భోళా శంకర్ తర్వాత పూర్తిగా ఆత్మపరిశీలనలో పడిపోయిన మెగాస్టార్ చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో కమిటైన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టుని కూతురే నిర్మాతైనా సరే ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఆపేశారనే టాక్ కూడా ఉంది. ఈ కారణంగానే కొంచెం లేట్ గా మొదలుపెట్టాలనుకున్న వశిష్ట డైరెక్షన్ లోని మెగా 157ని వేగంగా పట్టాలెక్కించే పనులు చేస్తున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేలా షెడ్యూలింగ్ జరుగుతోంది. ఈలోగా హీరోయిన్ల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంటుంది.
దీని సంగతలా ఉంచితే చిరంజీవి సుకుమార్ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని మెగా కాంపౌండ్ టాక్. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పనుల్లో బిజీగా ఉన్న సుక్కు 2024 వేసవికి ఫ్రీ అవుతారు. ఆగస్ట్ 15 సినిమా రిలీజయ్యాక ఎలాంటి టెన్షన్లు ఉండవు. తర్వాత ఏ హీరోతో చేసేది ఇంకా కమిట్ మెంట్ ఇవ్వలేదు. అది చిరుకేనని వినికిడి. ఎప్పటి నుంచో ఈ కలయిక కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సాధ్యమయ్యే ఛాన్స్ ఉందనడానికి కారణాలున్నాయి. పైకి కనిపించకపోయినా సుకుమార్ మెగాస్టార్ తో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారు. గాడ్ ఫాదర్ టైంలో సుజిత్ కన్నా ముందు ఒక వెర్షన్ రాసిచ్చారు కూడా.
వాల్తేరు వీరయ్య సమయంలోనూ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. చిరు మీద సుక్కుకి అంత అభిమానం, బాండింగ్ ఉండబట్టే పుష్ప 1లో చూడాలని ఉంది రిఫరెన్స్ తో పాటు చిరంజీవి వాడకం చేసుకున్నారు. ఈ మధ్యే స్టోరీ లైన్ కి సంబంధించి చిన్న చర్చ కూడా జరిగిందట. అయితే రామ్ చరణ్ తోనూ ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్న సుకుమార్ ఒకవేళ తండ్రి కొడుకుల్లో ఒకరివైపే మొగ్గు చూపాల్సి వస్తే అది చిరునే అవుతారని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి ఇది పుకారో వాస్తవమో నిర్ధారణ లేకపోయినా నిజమయ్యేందుకు అవకాశాలను ఎంత మాత్రం కొట్టిపారేయలేం. జరగాలనే కోరుకుందాం.
This post was last modified on October 3, 2023 9:28 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…