సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తె’. తెలుగులో ‘శౌర్యం’ లాంటి హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత శంఖం, దరువు లాంటి ఫ్లాప్ చిత్రాలు తీసి.. ఆపై తమిళంలో విక్రమార్కుడు రీమేక్ ‘సిరుత్తై’తో సక్సెస్ సాధించి.. అజిత్తో వరుసగా ‘వీరం’, ‘వేదాళం’, ‘విశ్వాసం’ లాంటి బ్లాక్బస్టర్లు అందింంచిన శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
శివ స్టయిల్లోనే పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో రజినీ ఫస్ట్ లుక్ చూస్తే అదే విషయం స్పష్టమైంది. కరోనా లేకపోతే ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అని కూడా అనుకున్నారు. కానీ వైరస్ ఆ ప్రణాళికలను భగ్నం చేసింది. రజినీ ఇంకో ఐదారు నెలలు షూటింగ్కు రానని చెప్పేయడంతో ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది.
కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు తెలుగు యాక్షన్ హీరో, శివ మిత్రుడు గోపీచంద్ను ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. పూర్తిగా తమిళ నేటివిటీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎవరైనా తెలుగు నటుడిని పెట్టుకుంటే ఇక్కడి మార్కెట్కు ఉపయోగపడుతుందని అనుకున్నాడు శివ.
ఐతే ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని గోపీచంద్ ఖండించాడు. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ను ఎంచుకున్నట్లు సమాచారం. హీరోగా ఆశించిన విజయాలందుకోలేదు కానీ.. సత్యదేవ్ టాలెంట్ ఏంటో ఎప్పట్నుంచో చూస్తున్నాం.
ఈ మధ్య ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’తో మరోసారి అతను తన టాలెంట్ చూపించాడు. ఇటీవలే తమన్నా, సత్యదేవ్ కలయికలో ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అది అతడికి మంచి అవకాశమే. ఈలోపు రజినీ సినిమాలో అవకాశం అందుకున్నాడంటే విశేషమే.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…