రాజకీయాలలోకి వెళ్లకముందు చిరంజీవి మూడు సినిమాలు చేస్తే, అందులో ఖచ్చితంగా ఒకటి అల్లు అరవింద్ ‘గీతా ఆర్టస్’ది ఒకటి ఉండేది. రీఎంట్రీ తర్వాత చిరంజీవి ఇంతవరకు అల్లు అరవింద్ బ్యానర్లో సినిమా చేయలేదు. మొదటి రెండు చిత్రాలు రామ్ చరణ్ స్థాపించిన ‘కొణిదెల ప్రొడక్షన్స్’లోనే చేసారు.
ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ చెప్పిన నిర్మాతకు చేస్తోన్న చిరంజీవి తన తదుపరి చిత్రాలను అనిల్ సుంకర, మైత్రి మూవీస్ తదితరులకు చేయబోతున్నారని టాక్. చరణ్కి నిర్మాణ వ్యవహారాలు చూసుకునే సమయం లేకపోవడంతో చిరు బయటి బ్యానర్స్కి డేట్స్ ఇస్తున్నారు.
అయితే తన తదుపరి చిత్రాలు మూడు వరకు ఖాయమయినా కానీ ఒక్కటి కూడా అల్లు అరవింద్కి చేయకపోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. కేవలం కొణిదెల ప్రొడక్షన్స్ లో మాత్రమే సినిమాలు చేస్తుంటే పట్టించుకునేవాళ్లు కాదేమో కానీ బయటి బ్యానర్లకు డేట్స్ ఇస్తూ కూడా గీతా ఆర్ట్స్ లో ఒక్కటి కూడా ఇంకా అనౌన్స్ కాకపోవడం చర్చకు దారితీసింది.
మరి ఇది అనుకోకుండా అలా జరిగిపోయిందో, లేక గీతా బ్యానర్కి చిరంజీవి దూరంగా వుంటున్నారో తెలియదు. ఇదిలావుంటే గీతా ఆర్ట్స్ నుంచి భారీ సినిమాలు తగ్గిపోవడంతో తాను చేస్తోన్న సినిమాల్లో కొన్నిటిని తమ సంస్థతో ఎటాచ్ చేయాలని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యాడు. అందుకే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి గీతా ఆర్ట్స్ భాగస్వామ్యం పట్టుబట్టి మరీ తీసుకున్నాడు.
This post was last modified on September 4, 2020 8:01 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…