Movie News

ఆ సీక్వెల్స్ క్యాన్సిలైపోయాయి

సినిమాలు మేకింగ్ దశలో ఉండగా.. రిలీజ్ టైంలో ఘనంగా సీక్వెల్స్ ప్రకటించడం.. తర్వాతేమో వాటి ఊసే ఎత్తకపోవడం.. ఇదీ వరస. ఈ కోవలో చెప్పుకోవడానికి పదుల సంఖ్యలో సినిమాలున్నాయి. గత ఏడాది వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ లాంటి దారుణమైన డిజాస్టర్ మూవీకి కూడా సీక్వెల్ హింట్ ఇవ్వడం గమనార్హం. ఇలాంటి సినిమాలు చూసినపుడు.. ఫస్ట్ పార్ట్ చూడటమే నరకం అంటే, ఇంకా దీనికి సీక్వెల్ కూడానా అన్న అసహనం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతుంటుంది.

ఇక రెండు వారాల ముందు వచ్చిన సినిమాలకు కూడా ఘనంగా సీక్వెల్స్ ప్రకటించారు. రామ్-బోయపాటిల ‘స్కంద’తో పాటు శ్రీకాంత్ అడ్డాల మూవీ ‘పెదకాపు’కు కూడా సీక్వెల్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ తర్వాత కూడా వీటికి కట్టుబడ్డట్లే కనిపించాయి చిత్ర బృందం. ‘పెదకాపు’నైతే మూడు పార్ట్‌లుగా తీయాలని శ్రీకాంత్ అనుకున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి ఆశించిన ఫలితాలు రాలేదు. ‘స్కంద’ వీకెండ్ వరకు కొంచెం సందడి చేసి ఆ తర్వాత చల్లబడిపోయింది.

దాదాపుగా రూ.20 కోట్ల నష్టం వాటిల్లింది బయ్యర్లకు. ఇలాంటి మిడ్ రేంజ్ మూవీకి అంత నష్టం అంటే మామూలు విషయం కాదు. బయ్యర్ల పెట్టుబడిలో సగానికి సగం నష్టం వాటిల్లింది. బోయపాటి రిలీజైన వారం తర్వాత కూడా సీక్వెల్ సీక్వెల్ అంటూ ఉన్నాడు కానీ.. బయ్యర్లకు సెటిల్మెంట్ చేయాల్సిన స్థితిలో ఉన్న నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అసలు ఇంకో సినిమా తీయడమే కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు.

ఇక సీక్వెల్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు. బోయపాటి వేరే నిర్మాతను వెతుక్కుంటే ఓకే కానీ.. ఆయనైతే సీక్వెల్ ప్రొడ్యూస్ చేసే స్థితిలో లేడు. దాదాపుగా ఈ సీక్వెల్ క్యాన్సిల్ అయినట్లే అంటున్నారు. ఇక ‘పెదకాపు’ నిర్మాత అయితే పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాక లబోదిబోమంటున్నాడు. ఇక సీక్వెల్ అంటే ఏం చేస్తాడు. శ్రీకాంత్‌కు ఇప్పుడు ఇంకో సినిమా దక్కడమే కష్టంగా ఉంది. కాబట్టి ‘పెదకాపు’ పార్ట్-2 కూడా క్యాన్సిల్ అయినట్లే.

This post was last modified on October 11, 2023 9:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…

6 minutes ago

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…

51 minutes ago

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…

1 hour ago

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

2 hours ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

3 hours ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

3 hours ago