ప్రస్తుతం గుంటూరు కారంని సంక్రాంతి బరిలో నిలిపే లక్ష్యంతో జెట్ స్పీడ్ తో షూటింగ్ చేస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ లోపే మొత్తం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. మహేష్ బాబు పూర్తి సహకారంతో కావాల్సినన్ని డేట్లు ఇవ్వడంతో డిసెంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్, ఆ తర్వాత ప్రమోషన్ల కోసం వాడుకునేలా పక్కా ప్లాన్ ని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇంకా కీలకమైన పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్నప్పటికీ వాటి విషయంలోనూ జాప్యం జరగకుండా ప్రణాళిక సిద్ధం చేశారట. దీని తర్వాత ఐకాన్ స్టార్ బన్నీతో ప్యాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడే తెరవెనుక కొన్ని కీలక పరిణామాలు జరిగాయని ఇండస్ట్రీ టాక్. పుష్ప 2 ది రూల్ పూర్తవ్వడానికి 2024 వేసవి వచ్చేస్తుంది. ఆగస్ట్ 15 విడుదల కాబట్టి ప్రమోషన్ల కోసం దేశం మొత్తం తిరిగేందుకు అల్లు అర్జున్ కు ఎంత లేదన్నా రెండు నెలల టైం ఇవ్వాలి. రిలీజయ్యాక కూడా హడావిడి మాములుగా ఉండదు. త్రివిక్రమ్ చూస్తే ఫిబ్రవరి నుంచి ఖాళీ అవుతారు. స్క్రిప్ట్ మీద ఎంత వర్క్ చేసినా తగినంత సమయం బోలెడుంటుంది. ఈ గ్యాప్ లో ఎప్పటి నుంచో అనుకుంటున్న చిరంజీవి సినిమాని ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు సీరియస్ గానే జరుగుతున్నాయట.
డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి ఉంది. కానీ ఆలస్యమవుతూ వచ్చింది. ఒకవేళ అల్లు అర్జున్ కనక పుష్ప తర్వాత తక్కువ టైంలో అట్లీతో ఓ మూవీ సెట్ చేసుకుంటూ త్రివిక్రమ్ కు మరికొంత ఎక్కువ సమయం దొరుకుతుంది. అది వృథా కాకుండా చిరుతో పని కానిచేయొచ్చు. ఇదంతా ప్రాధమిక దశలోనే ఉంది తప్ప ఇంకా ఎలాంటి నిర్ధారణలు జరగలేదు. జై చిరంజీవలో మెగాస్టార్ కోసం సంభాషణలు రాసిన మాటల మాంత్రికుడు ఇప్పుడు ఏకంగా ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే మెగా ఫ్యాన్స్ కి అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది. జరగాలనే సగటు మూవీ లవర్స్ కోరిక.
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…