సుషాంత్ సింగ్ రాజ్పుట్ ఆత్మహత్య వార్త బయటకు వచ్చిన దగ్గర్నుంచీ ఎంతో కాలంగా తాను ఫైట్ చేస్తోన్న బాలీవుడ్లో నెపోటిజమ్ అంశాన్ని కంగన తీవ్ర స్థాయిలో పైకి తీసింది. సుషాంత్ మరణంతో సంబంధమే లేని కరణ్ జోహార్ లాంటి తన శత్రువులను టార్గెట్ చేస్తూ, వాళ్లనే ఈ చావుకి బాధ్యులను చేస్తూ మాట్లాడింది. మీడియా రియా చక్రవర్తిని దోషిగా చూపిస్తున్నా కానీ కంగన ఆమె గురించి ఏమీ మాట్లాడలేదు. ఆమె గురించి స్పందిస్తే తన యాంగిల్ పక్కకు పోతుందని కంగన భావించింది.
అయితే మొదట్లో కంగన వైపు వున్న వాళ్లు నెమ్మదిగా ఆమెది అజెండా బేస్డ్ వార్ అని తీర్మానించారు. ముఖ్యంగా అప్పట్లో సుషాంత్ సింగ్ రాజ్పుట్తో నటించడానికి అతనో చిన్న నటుడని కంగన రిజెక్ట్ చేసిందనే న్యూస్ ఇప్పుడు హైలైట్ అయింది. అతను బతికున్నపుడు చిన్న నటుడిగా చూసి, ఇప్పుడతని చావుని తన అజెండా కోసం వాడుకుంటోందంటూ ‘బాయ్కాట్ కంగన’ హ్యాష్టాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. రియా చక్రవర్తి గురించి ఆమె అసలు స్పందించకపోవడం కూడా ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. అయితే ఎలాంటి ఆరోపణలు వచ్చినా తనదైన శైలిలో తిప్పికొట్టే కంగన వీటికి ఎలా బదులిస్తుందనేది ఆసక్తిగొలుపుతోంది.
This post was last modified on August 25, 2020 2:28 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…