ఇండియాలో ఒకప్పుడు సినిమాల నిడివి మినిమం రెండున్నర గంటలు ఉండేది. రెండున్నర గంటలు అన్నది స్టాండర్డ్ రన్ టైం కాగా.. చాలా వరకు సినిమాలు అంతకంటే ఎక్కువ నిడివితోనే ఉండేవి. కానీ సోషల్ మీడియా ఊపందుకున్నాక కొంచెం నిడివి ఎక్కువ అయితే ల్యాగ్ ల్యాగ్ అనడం ఎక్కువైంది. దీంతో ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తెరకు పని చెప్పడం ఎక్కువైంది. పాటలు, అనవసర సీన్లు తీసేసి 2-2.15 గంటల నిడివితో సినిమాలు రిలీజ్ చేయడం ఎక్కువైంది.
కానీ ఈ మధ్య మళ్లీ ట్రెండ్ మారుతోంది. కంటెంట్ ఉంటే నిడివి పెద్ద సమస్య కాదన్న అభిప్రాయం బలపడి.. ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ కూడా ఎక్కువ నిడివితోనే రిలీజవుతున్నాయి. అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు ఘనవిజయం సాధించడంతో నిడివి 3 గంటలైనా పెద్దగా కంగారు పడట్లేదు. ఈ దసరాకు రాబోయేవన్నీ పెద్ద నిడివి ఉన్న సినిమాలే కావడం గమనార్హం. తాజాగా రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావుకు సెన్సార్ పూర్తి చేశారు. ఆ సినిమా రన్ టైం 3 గంటల 2 నిమిషాలట. మరీ ఇంత నిడివి అంటే ఆడియన్స్ తట్టుకుంటారా అన్నది సందేహమే. కానీ సినిమా బలమైన కంటెంట్తోనే వస్తున్నట్లుంది.
ఇక తమిళ అనువాద చిత్రం లియోకు కొన్ని రోజుల ముందే సెన్సార్ పూర్తయింది. దాని రనట్ టైం రెండు ముప్పావు గంటల దాకా ఉంది. ఇక బాలయ్య సినిమా భగవంత్ కేసరి సైతం పెద్ద సినిమానే అని టాక్. అది కూడా 2 గంటల 40 నిమిషాలకు పైగా నిడివితో రిలీజ కాబోతోందట. త్వరలోనే ఆ చిత్రానికి కూడా సెన్సార్ పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమాలకు టాక్ బాగుంటే రన్ టైం సమస్య కాదు. కానీ బాలేని సినిమాలకు మాత్రం నిడివి సమస్యగా మారొచ్చు. భగవంత్ కేసరి, లియో ఈ నెల 20న రిలీజవుతుండగా.. తర్వాతి రోజు టైగర్ నాగేశ్వరరావు వస్తుంది.
This post was last modified on October 12, 2023 9:27 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…