ఈ వారం బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాల జాతర చూడబోతున్నాం. ఏకంగా ఏడెనిమిది సినిమాలు రిలీజవుతున్నాయి ఈ వారం. అందులో 6 నోటెడ్ రిలీజ్లు ఉన్నాయి. ఇంత పోటీలో రావడం కొన్ని మంచి సినిమాలకు చేటు చేసేలా కనిపిస్తోంది. రిలీజ్కు ముందే ప్రిమియర్స్ కూడా పడ్డ మూడు సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర కష్టం కాలం తప్పేలా లేదు. ఆ మూడు చిత్రాలకూ మంచి టాక్ కూడా వచ్చింది.
ఈ షోలు చూసిన మీడియా వాళ్లు, వేరే ప్రేక్షకులు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. కానీ ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లూ దక్కలేదు. వాటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా డల్లుగా ఉన్నాయి. ఆ చిత్రాలే.. మంత్ ఆఫ్ మధు, చిన్నా, 800. ఈ వారం వాటితో పాటు రిలీజవుతున్న మ్యాడ్, రూల్స్ రంజన్, మామా మశ్చీంద్రలకు కొంచెం బజ్ కనిపిస్తోంది. వాటి బుకింగ్స్ కూడా పర్వాలేదు.
కానీ ‘మంత్ ఆఫ్ మధు’ సినిమాను చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువగా మల్టీప్లెక్సుల్లోనే షోలు ఇచ్చారు. అవి కూడా తక్కువే. ఈ సినిమా ప్రిమియర్ షో చూసిన వాళ్లు చాలా మంచి సినిమాగా చెబుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇదో భిన్నమైన సినిమా అనే సంకేతాలు ఇచ్చింది. కానీ ఈ చిత్రం ఏమాత్రం ప్రేక్షకుల దృష్టిలో పడుతుందో సందేహంగానే ఉంది. ఇక సిద్దార్థ్ సినిమా ‘చిన్నా’కు ఆల్రెడీ తమిళంలో మంచి అప్రిషియేషన్ వచ్చింది.
ఈ రోజు తెలుగులో ప్రిమియర్ షో చూసిన వాళ్లు కూడా కదిలిపోయారు. గొప్ప సినిమా అని కొనియాడుతున్నారు. కానీ ఈ చిత్రానికి కూడా బజ్ తక్కువగానే ఉంది. లిమిటెడ్ రిలీజే చూడబోతున్నాం. ఇక మురళీధరన్ బయోపిక్ ‘800’కు బుధవారం ప్రిమియర్ వేయగా.. అందరూ మంచి సినిమా అన్నారు. కానీ మురళీధరన్ బయోపిక్ను మన వాళ్లు ఏమాత్రం ఓన్ చేసుకుంటారన్నది సందేహంగానే ఉంది. ఇది కూడా తక్కువ థియేటర్లలో రిలీజవుతోంది. పెద్దగా బుకింగ్స్ లేవు. మంచి సినిమాలని తెలుస్తున్నప్పటికీ.. ఇంత పోటీలో రిలీజవుతుండటం వీటికి చేటు చేసేలా ఉంది.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…