ఇవాళ హఠాత్తుగా సలార్ టీజర్ ని అప్డేట్ చేశారు. కలర్ కరెక్షన్ చేసి కొంత బ్రైట్ నెస్ పెంచడంతో పాటు ఒక మనిషి గుర్రంపై నుంచి సంకేతం ఇచ్చే షాట్ తీసేసి దాని స్థానంలో మాస్కులు వేసుకున్న సైనికులు పార్లమెంట్ లాంటి భవనంలో కవాతు చేసుకుంటూ నడిచే సన్నివేశం పెట్టారు. ఒకటిరెండుసార్లు మాత్రమే చూసినవాళ్ళు దీన్ని గురించరు కానీ వీరాభిమానులు మాత్రం ఈ తేడాని స్పష్టంగా పసిగట్టేశారు. రెండు పక్కపక్కన పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. టీజర్ చివరిలో డిసెంబర్ 22 విడుదల తేదీని జోడించారు. 134 మిలియన్ల వ్యూస్ వచ్చాక ఈ మార్పు చేయడం విశేషం.
కారణమేంటో తెలియదు కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఆ ఒక్క షాట్ ని ఎందుకు తీశారో అంతు చిక్కడం లేదు. సలార్ 2 కోసం దాచారా లేక అసలది పూర్తిగా తీసేసి వేరేది రీ షూట్ చేశారానేది సస్పెన్స్ గా ఉంది. ఫైనల్ కట్ తనకు నచ్చే వరకు రాజీ పడకుండా మార్పులు చేస్తూనే ఉంటాడని నీల్ కు పేరుంది. కెజిఎఫ్ కి సైతం బోలెడు రిపేర్లు జరిగాయి. ఇన్ని అంచనాలున్నప్పుడు సలార్ కి మాత్రం మినహాయింపు ఎందుకు ఇస్తారు. సో కంటెంట్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఈ రకంగా బయటపడుతున్నాయి.
అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పూర్తి లుక్ ని రివీల్ చేస్తూ ఒక కొత్త టీజర్ వదలబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. థియేట్రికల్ ట్రైలర్ ని నవంబర్ చివరి వారంలో ప్లాన్ చేశారట. ఎంత డార్లింగ్ బర్త్ డే అయినా రెండు నెలల ముందు ట్రైలర్ ఎందుకని దాన్ని కొంత ఆలస్యంగా తీసుకురాబోతున్నారు. మరోపక్క సలార్ బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. డుంకీతో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో థియేటర్ల సమస్య రాకుండా ఇండియా, ఓవర్సీస్ లో స్క్రీన్లను లాక్ చేసే పనిలో డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు. టాక్ రావాలే కానీ సలార్ ఎన్ని వందల కోట్లు చేస్తుందో ఊహకందడం లేదు.
This post was last modified on October 4, 2023 8:53 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…