నాలుగున్నర కోట్లు అంటే చిన్న సినిమాలు రెండు తీసేయొచ్చు. ఇంత బడ్జెట్లో రామ్ అనే మిడ్ రేంజ్ హీరో సినిమాలో కేవలం ఒక్క యాక్షణ్ సీక్వెన్స్ తీశారు అంటే షాకవ్వకుండా ఉండలేదు. అతను హీరోగా నటించిన కొత్త చిత్రం ‘స్కంద’లో ఫస్ట్ ఫైట్కు అంతే బడ్జెట్ అయిందట. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఈ చిత్రంలో రామ్ ఇంట్రోను హైదరాబాద్ పాత బస్తీలో జరిగే సదరు పండగ నేపథ్యంలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. సదరు పండుగలో దున్నపోతుల మధ్య పోటీ నిర్వహిస్తుండగా.. అక్కడికి ముఖ్యమంత్రి వస్తాడు. బర్రెలకు ఇంజక్షన్లు ఇచ్చి అవి అదుపు తప్పే గందరగోళంలో సీఎంను లేపేయాలని ప్రత్యర్థి వర్గం ప్లాన్ చేస్తే.. హీరో రంగంలోకి దిగి వాళ్లను అడ్డుకుంటాడు. ఈ నేపథ్యంలో బుల్ ఫైట్ను కొంచెం భారీగానే చిత్రీకరించాడు బోయపాటి.
రెగ్యులర్ ఫైట్లతో పోలిస్తే ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభూతినే ఇస్తుంది కానీ.. ఇది మరీ ఔట్ స్టాండింగ్, వావ్ అనుకునే రేంజిలో అయితే ఏమీ లేదు. ఈ యాక్షన్ సీక్వెన్సుకి ఏకంగా నాలుగున్నర కోట్లు పెట్టారంటే విడ్డూరంగానే అనిపిస్తుంది. రామ్ స్థాయి హీరో సినిమాలో ఇంత ఖర్చు టూ మచ్ అనే చెప్పాలి. ఈ సీక్వెన్స్ కోసం పెద్ద సంఖ్యలో బర్రెల్ని తెప్పించడంతో పాటు.. ఏకంగా 29 జనరేటర్లు వాడినట్లు బోయపాటి వెల్లడించాడు.
అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్కు కూడా భారీగా ఖర్చయిందని.. కొన్ని రోజుల పాటు రిహార్సల్స్ చేసి ఈ సీక్వెన్స్ తీశామని.. అందువల్ల భారీగా ఖర్చు తప్పలేదని బోయపాటి తెలిపాడు. ఐతే సినిమాలో కంటెంట్ మీద దృష్టిపెట్టకుండా.. ఇలాంటి అవసరం లేని హంగుల మీద ఫోకస్ పెట్టడం వల్లే ‘స్కంద’కు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని.. అందుకే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితం వస్తోందని అర్థమవుతోంది.
This post was last modified on October 4, 2023 10:50 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…