యాంకర్ కం దర్శకుడిగా ఓంకార్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజుగారి గది మూడు సిరీస్ ల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మాన్షన్ 24తో ఓటిటి ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. డిస్నీ హాట్ స్టార్ లో అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ ట్రైలర్ ని ఇవాళ గ్రాండ్ గా లాంచ్ చేశారు. దీని మీద ఆసక్తి కలగడానికి ఇదొక్కటే కారణం కాదు. మంచి క్యాస్టింగ్ ని సెట్ చేసుకుని ఇంటెన్స్ జానర్ లో ఓంకార్ ఈ కథను చెప్పే ప్రయత్నమే. కథను దాచకుండా రెండున్నర నిమిషాల వీడియోలో సబ్జెక్టు దేని గురించో స్పష్టంగా చెప్పేశారు.
ప్రభుత్వాధికారి కాళిదాస్(సత్యరాజ్)మీద దేశద్రోహి ముద్రపడి కనిపించకుండా పోతాడు. భార్య(తులసి)మంచాన పడితే ఆయన కూతురు(వరలక్ష్మి శరత్ కుమార్) వెతకాలని నిర్ణయించుకుంటుంది. చివరిసారిగా తండ్రి మాన్షన్ 24 బంగాళాకు వెళ్లాడని తెలుసుకుని అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రామని ఎందరు హెచ్చరించినా ధైర్యంగా అడుగు పెడుతుంది. లోపలికి వెళ్ళాక విస్తుగొలిపే విషయాలు బయట పడతాయి. అక్కడ నిజంగా దెయ్యాల జాడలు కనిపిస్తాయి. అంత పెద్ద భవంతిలో ఉన్న రహస్యం ఏమిటి, కాళిదాస్ ని ఆ అమ్మాయి కలుసుకుందా లేదానే ప్రశ్నలు సిరీస్ లోనే చూడాలి.
కామెడీ జోలికి వెళ్లకుండా ఓంకార్ చాలా సీరియస్ గా మాన్షన్ 24ని డీల్ చేశారు. అవికా గోర్, రావు రమేష్, రాజీవ్ కనకాల, నందు, బిందు మాధవి, అయ్యప్ప పి శర్మ, కాలకేయ ప్రభాకర్, విద్యుల్లేఖ రామన్, సూర్య, అమర్ దీప్, అర్చన ఇలా పెద్ద తారాగణమే ఉంది. వికాస్ బడిసా సంగీతం సమకూర్చగా రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించారు. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్ కనిపిస్తోంది. తనకు పట్టున్న భూత ప్రేతాల జానర్ లోనే ఓంకార్ మరోసారి మెప్పించేలానే ఉన్నాడు. బడ్జెట్ భారీగానే పెట్టారు. కంటెంట్ మొత్తం ఇలాగే భయపెట్టేలా ఉంటే డిజిటల్ లోనూ హిట్టు కొట్టినట్టే.
This post was last modified on October 4, 2023 1:54 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…