కరోనా టైంలో ఓటీటీలో చడీచప్పుడు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ దక్కించుకున్నాయి. అలాంటి సినిమాల్లో మా ఊరి పొలిమేర ఒకటి. కామెడీ, క్యారెక్టర్ రోల్స్ చేసే సత్యం రాజేష్ ఇందులో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. బాలాదిత్య, గెటప్ శీను ఇతర ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమా చేతబడుల చుట్టూ తిరిగే థ్రిల్లర్. సినిమాలో కొన్ని గగుర్పొడిచే సీన్లు ఉంటాయి.
అలాగే కొన్ని ట్విస్టులు కూడా అదిరిపోతాయి. చాలా తక్కువ బడ్జెట్లోనే ఆసక్తికరంగా సినిమా తీసి మెప్పించాడు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. హాట్ స్టార్ ఓటీటీలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై.. నెమ్మదిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి మంచి ఆదరణ పొందింది మా ఊరి పొలిమేర. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని.. ఆ సినిమాలోనే హింట్ ఇచ్చారు.
ఇప్పుడు పొలిమేర-2 పేరుతో సీక్వెల్ కూడా రెడీ చేసేశారు. ఫస్ట్ పార్ట్కు మంచి ఆదరణ దక్కడంతో కొంచెం బడ్జెట్ పెంచి, కాస్టింగ్ పరంగా ఆకర్షణలు జోడించి సినిమాను తీర్చిదిద్దింది టీం. ఈ సినిమాకు కాస్త బజ్ ఉండటంతో థియేటర్లలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది.
ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను.. నందిపాటి వంశీతో కలిసి బన్నీ వాసు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాడట. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా పొలిమేర-2 రిలీజ్ కాబోతోంది. నవంబరు 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. గీతా సంస్థ ద్వారా రిలీజ్ అంటే ఒక స్థాయిలోనే ఉంటుంది. సినిమాను బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారు కూడా. మొత్తానికి ఈ చిన్న సినిమాకు రిలీజ్ ముంగిట పెద్ద బూస్ట్ దక్కబోతున్నట్లే.
This post was last modified on October 7, 2023 11:13 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…