మీడియం సినిమాల మేళాగా మారిపోయిన శుక్రవారం చూసి ఆడియన్స్ ఏ సినిమాకు వెళ్లాలో అర్థం కాక రివ్యూలు, పబ్లిక్ టాక్, రిపోర్టుల కోసం ఎదురు చూశారు. చెప్పుకోదగ్గ స్టార్లు ఉంటేనే ఓపెనింగ్స్ రావడం కష్టమైపోయిన పరిస్థితుల్లో మార్కెట్ లేని నవీన్ చంద్ర, కలర్స్ స్వాతిని జంటగా పెట్టుకుని థియేటర్ రిలీజ్ కు వెళ్లడం సాహసమే. సరే కంటెంట్ బాగున్నప్పుడు జనం ఎవరున్నారనేది పట్టించుకోరని బలగం లాంటివి ఋజువు చేశాయి కాబట్టి ఇందులో కూడా ఏదైనా సర్ప్రైజ్ ఉందేమోనని, ఓ లుక్ వేద్దామనుకున్న ఆడియన్స్ లేకపోలేదు. మరి అక్టోబర్ మంత్ లో వచ్చిన మధు ఎలా ఉందంటే
వైజాగ్ లో ఉండే మధుసూదన్(నవీన్ చంద్ర)ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుని విడాకుల నోటీసు పంపించిన భార్య లేఖ(స్వాతి రెడ్డి) మనసు మారి తన దగ్గరికి వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉండలేక తాగుడుకి అలవాటు పడతాడు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన మధు(శ్రేయ నవిలే) మధుసూదన్ కి పరిచయమవుతుంది. బొద్దుతనంతో ఇంటా బయట ఇబ్బందులు ఎదురుకుంటున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్న మధుకి అతని కథ వినాలన్న ఆసక్తి కలుగుతుంది. ఈ ముగ్గురి లైఫ్ జర్నీ ఏంటి, ఏ రకంగా ముడిపడతారనేది అసలు స్టోరీ.
ఎమోషన్స్ అంటే సాగదీసిన సన్నివేశాలు, సంభాషణలు కాదని గుర్తించనంత కాలం మంత్ అఫ్ మధు లాంటి హెవీ డ్రామాలు వస్తూనే ఉంటాయి. భావోద్వేగాలు కనెక్ట్ కానప్పుడు నటీనటులు ఎంత బాగా నటించినా వృథానే అవుతుంది. శ్రీకాంత్ నాగోతి డైలాగుల మీద పెట్టిన శ్రద్ధ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేసేలా ఉందో లేదో చెక్ చేసుకోలేదు. దీంతో మధు కథ కాస్తా సాగదీసిన షార్ట్ ఫిలిం ఫీలింగ్ కలిగిస్తుంది. కమర్షియల్ అంశాలు వద్దనుకోవడం మంచి ఆలోచనే. అలా అని బోర్ కొట్టేలా నెరేట్ చేస్తే ప్రతి క్యారెక్టర్ అవసరం లేనిదే అనిపిస్తుంది ఎన్ఆర్ఐతో సహా. టన్నుల కొద్దీ ఓపిక ఉంటేనే మంత్ అఫ్ మధు ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
This post was last modified on October 7, 2023 8:02 am
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…