టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన సీనియర్ హీరోల్లో రాజశేఖర్ ఒకడు. అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు లాంటి చిత్రాలతో 90వ దశకంలో ఆయన ఊపు మామూలుగా ఉండేది కాదు. కానీ 2000 తర్వాత రాజశేఖర్ వైభవం అంతా కరిగిపోతూ వచ్చింది. ట్రెండుకు తగ్గ సినిమాలు తీయక రేసులో బాగా వెనుకబడిపోయాడు ఈ సీనియర్ హీరో. కొన్నేళ్ల ముందు ఆయన మార్కెట్ దాదాపుగా జీరో అయిపోయింది.
ఇక మళ్లీ రైజ్ కావడం కష్టం అనుకుంటున్న దశలో ‘గరుడవేగ’తో మళ్లీ ఓ సక్సెస్ అందుకున్నాడు. దీని తర్వాత ఆయన చేసిన ‘కల్కి’కి మంచి హైపే వచ్చింది. కానీ ఆ హైప్కు తగ్గట్లు సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర నిరాశాజనక ఫలితం తప్పలేదు. మళ్లీ పుంజుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించట్లేదు. రాజశేఖర్ చివరి సినిమా ‘శేఖర్’ వచ్చింది వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. ఆ తర్వాత కొత్త సినిమా ఏదీ మొదలుపెట్టలేదాయన.
ఐతే సీనియర్ హీరోల్లో చాలామంది మార్కెట్ కోల్పోయాక.. నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ వైపు చూడటం మామూలే. కానీ రాజశేఖర్ మాత్రం అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. తనకు ‘ధృవ’లో అరవింద్ స్వామి చేసిన క్యారెక్టర్ లాంటిది వస్తే తప్ప క్యారెక్టర్ రోల్స్ చేయను అని ఆయన భీష్మించుకుని కూర్చున్నాడు.
ఐతే ఇప్పుడు అలాంటి పాత్రే వచ్చిందా లేక కాంప్రమైజ్ అయ్యాడా తెలియదు కానీ.. ఎట్టకేలకు రాజశేఖర్ క్యారెక్టర్ రోల్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. నితిన్ కొత్త చిత్రం ‘ఎక్స్ట్రా.. ఆర్డినరీ మ్యాన్’లో రాజశేఖర్ ఒక స్పెషల్ రోల్ చేశాడట. ఇటీవలే ఆ పాత్రకు సంబంధించి చిత్రీకరణ మొదలైనట్లు తెలిసింది. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఈ పాత్ర కోసం రాజశేఖర్ ఎంపిక కావడం విశేషం. ఈ పాత్ర క్లిక్ అయితే రాజశేఖర్ నుంచి మున్ముందు క్యారెక్టర్, విలన్ పాత్రలు మరిన్ని చూడొచ్చేమో.
This post was last modified on October 12, 2023 6:50 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…