Movie News

విశాల్ దెబ్బకు మొత్తం కదిలింది

తమిళ కథానాయకుడు, నిర్మాత విశాల్.. ఇటీవల ముంబయి సెన్సార్ బోర్డులో అవినీతిపై చేసిన ఆరోపణలు.. అతను రిలీజ్ చేసిన వీడియో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ సెన్సార్ చేయించేందుకు రూ.6.5 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను వెల్లడించాడు. స్క్రీనింగ్‌కు రూ.3 లక్షలు, సెన్సార్ సర్టిఫికేషన్‌కు రూ.3.5 లక్షలు ఇచ్చానంటూ ఎవరెవరికి డబ్బులు పంపింది అకౌంట్ వివరాలతో సహా అతను సోషల్ మీడియాలో పెట్టేశాడు.

ఈ వ్యవహారం ఫిలిం ఇండస్ట్రీలో దుమారం రేపింది. సెన్సార్ బోర్డులో అవినీతి గురించి వివిధ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా దీని మీద డిస్కషన్లు నడిచాయి. మీడియాలో ఈ వార్త సంచలనం రేపడంతో వెంటనే ప్రభుత్వం వైపు నుంచి చర్యలు కూడా మొదలయ్యాయి. ఈ వ్యవహారం మీద విచారణకు కమిటీ కూడా వేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఐతే ఈ వ్యవహారం అంతటితో ముగియలేదు. కేంద్ర స్థాయిలో కూడా సెన్సార్ బోర్డు అవినీతి మీద చర్యలకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి ఈ వ్యవహారంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. విశాల్ ఆరోపణలపై చర్చించేందుకు.. సెన్సార్ బోర్డులో అవినీతిని అరికట్టేందుకు ఏం చేయాలన్నదానిపై ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

వివిధ రాష్ట్రాల సెన్సార్ బోర్డు ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారట. విశాల్ ఆరోపణల మీద నేషనల్ మీడియాలోనూ చర్చ జరగడంతో.. ముంబయి సెన్సార్ బోర్డులో అప్పట్నుంచి కార్యకలాపాలు ఆగిపోయిన్లు తెలుస్తోంంది. పలు చిత్రాల సెన్సార్ పెండింగ్‌లో పడింది. దీని వల్ల కొన్ని సినిమాల రిలీజ్ డేట్లను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తంగా విశాల్ చేసిన పనితో దేశవ్యాప్తంగా సెన్సార్ బోర్డుల్లో కలకలం రేగిన సంకేతాలు కనిపిస్తోంది.

This post was last modified on October 3, 2023 6:38 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

5 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

5 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

7 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

7 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

11 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

13 hours ago