మహర్షిలో ఇదే కథ ఇదే కథ పాట మన టాలీవుడ్ రిలీజులకు అన్వయించుకోవచ్చు. ఉంటే కరువు లేదంటే వరదలు అన్న రీతిలో కొన్ని శుక్రవారాలు అనాథలా వదిలేయడం లేదా ఒకేసారి మూకుమ్మడిగా ముప్పేటదాడి చేయడం నిత్య కృత్యంగా మారుతోంది. రేపటి బాక్సాఫీస్ పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. కేవలం తెలుగు వరకే చూసుకున్నా ఒకటి రెండు కాదు ఏకంగా 11 సినిమాలు, 1 రీ రిలీజ్ ప్రేక్షకులను కాచుకోమంటూ సవాల్ విసురుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఒక్కటంటే ఒక్కటి కనీస బజ్ ని మోయడం లేదు. బుకింగ్స్ సైతం చాలా నీరసంగా ఉన్నాయి.
వాటివైపు ఒక లుక్ వేస్తే రాక్షస కావ్యం, సగిలేటి కథ, తంతిరం చాప్టర్ 1, పెళ్ళెప్పుడు, మధురపూడి గ్రామం అనే నేను, నీలోనే నేను, మిస్టరీ, గుణసుందరి కథ, ఒక్కడే వన్ ఇవన్నీ రేపు వస్తుండగా ఒక రోజు అడ్వాన్స్ గా ఇవాళ మా ఊరి సిన్మాని విడుదల చేశారు. ఇవి కాకుండా జయం రవి నయనతార డబ్బింగ్ మూవీ గాడ్ తో పాటు రతి నిర్వేదంని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇన్నేసి గంపగుత్తగా వస్తున్నా దేని మీద ఆడియన్స్ కి కనీస ఆసక్తి లేదు. గత వారం కూడా ఆరేడు అదృష్టాన్ని పరీక్షించుకుంటే వాటిలో మ్యాడ్ ఒక్కటే గెలిచింది. అది కూడా సితార లాంటి బ్యానర్ ప్రోడక్ట్ కాబట్టి.
కానీ ఇప్పుడొచ్చే వాటికి అంత సీన్ లేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప రేపు థియేటర్లలో జనం పెద్దగా ఉండరు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీప్లెక్స్ చైన్స్ అక్టోబర్ 13 నేషనల్ సినిమా డేని పురస్కరించుకుని కేవలం 99 రూపాయలకే టికెట్లు అమ్ముతున్నాయి. కొన్ని స్నాక్స్ కూడా అంతే ధరలో ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీం వాటిని ఏమైనా కాపాడుతుందేమో చూడాలి. అయినా సరే రాణిగంజ్ లాంటి వాటికి బుకింగ్స్ బాగున్నాయి కానీ తక్కువ ధర అయినా చిన్న సినిమాల పట్ల జనం ఆసక్తి చూపించడం లేదు. అనూహ్యంగా వేటికైనా సర్ప్రైజ్ టాక్ వస్తే తప్ప ఈ సన్నివేశంలో పెద్ద మార్పు ఉండదు
This post was last modified on October 12, 2023 3:13 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…