మీడియం సినిమాల మేళాగా మారిపోయిన శుక్రవారం చూసి ఆడియన్స్ ఏ సినిమాకు వెళ్లాలో అర్థం కాక రివ్యూలు, పబ్లిక్ టాక్, రిపోర్టుల కోసం ఎదురు చూశారు. చెప్పుకోదగ్గ స్టార్లు ఉంటేనే ఓపెనింగ్స్ రావడం కష్టమైపోయిన పరిస్థితుల్లో మార్కెట్ లేని నవీన్ చంద్ర, కలర్స్ స్వాతిని జంటగా పెట్టుకుని థియేటర్ రిలీజ్ కు వెళ్లడం సాహసమే. సరే కంటెంట్ బాగున్నప్పుడు జనం ఎవరున్నారనేది పట్టించుకోరని బలగం లాంటివి ఋజువు చేశాయి కాబట్టి ఇందులో కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉందేమోనని, ఓ లుక్ వేద్దామనుకున్న ఆడియన్స్ లేకపోలేదు. మరి అక్టోబర్ మంత్ లో వచ్చిన మధు ఎలా ఉందంటే
వైజాగ్ లో ఉండే మధుసూదన్(నవీన్ చంద్ర)ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుని విడాకుల నోటీసు పంపించిన భార్య లేఖ(స్వాతి రెడ్డి) మనసు మారి తన దగ్గరికి వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉండలేక తాగుడుకి అలవాటు పడతాడు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన మధు(శ్రేయ నవిలే) మధుసూదన్ కి పరిచయమవుతుంది. బొద్దుతనంతో ఇంటా బయట ఇబ్బందులు ఎదురుకుంటున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న మధుకి అతని కథ వినాలన్న ఆసక్తి కలుగుతుంది. ఈ ముగ్గురి లైఫ్ జర్నీ ఏంటి, ఏ రకంగా ముడిపడతారనేది అసలు స్టోరీ.
ఎమోషన్స్ అంటే సాగదీసిన సన్నివేశాలు, సంభాషణలు కాదని గుర్తించనంత కాలం మంత్ అఫ్ మధు లాంటి హెవీ డ్రామాలు వస్తూనే ఉంటాయి. భావోద్వేగాలు కనెక్ట్ కానప్పుడు నటీనటులు ఎంత బాగా నటించినా వృథానే అవుతుంది. శ్రీకాంత్ నాగోతి డైలాగుల మీద పెట్టిన శ్రద్ధ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేసేలా ఉందో లేదో చెక్ చేసుకోలేదు. దీంతో మధు కథ కాస్తా సాగదీసిన షార్ట్ ఫిలిం ఫీలింగ్ కలిగిస్తుంది. కమర్షియల్ అంశాలు వద్దనుకోవడం మంచి ఆలోచనే. అలా అని బోర్ కొట్టేలా నెరేట్ చేస్తే ప్రతి క్యారెక్టర్ అవసరం లేనిదే అనిపిస్తుంది ఎన్ఆర్ఐతో సహా. టన్నుల కొద్దీ ఓపిక ఉంటేనే మంత్ అఫ్ మధు ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on October 7, 2023 8:02 am
టాలీవుడ్ మెగాస్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడటం అరుదు. ఆ మధ్య భోళా శంకర్, జైలర్…
అల్లరి నరేష్ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్కు ‘నాంది’ శుభారంభం పలికినా.. ఆ తర్వాత అతను నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలందుకోలేరు.…
ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన దగ్గర్నుంచి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఇందులో నాని…
ప్రభాస్ దర్శకుల ఎంపిక ఎప్పుడూ ఒకే లెక్కలో ఉండదు. తన మార్కెట్కు సరిపోయే టాప్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలని ఎప్పుడూ…
టాలీవుడ్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా చాలామంది గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. హిట్టు కోసం ప్రయత్నం ఆపట్లేదు.…
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇద్దరు యువకులు ఒక హెడ్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని కొట్టడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది.…