గత దశాబ్దంలో దక్షిణాది సినీ పరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు చేసి, నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు చేసి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ మలయాళ దర్శకుడు ఫాజిల్ తనయుడైన ఫాహద్ మొదట్లో మామూలు సినిమాలే చేశాడు. కానీ గత ఐదారేళ్లలో మాత్రం అతడి నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ వచ్చి మలయాళ సినిమాల పరిధి పెరిగాక ఇతర భాషల వాళ్లకూ ఫాహద్ సత్తా ఏంటో తెలిసింది. ఈ మధ్యే వచ్చిన ట్రాన్స్ సినిమా చూసి మెస్మరైజ్ అయిపోయారు వివిధ భాషల వాళ్లు. కుంబలంగి నైట్స్లో సైతం అద్భుతమైన పెర్ఫామెన్స్ను వారెవా అనిపించాడు ఫాహద్.
ఫాహద్ సినిమా అంటే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని.. ఫాహద్ పాత్రలో ఏదో విశేషం ఉంటుందని నమ్ముతున్నారు ప్రేక్షకులు. ఇప్పుడతను మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమానే.. సీ యూ సూన్. ఇది మొత్తం ఐఫోన్లో చిత్రీకరించిన సినిమా కావడం విశేషం. ఎడిటర్ టర్న్డ్ మహేష్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఓ అబ్బాయి.. అమ్మాయి.. ఇద్దరూ తరచుగా వీడియో కాల్స్లో మాట్లాడుతుంటారు. అతను ఆఫీస్లో ఉండగా.. ఆ అమ్మాయి ఇంట్లో గొడవ జరుగుతుంది. తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది. దీంతో ఆ కుర్రాడు కేసులో ఇరుక్కుంటాడు. అతణ్ని రక్షించడానికి స్నేహితులు ఏం చేశారన్నదే ఈ కథ. లాక్ డౌన్ టైంలో ఐఫోన్ ద్వారా ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం. కాన్సెప్ట్, విజువల్స్ అంతా కొత్తగా కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 1న అమేజాన్ ప్రైంలో ఈ సినిమా నేరుగా విడుదల కానుంది.
This post was last modified on August 26, 2020 12:36 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…