ఇటీవలే కూతురిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఆ గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి తిరిగి సినిమా ప్రపంచంలోకి వచ్చేశాడు. అతని కొత్త చిత్రం రత్తం గత వారం ఆరో తేదీ తమిళనాడులో గ్రాండ్ గా రిలీజయ్యింది. తెలుగులో విపరీతమైన పోటీతో పాటు ప్రమోషన్లకు టైం లేకపోవడంతో డబ్బింగ్ వెర్షన్ వాయిదా వేశారు. ట్రైలర్ చూసినప్పుడు దీని మీద చెప్పుకోదగ్గ అంచనాలే నెలకొన్నాయి. అందులోనూ గెటప్ కాస్త డిఫరెంట్ గా అనిపించడంతో ఫ్యాన్స్ మళ్ళీ హిట్టు పడుతుందేమోనని ఎదురు చూశారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మళ్ళీ నిరాశ తప్పలేదు.
కథ పరంగా రత్తంది కాస్త డిఫరెంట్ లైనే. కోల్కతాలో గుర్రాల కాపరిగా ఉన్న రంజిత్(విజయ్ ఆంటోనీ) ఒకప్పటి తన మీడియా గురువు (నిజగల్ రవి) కొడుకు హత్య చేయబడిన కారణంగా చెన్నైకి తిరిగి వచ్చి ఆయన సంస్థలోనే చేరతాడు. మధుమిత(నందిత దాస్) దగ్గర అప్రెంటీస్ గా ఉద్యోగం వేయించుకుని అలాంటి మర్డర్ల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఇతని మీద పెత్తనం చెలాయించాలని చూసిన మధుమితకు రంజిత్ ఒకప్పుడు సెలబ్రిటీ జర్నలిస్ట్ అని తెలుస్తుంది. తర్వాత ఈ దారుణాలు ఎవరు చేశారు, వెనుక ఉన్న చీకటి కోణాలు వెలికి తీయడమే అసలు స్టోరీ
బాషా, సమరసింహారెడ్డి టైపులో అండర్ కరెంట్ హీరోయిజంని ఒక సోషల్ ఇష్యూకి ముడిపెట్టాలని చూసిన డెబ్యూ దర్శకుడు సిఎస్ ఆముదన్ దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలయ్యాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం విపరీతమైన స్లో నెరేషన్ తో ఇంటరెస్టింగ్ గా ఉండాల్సిన స్క్రీన్ ప్లే కాస్తా బోరింగ్ గా సాగుతుంది. రెండో సగంలో వేగం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో టెంపో పండకపోవడంతో రత్తం కిక్ ఇవ్వలేకపోయింది. తమిళంలోనే సోసోగా ఆడుతున్న రత్తంలో ఒకవేళ తెలుగులో వచ్చినా ఆడటం కష్టమే. ఆ మధ్య ఇలాగే కుట్ర రిలీజ్ చేస్తే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు.
This post was last modified on October 12, 2023 11:41 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…