ఎల్లుండి విడుదల కాబోతున్న మామా మశ్చీంద్ర ప్రీమియర్లకు సుధీర్ బాబు బృందం వెరైటీ ఐడియా వేసింది. ముందు రోజు రాత్రి ఏఎంబి మల్టీప్లెక్స్ లో వేయబోయే స్పెషల్ షోలో రెండున్నర గంటల పాటు ఆడియన్స్ లైవ్ రియాక్షన్లను రికార్డు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఇండియన్ సినిమాలో ఇలా చేయడం ఇదే మొదటిసారని అంటున్నారు. ఇది నిజమే. వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కెమెరాలు తమని గమనిస్తున్నాయన్న స్పృహ ప్రేక్షకుల స్వేచ్ఛని సహజంగానే తగ్గించేస్తుంది.
ఏదో పది ఇరవై నిముషాలు అంటే ఓకే కానీ మరీ సినిమా మొత్తం వాళ్ళ హావభావాలు చూపించడమంటే కొంచెం చిక్కే. ముందుగానే చెప్పి ప్రిపేర్ చేసి ఉంటారు కాబట్టి అభ్యంతరాలు రాకపోవచ్చు. కానీ ఇదేదో ఒక అరగంట గంటకు పరిమితం చేయడమో లేదా మొత్తం అయ్యాక ముఖ్యమైనవి మాత్రమే ఎడిట్ చేసి వాటిని ప్రమోషన్లలో వాడుకోవడమో చేసి ఉంటే బాగుండేది. విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ రావాలంటే ఏదో ఒక కొత్త స్ట్రాటజీ ఫాలో కావాల్సిందే. మామా మశ్చీంద్ర టీమ్ వెరైటీగా ఆలోచించింది. ఫలితం ఎలా ఉండబోతోందో రేపు చూడాలి.
ఒకవేళ ఇది సక్సెస్ అయితే తర్వాత మిగిలినవాళ్లు దీన్ని ఫాలో అయినా ఆశ్చర్యం లేదు. నటుడు రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన మామా మశ్చీంద్రలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేయడం ప్రధాన ఆకర్షణ. ఒకేలా కనిపించే లుక్స్ కాకుండా వృద్ధుడు, స్థూలకాయుడు, యువకుడు ఇలా మూడు రూపాల్లో కనిపించబోతున్నాడు. ట్రైలర్ చూశాక పాయింట్ అయితే వెరైటీగా అనిపించింది. రూల్స్ రంజన్, మంత్ అఫ్ మధు, మ్యాడ్, 800లతో పోటీ పడుతున్న మామా మశ్చీంద్రకు హిట్ టాక్ వస్తే మాత్రం దసరా దాకా మంచి వసూళ్లు రాబట్టుకునే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఏం చేయనుందో.
This post was last modified on October 4, 2023 8:57 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…