మీడియం సినిమాల మేళాగా మారిపోయిన శుక్రవారం చూసి ఆడియన్స్ ఏ సినిమాకు వెళ్లాలో అర్థం కాక రివ్యూలు, పబ్లిక్ టాక్, రిపోర్టుల కోసం ఎదురు చూశారు. చెప్పుకోదగ్గ స్టార్లు ఉంటేనే ఓపెనింగ్స్ రావడం కష్టమైపోయిన పరిస్థితుల్లో మార్కెట్ లేని నవీన్ చంద్ర, కలర్స్ స్వాతిని జంటగా పెట్టుకుని థియేటర్ రిలీజ్ కు వెళ్లడం సాహసమే. సరే కంటెంట్ బాగున్నప్పుడు జనం ఎవరున్నారనేది పట్టించుకోరని బలగం లాంటివి ఋజువు చేశాయి కాబట్టి ఇందులో కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉందేమోనని, ఓ లుక్ వేద్దామనుకున్న ఆడియన్స్ లేకపోలేదు. మరి అక్టోబర్ మంత్ లో వచ్చిన మధు ఎలా ఉందంటే
వైజాగ్ లో ఉండే మధుసూదన్(నవీన్ చంద్ర)ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుని విడాకుల నోటీసు పంపించిన భార్య లేఖ(స్వాతి రెడ్డి) మనసు మారి తన దగ్గరికి వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉండలేక తాగుడుకి అలవాటు పడతాడు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన మధు(శ్రేయ నవిలే) మధుసూదన్ కి పరిచయమవుతుంది. బొద్దుతనంతో ఇంటా బయట ఇబ్బందులు ఎదురుకుంటున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న మధుకి అతని కథ వినాలన్న ఆసక్తి కలుగుతుంది. ఈ ముగ్గురి లైఫ్ జర్నీ ఏంటి, ఏ రకంగా ముడిపడతారనేది అసలు స్టోరీ.
ఎమోషన్స్ అంటే సాగదీసిన సన్నివేశాలు, సంభాషణలు కాదని గుర్తించనంత కాలం మంత్ అఫ్ మధు లాంటి హెవీ డ్రామాలు వస్తూనే ఉంటాయి. భావోద్వేగాలు కనెక్ట్ కానప్పుడు నటీనటులు ఎంత బాగా నటించినా వృథానే అవుతుంది. శ్రీకాంత్ నాగోతి డైలాగుల మీద పెట్టిన శ్రద్ధ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేసేలా ఉందో లేదో చెక్ చేసుకోలేదు. దీంతో మధు కథ కాస్తా సాగదీసిన షార్ట్ ఫిలిం ఫీలింగ్ కలిగిస్తుంది. కమర్షియల్ అంశాలు వద్దనుకోవడం మంచి ఆలోచనే. అలా అని బోర్ కొట్టేలా నెరేట్ చేస్తే ప్రతి క్యారెక్టర్ అవసరం లేనిదే అనిపిస్తుంది ఎన్ఆర్ఐతో సహా. టన్నుల కొద్దీ ఓపిక ఉంటేనే మంత్ అఫ్ మధు ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on October 7, 2023 8:02 am
మలయాళ లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తన మాతృభాషలో గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. ఎన్నో సూపర్…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత రామజన్మభూమి అయోధ్యలో ఉన్న బాలరామయ్య ఆలయానికి రాజకీయ గ్రహణం వీడినట్టేనా? ఇక, ఆలయానికి రాజకీయ ప్రభావం,…
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…