నాలుగున్నర కోట్లు అంటే చిన్న సినిమాలు రెండు తీసేయొచ్చు. ఇంత బడ్జెట్లో రామ్ అనే మిడ్ రేంజ్ హీరో సినిమాలో కేవలం ఒక్క యాక్షణ్ సీక్వెన్స్ తీశారు అంటే షాకవ్వకుండా ఉండలేదు. అతను హీరోగా నటించిన కొత్త చిత్రం ‘స్కంద’లో ఫస్ట్ ఫైట్కు అంతే బడ్జెట్ అయిందట. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఈ చిత్రంలో రామ్ ఇంట్రోను హైదరాబాద్ పాత బస్తీలో జరిగే సదరు పండగ నేపథ్యంలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. సదరు పండుగలో దున్నపోతుల మధ్య పోటీ నిర్వహిస్తుండగా.. అక్కడికి ముఖ్యమంత్రి వస్తాడు. బర్రెలకు ఇంజక్షన్లు ఇచ్చి అవి అదుపు తప్పే గందరగోళంలో సీఎంను లేపేయాలని ప్రత్యర్థి వర్గం ప్లాన్ చేస్తే.. హీరో రంగంలోకి దిగి వాళ్లను అడ్డుకుంటాడు. ఈ నేపథ్యంలో బుల్ ఫైట్ను కొంచెం భారీగానే చిత్రీకరించాడు బోయపాటి.
రెగ్యులర్ ఫైట్లతో పోలిస్తే ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభూతినే ఇస్తుంది కానీ.. ఇది మరీ ఔట్ స్టాండింగ్, వావ్ అనుకునే రేంజిలో అయితే ఏమీ లేదు. ఈ యాక్షన్ సీక్వెన్సుకి ఏకంగా నాలుగున్నర కోట్లు పెట్టారంటే విడ్డూరంగానే అనిపిస్తుంది. రామ్ స్థాయి హీరో సినిమాలో ఇంత ఖర్చు టూ మచ్ అనే చెప్పాలి. ఈ సీక్వెన్స్ కోసం పెద్ద సంఖ్యలో బర్రెల్ని తెప్పించడంతో పాటు.. ఏకంగా 29 జనరేటర్లు వాడినట్లు బోయపాటి వెల్లడించాడు.
అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్కు కూడా భారీగా ఖర్చయిందని.. కొన్ని రోజుల పాటు రిహార్సల్స్ చేసి ఈ సీక్వెన్స్ తీశామని.. అందువల్ల భారీగా ఖర్చు తప్పలేదని బోయపాటి తెలిపాడు. ఐతే సినిమాలో కంటెంట్ మీద దృష్టిపెట్టకుండా.. ఇలాంటి అవసరం లేని హంగుల మీద ఫోకస్ పెట్టడం వల్లే ‘స్కంద’కు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని.. అందుకే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితం వస్తోందని అర్థమవుతోంది.
This post was last modified on October 4, 2023 10:50 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…