స్టార్ హీరోలు వందో సినిమా అనే మైలురాయి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. బాలకృష్ణ అందుకే ఏరికోరి మరీ గౌతమీపుత్ర శాతకర్ణిని ఎంచుకున్నారు. మంచి విజయం అందుకున్నారు. చిరంజీవి 1988లో త్రినేత్రుడుని తన స్వంత బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించుకున్నారు. వెంకటేష్ కి ఈ ల్యాండ్ మార్క్ ఇంకా దూరంలో ఉంది కానీ నాగార్జున మాత్రం నా సామి రంగా పూర్తి చేయగానే దీని మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాకు ఓకే చెప్పారనే టాక్ గతంలో వచ్చింది కానీ ఆయన తని ఒరువన్ 2కి లాక్ అయిపోవడంతో నాగ్ ప్రాజెక్ట్ రద్దయినట్టుగానే భావించాలి.
ఇప్పుడో కొత్త పేరు తెరపైకి వచ్చింది. కోలీవుడ్ నుంచి నవీన్ అనే దర్శకుడు చెప్పిన లైన్ బాగా నచ్చడంతో నాగ్ సానుకూలంగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్. అయితే రిస్కని చెప్పడానికి కారణం ఉంది. సదరు నవీన్ ఇప్పటిదాకా తీసింది రెండు సినిమాలే. మొదటిది 2013లో వచ్చిన మూడర్ కుడం. బాగానే పేరు తెచ్చింది. తర్వాత 2021లో విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా అగ్ని సిరగుగల్ తీశారు. కానీ రెండేళ్లు దాటుతున్నా ఇది విడుదలకు నోచుకోలేదు. కారణాలు చెప్పడం లేదు కానీ అదిగో ఇదిగో అంటూ ఆలస్యం చేస్తూనే ఉన్నారు. అంటే పది సంవత్సరాల టైంలో నవీన్ చేసింది రెండు సినిమాలే.
నిర్మాతగా రచయితగా పేరున్న నవీన్ కు దర్శకుడిగా మాత్రం ఇంకా ప్రత్యేక ముద్ర పడలేదు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న నవీన్ కు కింగ్ నాగ్ ఓకే చెప్పారంటే విషయం ఏదో బలంగా ఉంటుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 7, నా సామి రంగా షూటింగులతో బిజీగా ఉన్న నాగార్జున 100కు సంబంధించిన నిర్ణయాన్ని వెలువరించడానికి మరి కొంత సమయం తీసుకోవచ్చు. ఈలోగా నవీన్ ఫుల్ వెర్షన్ కనక సిద్ధం చేసి మెప్పిస్తే జ్ఞానవేల్ రాజా నిర్మాతగా ప్యాన్ ఇండియా బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అన్నట్టు ఈ ప్రతిపాదన వెనుక హీరో కార్తీ రికమండేషన్ ఉందని మరో న్యూస్. ఊపిరి నుంచి ఏర్పడ్డ స్నేహం వల్ల నవీన్ ని ఆయనే పంపారట.
This post was last modified on October 9, 2023 1:41 pm
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్-4 హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగిన హీరో.. అక్కినేని నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లతో పోటాపోటీగా…
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…