బోయపాటి శ్రీను సినిమాలంటే లాజిక్కులు పూర్తిగా అటకెక్కేస్తాయి. ఆయన సినిమాలకు వెళ్తుంటే మైండ్ ఆఫ్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుందని కౌంటర్లు పడుతుంటాయి సోషల్ మీడియాలో. ఆయన సినిమాల్లో కథ, పాత్రలు.. సన్నివేశాలు.. అన్నీ కూడా ఇల్లాజికల్గా ఉంటాయి. కమర్షియల్ సినిమాలన్నాక ప్రతిదీ లాజిక్ ప్రకారం నడవాలంటే కష్టం కానీ.. బోయపాటి సినిమాల్లో మరీ టూమచ్ అనిపించేలా సీన్లు ఉంటాయి.
ఆయన కొత్త చిత్రం స్కంద అయితే ఈ విషయంలో మరీ శ్రుతిమించి పోయింది. విలన్లు ఇద్దరినీ ముఖ్యమంత్రులుగా చూపించి.. వాళ్లతో హీరో ఫుట్బాల్ ఆడుకున్నట్లు చూపించడం మరీ విడ్డూరం. ఒక పల్లెటూరికి చెందిన మామూలు కుర్రాడు.. సెక్యూరిటీ మొత్తాన్ని ఆటాడించి సీఎం ఇళ్లలోకి వెళ్లిపోవడం.. సీఎం భయపడి నీకు కావాల్సింది తీసుకుపో అనడం.. ఇద్దరు సీఎం కూతుళ్లను హీరో సింపుల్గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం.. ఇలాంటి విడ్డూరాలెన్నో ‘స్కంద’లో ఉన్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు వాళ్ల వాళ్ల రాజధానుల్లో ఉండి పరిపాలన చూసుకుంటారు కానీ.. ఎంతసేపూ పనీ పాటా వదిలేసి ఇద్దరూ ఒకే ఇంట్లో కూలబడి ఉండటం కూడా సిల్లీగా అనిపించింది. ఈ విషయాల మీద సోషల్ మీడియాలో మామూలుగా కౌంటర్లు పడలేదు. ఐతే తన సినిమాల్లో లాజిక్కుల గురించి వచ్చే విమర్శల గురించి బోయపాటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
నిజ జీవితంలో ఎవరైనా రోడ్ల మీద పాటలు పాడుకుని, డ్యాన్సులు వేస్తారా.. లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఇది జరగదని.. అలాంటపుడు సినిమాల్లో పాటలే పెట్టలేమని అతనన్నాడు. ఫైట్ సీన్లు మామూలుగా తీస్తే జనాలకు ఎక్కదని.. తన సినిమాల్లో హీరోను పవర్ఫుల్గా చూపించడానికి కొంచెం ఓవర్ ద టాప్ స్టయిల్లో యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని బోయపాటి అన్నాడు. హీరో పవర్ ఫుల్ కాబట్టే సీఎంలను ఢీకొట్టి గెలిచినట్లు చూపించామన్నాడు. సినిమాలో విలన్లు సీఎంలు కాబట్టి సీఎంలను చెడుగా చూపించినట్లు కాదని బోయపాటి వివరణ ఇచ్చాడు.
This post was last modified on October 7, 2023 11:18 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…