వయసు డెబ్భై దాటినా, నాలుగు వందల సినిమాలకు పైగా చేసినా, కొడుకు స్టార్ హీరోగా వెలుగుతున్నా అలుపు లేకుండా నటిస్తూనే ఉన్న మల్లువుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఏడాదికి కనీసం నాలుగైదు రిలీజులు ఉండేలా చూసుకుంటారు. ఎంత శ్రమ అయినా సరే లెక్క చేయకపోవడం ఆయన శైలి. సెట్స్ లో లేకపోతే తనకు అన్నం సహించదని చెప్పే తత్వం ఆయనది. మమ్ముట్టి లేటెస్ట్ మూవీ కన్నూర్ స్క్వాడ్ ఇటీవలే రిలీజయ్యింది. ముందు పెద్దగా అంచనాలు లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెమ్మదిగా జరిగాయి. మొదటి రోజు రెండు ఆటలు పూర్తవ్వడం ఆలస్యం సీన్ మారిపోయింది.
ఇదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. జార్జ్(మమ్ముట్టి) హెడ్డుగా వ్యవహరించే నలుగురు పోలీస్ ఆఫీసర్ల బృందం కాసర్గోడ్ అనే ఊరిలో ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో దొంగతనం కం హత్య కేసుని టేకప్ చేస్తారు. అయితే విచారణ జరిపే కొద్దీ చాలా తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి. ప్రమాదాల్లో చిక్కుకుంటారు. వృత్తి, ఫ్యామిలీ పరంగా ఒత్తిడి పెరుగుతుంది. వీళ్ళు కలిసి కట్టుగా దాన్ని ఎలా ఛేదించారనేది మెయిన్ స్టోరీ. కొంచెం కార్తీ ఖాకీ తరహా ఛాయలు అనిపించినప్పటికీ దర్శకుడు రాబీ వర్గీస్ రాజ్ తన డెబ్యూని పర్ఫెక్ట్ గా లాంచ్ చేసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఈయనకు డైరెక్టర్ గా ఇదే మొదటి చిత్రం.
తెలిసిన కథలాగే అనిపించినా ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించిన తీరు విసుగు రాకుండా చేసింది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. మమ్ముట్టితో పాటు ఇతర క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్ సన్నివేశాల ఘాడతను పెంచాయి. మొదటి ఆరు రోజుల్లోనే ఒక్క కేరళ నుంచే 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిన కన్నూర్ స్క్వాడ్ వరల్డ్ వైడ్ 42 కోట్లు దాటించేసింది. సులభంగా రెండు వారాలకు పైగా స్ట్రాంగ్ గా నడుస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. తెలుగులో డబ్బింగ్ చేసినా థియేట్రికల్ గా వర్కౌట్ కాకపోవచ్చు కనక ఓటిటిలో వచ్చినప్పుడు చూడటం తప్పించి మనకు వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on October 4, 2023 4:05 pm
నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ టీజర్ పట్ల రామ్ అభిమానుల స్పందన కాసేపు పక్కనపెడితే సగటు ప్రేక్షకులకు మాత్రం మరీ…
ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి సంబంధించి పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుకాలేదని ఎదురు చూస్తున్న…
అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్…
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం…
ఏపీ సీఎం జగన్ నివాసం ఉంటే తాడేపల్లిలోని ఇంట్లో విశిష్ఠ రాజశ్యామల యాగం నిర్వహించారు. అయితే.. ఇది 41 రోజుల…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది.…