Movie News

సినిమాపై ఆశల్లేకే అలా వదిలేశారా?

మామా మశ్చీంద్ర.. గత వీకెండ్లో రిలీజైన కొత్త సినిమా. రైటర్ కమ్ యాక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటించాడు. ఇంట్రెస్టింగ్‌ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కొంత అంచనాలున్నాయి. కానీ ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితం అందుకుంది. తొలి రోజు నుంచే ఈ సినిమా థియేటర్లలో జనం లేరు.

ఐతే రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ విడుదలై మూడో రోజుకే ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో థియేటర్లను కలిగి ఉన్న సునీల్ నారంగ్ ఈ చిత్రానికి నిర్మాత. అలాంటి వ్యక్తి సినిమాను విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి తీసుకురావడం.. థియేటర్లలో రిలీజైన మూడో రోజుకే అనౌన్స్‌మెంట్ రావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమా మీద నిర్మాతలు ముందే ఆశలు కోల్పోయిన సంకేతాలు కనిపించాడు విడుదలకు ముందు. రిలీజ్ ముంగిట జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఈ సినిమా విడుదలవుతున్నట్లే జనాలకు తెలియట్లేదని ఓ విలేకరి అంటే హీరో సుధీర్ బాబు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. తర్వాత ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ మాట్లాడుతూ.. సినిమాకు నిర్మాతలు సరిగా పబ్లిసిటీ చేయలేదన్నట్లుగా మాట్లాడాడు. ఈ విషయంలో అతడి అసంతృప్తి స్పష్టంగా తెలిసిపోయింది.

సినిమా ఆడకపోతే అది వేరే విషయం కానీ, ఒక సినిమా వస్తున్నట్లు జనాలకే తెలియని పరిస్థితి ఉందంటే దర్శకుడిగా తనకది ఎక్కువ బాధ కలిగించే విషయమని హర్ష అన్నాడు. దీన్ని బట్టి చూస్తే ‘మామా మశ్చీంద్ర’ ఫలితం గురించి నిర్మాతలకు ముందే ఒక అవగాహన వచ్చేసిందని, కాబట్టే థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపదని అర్థమయ్యే పబ్లిసిటీ కూడా చేయలేదని అర్థమవుతోంది. అందుకే విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో వచ్చేలా డీల్ చేసుకుని.. రిలీజైన మూడో రోజుకే ప్రకటన కూడా ఇచ్చేశారని తెలుస్తోంది.

This post was last modified on October 9, 2023 4:26 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

28 mins ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

30 mins ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

2 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

2 hours ago

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

3 hours ago

పుష్ప 2 పోటీ – తగ్గనంటున్న శివన్న

ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…

3 hours ago