ప్రస్తుతం గుంటూరు కారంని సంక్రాంతి బరిలో నిలిపే లక్ష్యంతో జెట్ స్పీడ్ తో షూటింగ్ చేస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ లోపే మొత్తం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. మహేష్ బాబు పూర్తి సహకారంతో కావాల్సినన్ని డేట్లు ఇవ్వడంతో డిసెంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్, ఆ తర్వాత ప్రమోషన్ల కోసం వాడుకునేలా పక్కా ప్లాన్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇంకా కీలకమైన పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్నప్పటికీ వాటి విషయంలోనూ జాప్యం జరగకుండా ప్రణాళిక సిద్ధం చేశారట. దీని తర్వాత ఐకాన్ స్టార్ బన్నీతో ప్యాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడే తెరవెనుక కొన్ని కీలక పరిణామాలు జరిగాయని ఇండస్ట్రీ టాక్. పుష్ప 2 ది రూల్ పూర్తవ్వడానికి 2024 వేసవి వచ్చేస్తుంది. ఆగస్ట్ 15 విడుదల కాబట్టి ప్రమోషన్ల కోసం దేశం మొత్తం తిరిగేందుకు అల్లు అర్జున్ కు ఎంత లేదన్నా రెండు నెలల టైం ఇవ్వాలి. రిలీజయ్యాక కూడా హడావిడి మాములుగా ఉండదు. త్రివిక్రమ్ చూస్తే ఫిబ్రవరి నుంచి ఖాళీ అవుతారు. స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేసినా తగినంత సమయం బోలెడుంటుంది. ఈ గ్యాప్ లో ఎప్పటి నుంచో అనుకుంటున్న చిరంజీవి సినిమాని ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు సీరియస్ గానే జరుగుతున్నాయట.
డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి ఉంది. కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఒకవేళ అల్లు అర్జున్ కనక పుష్ప తర్వాత తక్కువ టైంలో అట్లీతో ఓ మూవీ సెట్ చేసుకుంటూ త్రివిక్రమ్ కు మరికొంత ఎక్కువ సమయం దొరుకుతుంది. అది వృథా కాకుండా చిరుతో పని కానిచేయొచ్చు. ఇదంతా ప్రాధమిక దశలోనే ఉంది తప్ప ఇంకా ఎలాంటి నిర్ధారణలు జరగలేదు. జై చిరంజీవలో మెగాస్టార్ కోసం సంభాషణలు రాసిన మాటల మాంత్రికుడు ఇప్పుడు ఏకంగా ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే మెగా ఫ్యాన్స్ కి అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది. జరగాలనే సగటు మూవీ లవర్స్ కోరిక.
This post was last modified on October 4, 2023 12:01 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…