భోళా శంకర్ తర్వాత పూర్తిగా ఆత్మపరిశీలనలో పడిపోయిన మెగాస్టార్ చిరంజీవి తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో కమిటైన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టుని కూతురే నిర్మాతైనా సరే ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఆపేశారనే టాక్ కూడా ఉంది. ఈ కారణంగానే కొంచెం లేట్ గా మొదలుపెట్టాలనుకున్న వశిష్ట డైరెక్షన్ లోని మెగా 157ని వేగంగా పట్టాలెక్కించే పనులు చేస్తున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లేలా షెడ్యూలింగ్ జరుగుతోంది. ఈలోగా హీరోయిన్ల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంటుంది.
దీని సంగతలా ఉంచితే చిరంజీవి సుకుమార్ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని మెగా కాంపౌండ్ టాక్. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పనుల్లో బిజీగా ఉన్న సుక్కు 2024 వేసవికి ఫ్రీ అవుతారు. ఆగస్ట్ 15 సినిమా రిలీజయ్యాక ఎలాంటి టెన్షన్లు ఉండవు. తర్వాత ఏ హీరోతో చేసేది ఇంకా కమిట్ మెంట్ ఇవ్వలేదు. అది చిరుకేనని వినికిడి. ఎప్పటి నుంచో ఈ కలయిక కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సాధ్యమయ్యే ఛాన్స్ ఉందనడానికి కారణాలున్నాయి. పైకి కనిపించకపోయినా సుకుమార్ మెగాస్టార్ తో రెగ్యులర్ టచ్ లోనే ఉన్నారు. గాడ్ ఫాదర్ టైంలో సుజిత్ కన్నా ముందు ఒక వెర్షన్ రాసిచ్చారు కూడా.
వాల్తేరు వీరయ్య సమయంలోనూ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. చిరు మీద సుక్కుకి అంత అభిమానం, బాండింగ్ ఉండబట్టే పుష్ప 1లో చూడాలని ఉంది రిఫరెన్స్ తో పాటు చిరంజీవి వాడకం చేసుకున్నారు. ఈ మధ్యే స్టోరీ లైన్ కి సంబంధించి చిన్న చర్చ కూడా జరిగిందట. అయితే రామ్ చరణ్ తోనూ ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్న సుకుమార్ ఒకవేళ తండ్రి కొడుకుల్లో ఒకరివైపే మొగ్గు చూపాల్సి వస్తే అది చిరునే అవుతారని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి ఇది పుకారో వాస్తవమో నిర్ధారణ లేకపోయినా నిజమయ్యేందుకు అవకాశాలను ఎంత మాత్రం కొట్టిపారేయలేం. జరగాలనే కోరుకుందాం.
This post was last modified on October 3, 2023 9:28 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…