ఇటీవలే కూతురిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఆ గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి తిరిగి సినిమా ప్రపంచంలోకి వచ్చేశాడు. అతని కొత్త చిత్రం రత్తం గత వారం ఆరో తేదీ తమిళనాడులో గ్రాండ్ గా రిలీజయ్యింది. తెలుగులో విపరీతమైన పోటీతో పాటు ప్రమోషన్లకు టైం లేకపోవడంతో డబ్బింగ్ వెర్షన్ వాయిదా వేశారు. ట్రైలర్ చూసినప్పుడు దీని మీద చెప్పుకోదగ్గ అంచనాలే నెలకొన్నాయి. అందులోనూ గెటప్ కాస్త డిఫరెంట్ గా అనిపించడంతో ఫ్యాన్స్ మళ్ళీ హిట్టు పడుతుందేమోనని ఎదురు చూశారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మళ్ళీ నిరాశ తప్పలేదు.
కథ పరంగా రత్తంది కాస్త డిఫరెంట్ లైనే. కోల్కతాలో గుర్రాల కాపరిగా ఉన్న రంజిత్(విజయ్ ఆంటోనీ) ఒకప్పటి తన మీడియా గురువు (నిజగల్ రవి) కొడుకు హత్య చేయబడిన కారణంగా చెన్నైకి తిరిగి వచ్చి ఆయన సంస్థలోనే చేరతాడు. మధుమిత(నందిత దాస్) దగ్గర అప్రెంటీస్ గా ఉద్యోగం వేయించుకుని అలాంటి మర్డర్ల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఇతని మీద పెత్తనం చెలాయించాలని చూసిన మధుమితకు రంజిత్ ఒకప్పుడు సెలబ్రిటీ జర్నలిస్ట్ అని తెలుస్తుంది. తర్వాత ఈ దారుణాలు ఎవరు చేశారు, వెనుక ఉన్న చీకటి కోణాలు వెలికి తీయడమే అసలు స్టోరీ
బాషా, సమరసింహారెడ్డి టైపులో అండర్ కరెంట్ హీరోయిజంని ఒక సోషల్ ఇష్యూకి ముడిపెట్టాలని చూసిన డెబ్యూ దర్శకుడు సిఎస్ ఆముదన్ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలయ్యాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం విపరీతమైన స్లో నెరేషన్ తో ఇంటరెస్టింగ్ గా ఉండాల్సిన స్క్రీన్ ప్లే కాస్తా బోరింగ్ గా సాగుతుంది. రెండో సగంలో వేగం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో టెంపో పండకపోవడంతో రత్తం కిక్ ఇవ్వలేకపోయింది. తమిళంలోనే సోసోగా ఆడుతున్న రత్తంలో ఒకవేళ తెలుగులో వచ్చినా ఆడటం కష్టమే. ఆ మధ్య ఇలాగే కుట్ర రిలీజ్ చేస్తే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు.
ఇటీవలే విడుదలైన సింగ్ గీతంకు ఊహించిన దానికన్నా పెద్ద స్పందన కనిపిస్తోంది. కంటెంట్ మాస్ ప్రేక్షకులకు పూర్తిగా కనెక్టయ్యేలా లేకపోయినా…
2026 సంవత్సరంలో ఆరు నెలలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకో రెండు వారాలు బాలన్స్ ఉంది. ఈ ఏడాది మొత్తంలో పదమూడు…
ఈ ఏడాది మోస్ట్ అవైడెట్ సినిమాల్లో టాక్సిక్ ఒకటి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని స్టార్…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు మధ్య పలు కేసుల విచారణకు…
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…