లాక్డౌన్లో తెలుగు సినిమా నిర్మాతలకు కొత్త ప్రత్యామ్నాయం దొరికింది. థియేటర్లలో విడుదల చేసే బయ్యర్ల కోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా ఏకమొత్తంగా ఒకేసారి రైట్స్ తీసేసుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. విశేషం ఏమిటంటే… ఓటీటీలు కేవలం ఇప్పటి పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని చూడడం కాకుండా ఫ్యూచర్లో కూడా కొత్త సినిమాల హక్కులు తమ చేతిలో వుండేట్టు ప్లాన్ చేసుకుంటున్నాయి.
‘వి’ చిత్ర హక్కులను అమెజాన్ ప్రైమ్ ముప్పయ్ కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటరు’ చిత్ర హక్కులను కూడా అంతే మొత్తం చెల్లించి జీ5 తీసుకుందట. అయితే ‘సోలో బ్రతుకే’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ చిత్రం సిద్ధం కావాలంటే మళ్లీ షూటింగులు మొదలు కావాల్సిందే.
మరి జీ5 ఎందుకని ఈ చిత్ర హక్కులను అంత మొత్తం చెల్లించి తీసుకున్నట్టు? థియేటర్స్లో రిలీజ్ చేసుకునే వీలుంటే అది కూడా వాళ్లే చేసుకుంటారట. ఇక ఓటిటిలో ఎప్పుడంటే అప్పుడు విడుదల చేసుకునే హక్కు వాళ్లకు ఎలాగో వుంటుంది. ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడి కంటే కొన్ని కోట్ల లాభం ఈ డీల్తోనే రావడంతో నిర్మాత హ్యాపీ. ఇక మీదట కూడా కేవలం రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లతో కాకుండా ఓటిటిలతోనూ రిలీజ్ డీల్స్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on August 26, 2020 1:04 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…