స్టార్ హీరోలు వందో సినిమా అనే మైలురాయి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. బాలకృష్ణ అందుకే ఏరికోరి మరీ గౌతమీపుత్ర శాతకర్ణిని ఎంచుకున్నారు. మంచి విజయం అందుకున్నారు. చిరంజీవి 1988లో త్రినేత్రుడుని తన స్వంత బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించుకున్నారు. వెంకటేష్ కి ఈ ల్యాండ్ మార్క్ ఇంకా దూరంలో ఉంది కానీ నాగార్జున మాత్రం నా సామి రంగా పూర్తి చేయగానే దీని మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాకు ఓకే చెప్పారనే టాక్ గతంలో వచ్చింది కానీ ఆయన తని ఒరువన్ 2కి లాక్ అయిపోవడంతో నాగ్ ప్రాజెక్ట్ రద్దయినట్టుగానే భావించాలి.
ఇప్పుడో కొత్త పేరు తెరపైకి వచ్చింది. కోలీవుడ్ నుంచి నవీన్ అనే దర్శకుడు చెప్పిన లైన్ బాగా నచ్చడంతో నాగ్ సానుకూలంగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్. అయితే రిస్కని చెప్పడానికి కారణం ఉంది. సదరు నవీన్ ఇప్పటిదాకా తీసింది రెండు సినిమాలే. మొదటిది 2013లో వచ్చిన మూడర్ కుడం. బాగానే పేరు తెచ్చింది. తర్వాత 2021లో విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా అగ్ని సిరగుగల్ తీశారు. కానీ రెండేళ్లు దాటుతున్నా ఇది విడుదలకు నోచుకోలేదు. కారణాలు చెప్పడం లేదు కానీ అదిగో ఇదిగో అంటూ ఆలస్యం చేస్తూనే ఉన్నారు. అంటే పది సంవత్సరాల టైంలో నవీన్ చేసింది రెండు సినిమాలే.
నిర్మాతగా రచయితగా పేరున్న నవీన్ కు దర్శకుడిగా మాత్రం ఇంకా ప్రత్యేక ముద్ర పడలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నవీన్ కు కింగ్ నాగ్ ఓకే చెప్పారంటే విషయం ఏదో బలంగా ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 7, నా సామి రంగా షూటింగులతో బిజీగా ఉన్న నాగార్జున 100కు సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించడానికి మరి కొంత సమయం తీసుకోవచ్చు. ఈలోగా నవీన్ ఫుల్ వెర్షన్ కనక సిద్ధం చేసి మెప్పిస్తే జ్ఞానవేల్ రాజా నిర్మాతగా ప్యాన్ ఇండియా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అన్నట్టు ఈ ప్రతిపాదన వెనుక హీరో కార్తీ రికమండేషన్ ఉందని మరో న్యూస్. ఊపిరి నుంచి ఏర్పడ్డ స్నేహం వల్ల నవీన్ ని ఆయనే పంపారట.
This post was last modified on October 9, 2023 1:41 pm
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…
హీరో కిరణ్ అబ్బవరం మంచి ఊపులో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ అనుకున్న దానికన్నా బాగా ఆడటంతో పాటు యాభై…
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తిగత ఫ్యామిలీ సంబంధాల గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.…
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…