లతో

పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే.. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్ ‘బేబి’నే అని చెప్పాలి. లో బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల నుంచి రూ.90 కోట్ల దాకా గ్రాస్ రాబట్టడం విశేషం. నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా కూడా మంచి ఆదాయం తెచ్చిపెట్టిందీ సినిమా. ఈ సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారిన ఎస్కేఎన్‌.. ఊహించని స్థాయిలో లాభాలు అందుకున్నాడు. ఇక వేరే వాళ్ల భాగస్వామ్యం లేకుండా సినిమాలు తీసే స్థితికి చేరుకున్నాడు.

ఇప్పుడతను ఒకేసారి నాలుగు సినిమాలకు రంగం సిద్ధం చేయడం విశేషం. ఎస్కేఎన్ బేనర్లో రాబోయే తర్వాతి నాలుగు చిత్రాలకు దర్శకులు ఖరారయ్యారు. అందులో ఒకరు ‘బేబి’ దర్శకుడు సాయిరాజేషే. వీరి కలయికలో ‘బేబి’ సీక్వెల్ రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. అంతే కాక ‘బేబి’ని తమిళంలో తీస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదెంత వరకు నిజమో కానీ.. ‘బేబి’ కాంబో మాత్రం మళ్లీ చూడబోతున్నాం.

మరోవైపు సాయిరాజేష్ కథతో ‘కలర్ ఫొటో’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సందీప్ రాజ్‌తోనూ ఎస్కేఎన్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అలాగే చాలా ఏళ్ల కిందట ‘ఇంకోసారి’ అనే సినిమా తీసిన సుమన్ పాతూరి కూడా ఎస్కేఎన్‌తో అసోసియేట్ కాబోతున్నాడు. ‘ఇంకోసారి’ హ్యాపీడేస్ తరహాలో సాగే ఫీల్ గుడ్ మూవీ. మంచి సినిమానే కానీ సరిగా ఆడలేదు. మళ్లీ ఇంత కాలానికి సుమన్ తిరిగి మెగా ఫోన్ పడుతున్నాడు.

వీరితో పాటు వెంకట రవీంద్ర అనే కొత్త దర్శకుడితోనూ ఎస్కేఎన్ సినిమా ఉండబోతోంది. ఈ నలుగురు దర్శకులతో ఫొటో దిగి వీరితో తాను సినిమాలు చేయబోతున్న విషయాన్ని వెల్లడించాడు ఎస్కేఎన్. ఒక్క సినిమా విజయం ఒకేసారి నలుగురు దర్శకులతో సినిమా అనౌన్స్ చేసే స్థాయికి తీసుకొచ్చిందంటే అది పెద్ద విశేషమే. ఈ సినిమాల్లో హీరోలెవరు, ఇతర విశేషాలేంటదన్నది త్వరలోనే వెల్లడించనున్నాడు ఎస్కేఎన్.

This post was last modified on October 13, 2023 3:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

31 minutes ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

1 hour ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago