ఇవాళ హఠాత్తుగా సలార్ టీజర్ ని అప్డేట్ చేశారు. కలర్ కరెక్షన్ చేసి కొంత బ్రైట్ నెస్ పెంచడంతో పాటు ఒక మనిషి గుర్రంపై నుంచి సంకేతం ఇచ్చే షాట్ తీసేసి దాని స్థానంలో మాస్కులు వేసుకున్న సైనికులు పార్లమెంట్ లాంటి భవనంలో కవాతు చేసుకుంటూ నడిచే సన్నివేశం పెట్టారు. ఒకటిరెండుసార్లు మాత్రమే చూసినవాళ్ళు దీన్ని గురించరు కానీ వీరాభిమానులు మాత్రం ఈ తేడాని స్పష్టంగా పసిగట్టేశారు. రెండు పక్కపక్కన పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. టీజర్ చివరిలో డిసెంబర్ 22 విడుదల తేదీని జోడించారు. 134 మిలియన్ల వ్యూస్ వచ్చాక ఈ మార్పు చేయడం విశేషం.
కారణమేంటో తెలియదు కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఆ ఒక్క షాట్ ని ఎందుకు తీశారో అంతు చిక్కడం లేదు. సలార్ 2 కోసం దాచారా లేక అసలది పూర్తిగా తీసేసి వేరేది రీ షూట్ చేశారానేది సస్పెన్స్ గా ఉంది. ఫైనల్ కట్ తనకు నచ్చే వరకు రాజీ పడకుండా మార్పులు చేస్తూనే ఉంటాడని నీల్ కు పేరుంది. కెజిఎఫ్ కి సైతం బోలెడు రిపేర్లు జరిగాయి. ఇన్ని అంచనాలున్నప్పుడు సలార్ కి మాత్రం మినహాయింపు ఎందుకు ఇస్తారు. సో కంటెంట్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఈ రకంగా బయటపడుతున్నాయి.
అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పూర్తి లుక్ ని రివీల్ చేస్తూ ఒక కొత్త టీజర్ వదలబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. థియేట్రికల్ ట్రైలర్ ని నవంబర్ చివరి వారంలో ప్లాన్ చేశారట. ఎంత డార్లింగ్ బర్త్ డే అయినా రెండు నెలల ముందు ట్రైలర్ ఎందుకని దాన్ని కొంత ఆలస్యంగా తీసుకురాబోతున్నారు. మరోపక్క సలార్ బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. డుంకీతో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో థియేటర్ల సమస్య రాకుండా ఇండియా, ఓవర్సీస్ లో స్క్రీన్లను లాక్ చేసే పనిలో డిస్ట్రిబ్యూటర్లు బిజీగా ఉన్నారు. టాక్ రావాలే కానీ సలార్ ఎన్ని వందల కోట్లు చేస్తుందో ఊహకందడం లేదు.
This post was last modified on October 4, 2023 8:53 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…