సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తె’. తెలుగులో ‘శౌర్యం’ లాంటి హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత శంఖం, దరువు లాంటి ఫ్లాప్ చిత్రాలు తీసి.. ఆపై తమిళంలో విక్రమార్కుడు రీమేక్ ‘సిరుత్తై’తో సక్సెస్ సాధించి.. అజిత్తో వరుసగా ‘వీరం’, ‘వేదాళం’, ‘విశ్వాసం’ లాంటి బ్లాక్బస్టర్లు అందింంచిన శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
శివ స్టయిల్లోనే పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో రజినీ ఫస్ట్ లుక్ చూస్తే అదే విషయం స్పష్టమైంది. కరోనా లేకపోతే ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సింది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అని కూడా అనుకున్నారు. కానీ వైరస్ ఆ ప్రణాళికలను భగ్నం చేసింది. రజినీ ఇంకో ఐదారు నెలలు షూటింగ్కు రానని చెప్పేయడంతో ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది.
కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు తెలుగు యాక్షన్ హీరో, శివ మిత్రుడు గోపీచంద్ను ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. పూర్తిగా తమిళ నేటివిటీతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎవరైనా తెలుగు నటుడిని పెట్టుకుంటే ఇక్కడి మార్కెట్కు ఉపయోగపడుతుందని అనుకున్నాడు శివ.
ఐతే ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని గోపీచంద్ ఖండించాడు. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ను ఎంచుకున్నట్లు సమాచారం. హీరోగా ఆశించిన విజయాలందుకోలేదు కానీ.. సత్యదేవ్ టాలెంట్ ఏంటో ఎప్పట్నుంచో చూస్తున్నాం.
ఈ మధ్య ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’తో మరోసారి అతను తన టాలెంట్ చూపించాడు. ఇటీవలే తమన్నా, సత్యదేవ్ కలయికలో ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అది అతడికి మంచి అవకాశమే. ఈలోపు రజినీ సినిమాలో అవకాశం అందుకున్నాడంటే విశేషమే.
This post was last modified on August 25, 2020 2:21 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…