నాలుగున్నర కోట్లు అంటే చిన్న సినిమాలు రెండు తీసేయొచ్చు. ఇంత బడ్జెట్లో రామ్ అనే మిడ్ రేంజ్ హీరో సినిమాలో కేవలం ఒక్క యాక్షణ్ సీక్వెన్స్ తీశారు అంటే షాకవ్వకుండా ఉండలేదు. అతను హీరోగా నటించిన కొత్త చిత్రం ‘స్కంద’లో ఫస్ట్ ఫైట్కు అంతే బడ్జెట్ అయిందట. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఈ చిత్రంలో రామ్ ఇంట్రోను హైదరాబాద్ పాత బస్తీలో జరిగే సదరు పండగ నేపథ్యంలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. సదరు పండుగలో దున్నపోతుల మధ్య పోటీ నిర్వహిస్తుండగా.. అక్కడికి ముఖ్యమంత్రి వస్తాడు. బర్రెలకు ఇంజక్షన్లు ఇచ్చి అవి అదుపు తప్పే గందరగోళంలో సీఎంను లేపేయాలని ప్రత్యర్థి వర్గం ప్లాన్ చేస్తే.. హీరో రంగంలోకి దిగి వాళ్లను అడ్డుకుంటాడు. ఈ నేపథ్యంలో బుల్ ఫైట్ను కొంచెం భారీగానే చిత్రీకరించాడు బోయపాటి.
రెగ్యులర్ ఫైట్లతో పోలిస్తే ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభూతినే ఇస్తుంది కానీ.. ఇది మరీ ఔట్ స్టాండింగ్, వావ్ అనుకునే రేంజిలో అయితే ఏమీ లేదు. ఈ యాక్షన్ సీక్వెన్సుకి ఏకంగా నాలుగున్నర కోట్లు పెట్టారంటే విడ్డూరంగానే అనిపిస్తుంది. రామ్ స్థాయి హీరో సినిమాలో ఇంత ఖర్చు టూ మచ్ అనే చెప్పాలి. ఈ సీక్వెన్స్ కోసం పెద్ద సంఖ్యలో బర్రెల్ని తెప్పించడంతో పాటు.. ఏకంగా 29 జనరేటర్లు వాడినట్లు బోయపాటి వెల్లడించాడు.
అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్కు కూడా భారీగా ఖర్చయిందని.. కొన్ని రోజుల పాటు రిహార్సల్స్ చేసి ఈ సీక్వెన్స్ తీశామని.. అందువల్ల భారీగా ఖర్చు తప్పలేదని బోయపాటి తెలిపాడు. ఐతే సినిమాలో కంటెంట్ మీద దృష్టిపెట్టకుండా.. ఇలాంటి అవసరం లేని హంగుల మీద ఫోకస్ పెట్టడం వల్లే ‘స్కంద’కు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని.. అందుకే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితం వస్తోందని అర్థమవుతోంది.
This post was last modified on October 4, 2023 10:50 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…