ఇండియాలో ఒకప్పుడు సినిమాల నిడివి మినిమం రెండున్నర గంటలు ఉండేది. రెండున్నర గంటలు అన్నది స్టాండర్డ్ రన్ టైం కాగా.. చాలా వరకు సినిమాలు అంతకంటే ఎక్కువ నిడివితోనే ఉండేవి. కానీ సోషల్ మీడియా ఊపందుకున్నాక కొంచెం నిడివి ఎక్కువ అయితే ల్యాగ్ ల్యాగ్ అనడం ఎక్కువైంది. దీంతో ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తెరకు పని చెప్పడం ఎక్కువైంది. పాటలు, అనవసర సీన్లు తీసేసి 2-2.15 గంటల నిడివితో సినిమాలు రిలీజ్ చేయడం ఎక్కువైంది.
కానీ ఈ మధ్య మళ్లీ ట్రెండ్ మారుతోంది. కంటెంట్ ఉంటే నిడివి పెద్ద సమస్య కాదన్న అభిప్రాయం బలపడి.. ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ కూడా ఎక్కువ నిడివితోనే రిలీజవుతున్నాయి. అర్జున్ రెడ్డి, రంగస్థలం లాంటి సినిమాలు ఘనవిజయం సాధించడంతో నిడివి 3 గంటలైనా పెద్దగా కంగారు పడట్లేదు. ఈ దసరాకు రాబోయేవన్నీ పెద్ద నిడివి ఉన్న సినిమాలే కావడం గమనార్హం. తాజాగా రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావుకు సెన్సార్ పూర్తి చేశారు. ఆ సినిమా రన్ టైం 3 గంటల 2 నిమిషాలట. మరీ ఇంత నిడివి అంటే ఆడియన్స్ తట్టుకుంటారా అన్నది సందేహమే. కానీ సినిమా బలమైన కంటెంట్తోనే వస్తున్నట్లుంది.
ఇక తమిళ అనువాద చిత్రం లియోకు కొన్ని రోజుల ముందే సెన్సార్ పూర్తయింది. దాని రనట్ టైం రెండు ముప్పావు గంటల దాకా ఉంది. ఇక బాలయ్య సినిమా భగవంత్ కేసరి సైతం పెద్ద సినిమానే అని టాక్. అది కూడా 2 గంటల 40 నిమిషాలకు పైగా నిడివితో రిలీజ కాబోతోందట. త్వరలోనే ఆ చిత్రానికి కూడా సెన్సార్ పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమాలకు టాక్ బాగుంటే రన్ టైం సమస్య కాదు. కానీ బాలేని సినిమాలకు మాత్రం నిడివి సమస్యగా మారొచ్చు. భగవంత్ కేసరి, లియో ఈ నెల 20న రిలీజవుతుండగా.. తర్వాతి రోజు టైగర్ నాగేశ్వరరావు వస్తుంది.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…