ప్రస్తుతం గుంటూరు కారంని సంక్రాంతి బరిలో నిలిపే లక్ష్యంతో జెట్ స్పీడ్ తో షూటింగ్ చేస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ లోపే మొత్తం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. మహేష్ బాబు పూర్తి సహకారంతో కావాల్సినన్ని డేట్లు ఇవ్వడంతో డిసెంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్, ఆ తర్వాత ప్రమోషన్ల కోసం వాడుకునేలా పక్కా ప్లాన్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇంకా కీలకమైన పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్నప్పటికీ వాటి విషయంలోనూ జాప్యం జరగకుండా ప్రణాళిక సిద్ధం చేశారట. దీని తర్వాత ఐకాన్ స్టార్ బన్నీతో ప్యాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడే తెరవెనుక కొన్ని కీలక పరిణామాలు జరిగాయని ఇండస్ట్రీ టాక్. పుష్ప 2 ది రూల్ పూర్తవ్వడానికి 2024 వేసవి వచ్చేస్తుంది. ఆగస్ట్ 15 విడుదల కాబట్టి ప్రమోషన్ల కోసం దేశం మొత్తం తిరిగేందుకు అల్లు అర్జున్ కు ఎంత లేదన్నా రెండు నెలల టైం ఇవ్వాలి. రిలీజయ్యాక కూడా హడావిడి మాములుగా ఉండదు. త్రివిక్రమ్ చూస్తే ఫిబ్రవరి నుంచి ఖాళీ అవుతారు. స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేసినా తగినంత సమయం బోలెడుంటుంది. ఈ గ్యాప్ లో ఎప్పటి నుంచో అనుకుంటున్న చిరంజీవి సినిమాని ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు సీరియస్ గానే జరుగుతున్నాయట.
డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి ఉంది. కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఒకవేళ అల్లు అర్జున్ కనక పుష్ప తర్వాత తక్కువ టైంలో అట్లీతో ఓ మూవీ సెట్ చేసుకుంటూ త్రివిక్రమ్ కు మరికొంత ఎక్కువ సమయం దొరుకుతుంది. అది వృథా కాకుండా చిరుతో పని కానిచేయొచ్చు. ఇదంతా ప్రాధమిక దశలోనే ఉంది తప్ప ఇంకా ఎలాంటి నిర్ధారణలు జరగలేదు. జై చిరంజీవలో మెగాస్టార్ కోసం సంభాషణలు రాసిన మాటల మాంత్రికుడు ఇప్పుడు ఏకంగా ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే మెగా ఫ్యాన్స్ కి అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది. జరగాలనే సగటు మూవీ లవర్స్ కోరిక.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…