నిన్న రామ్ చరణ్ ముంబైకి వెళ్లి అయ్యప్ప దీక్షను విరమించడంతో పాటు సిద్ది వినాయకుడి ఆలయానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా తిరిగాయి. ఎంఎస్ ధోనితో దిగిన ఫోటోలు సరేసరి. ఒక యాడ్ షూట్ కోసం వెళ్లిన చరణ్ తో డుంకీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ చర్చలు జరిపినట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంబోలో ఒక సినిమా వస్తుందని, దాని కోసమే కథ వినేందుకు కలుసుకున్నారని రకరకాలుగా ప్రచారం జరిగింది. కలుసుకుంది నిజమే కావొచ్చు కానీ ఏకంగా ఒక ప్రాజెక్టు రూపొందుతుందని చెప్పడం అంత నమ్మశక్యంగా లేదు. దీనికి కారణం ఉంది.
సాధారణంగా రాజ్ కుమార్ హిరానీ వేగంగా సినిమాలు తీయరు. ఇరవై సంవత్సరాల గ్యాప్ లో ఆయన చేసింది కేవలం అయిదు సినిమాలే. ఆరోది డుంకీ. ఎంతలేదన్నా ఒక్కోదానికి గ్యాప్ మూడేళ్ళ నుంచి అయిదు సంవత్సరాల వరకు ఉంది. స్క్రిప్ట్ కోసమే కాలాన్ని లెక్క చేయకుండా ఖర్చు పెడుతూనే ఉంటారు. డుంకీ తర్వాత ఏది చేయాలో హిరానీ వద్ద అసలు కథే లేదట. అలాంటప్పుడు రామ్ చరణ్ తో చేతులు కలపడం ఇప్పట్లో జరగని పని. ఆయన వయసు అరవై దాటేసింది. ఇకపై వేసే అడుగులు ఎంచుకునే స్టోరీలు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో టైం పడుతుంది.
వినడానికి బాగానే ఉన్న చరణ్ రాజ్ కుమార్ హిరానీ కాంబో ఇప్పట్లో జరిగేది అయితే కాదు. గేమ్ చేంజర్ పూర్తి చేసి దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో జాయినయ్యేందుకు ఎదురు చూస్తున్న చరణ్ ఆ తర్వాత కమిట్ మెంట్ ఎవరితో అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. లిస్టులో ప్రశాంత్ నీల్ ఉన్నాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి చేసి, ఆ తర్వాత సలార్ 2 ఫినిష్ చేసి ఇదంతా జరిగే లోపు 2026 వచ్చేస్తుంది. సో చరణ్ 17 ఏ దర్శకుడు హ్యాండిల్ చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇంకో ఏడాది దాటితే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు. అందాక ఎదురు చూడాల్సిందే.
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…
కొత్త ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయాయి. జూన్ లో ఇంకొక్క పది రోజులు మాత్రమే మిగిలున్నాయి. 2027 సంక్రాంతికి ఏమేం…
నిన్న ది ప్యారడైజ్ నుంచి రాఘవ్ జుయెల్ పోషించిన విక్రమ్ మాలిక్ ఫస్ట్ లుక్ ని టీజర్ రూపంలో టీమ్…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మెయిన్ సెంటర్స్ థియేటర్లు దాదాపుగా హౌస్ ఫుల్స్ నమోదు…
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…
నిన్న విడుదలైన కొత్త సినిమాల్లో అతి తక్కువ నోటీస్ తెచ్చుకున్నది మలయాళం డబ్బింగ్ బాలన్ ది బాయ్. అన్నపూర్ణ సంస్థ…