ఏడాది చివరి నెలలో పోటీ చూస్తుంటే మాములు రసవత్తరంగా ఉండేలా లేదు. సలార్ వచ్చి చేరాక ఇంతకు ముందు షెడ్యూల్ చేసుకున్న నిర్మాతలు కిందా మీద పడుతున్నారు. గతంలో డిసెంబర్ 15 ప్లాన్ చేసుకున్న రెండు బాలీవుడ్ సినిమాలు ఒక వారం ముందుకు జరిగి 8కే రాబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చేశాయి. ఒకటి మెర్రి క్రిస్మస్. విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ కలయికలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ మీద మంచి అంచనాలున్నాయి. రెండోది సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా కరణ్ జోహార్ నిర్మించిన యోధ. ఇవి తెలుగుతో సహా ప్యాన్ ఇండియా భాషల్లో రూపొందుతున్నాయి.
ఇక తెలుగు విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ గతంలోనే ఈ డేట్ ని లాక్ చేసుకుని అనౌన్స్ మెంట్ ఇచ్చింది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి కూడా నేను సైతం అంటూ రెడీ అవుతోంది. సలార్ వల్ల డేట్ మార్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో నాని హాయ్ నాన్న డిసెంబర్ 7 గురించి సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇవన్నీ హిందీ వెర్షన్ తో సహా రిలీజయ్యేవే. అలాంటప్పుడు క్లాష్ మాములుగా ఉండదు. ప్రభాస్ రాకకు కనీసం రెండు వారాల ముందు వస్తే వసూళ్ల పరంగా ఇబ్బంది ఉండదనే కోణంలో ఇలా ప్లాన్ చేస్తున్నారు కానీ ఫైనల్ గా పరస్పర ఓపెనింగ్స్ కి దెబ్బ తప్పదు.
ఒకపక్క షూటింగులు చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఒత్తిడిలో ఉన్న దర్శక నిర్మాతలకు రిలీజ్ డేట్ల పంచాయితీ పెద్ద తలనెప్పిగా మారింది. ఒక తేదీ ప్రకటించి నిశ్చింతగా ఉండటానికి లేదు. ఏ పెద్ద హీరో ఆ డేట్ కి వస్తాడోనని టెన్షన్ తో రోజులు గడపాల్సి వస్తోంది. ఆ భయమే నిజమైతే దానికి ప్రత్యాన్మయం వెతుక్కోవడం అంతకన్నా పెద్ద సమస్యగా మారుతోంది. మాములుగా డ్రై మంత్ గా భావించే డిసెంబర్ లో ఈ స్థాయిలో తాకిడి గతంలో ఎప్పుడు లేదు. నాగార్జునకు మాత్రమే ఈ నెలలో చెప్పుకోదగ్గ హిట్లున్నాయి. చూస్తుంటే ఈసారి సెంటిమెంట్లు లెక్కలు అన్నీ మారిపోయేలా ఉన్నాయి.
This post was last modified on October 3, 2023 1:28 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…