ఏడాది చివరి నెలలో పోటీ చూస్తుంటే మాములు రసవత్తరంగా ఉండేలా లేదు. సలార్ వచ్చి చేరాక ఇంతకు ముందు షెడ్యూల్ చేసుకున్న నిర్మాతలు కిందా మీద పడుతున్నారు. గతంలో డిసెంబర్ 15 ప్లాన్ చేసుకున్న రెండు బాలీవుడ్ సినిమాలు ఒక వారం ముందుకు జరిగి 8కే రాబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చేశాయి. ఒకటి మెర్రి క్రిస్మస్. విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ కలయికలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ మీద మంచి అంచనాలున్నాయి. రెండోది సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా కరణ్ జోహార్ నిర్మించిన యోధ. ఇవి తెలుగుతో సహా ప్యాన్ ఇండియా భాషల్లో రూపొందుతున్నాయి.
ఇక తెలుగు విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ గతంలోనే ఈ డేట్ ని లాక్ చేసుకుని అనౌన్స్ మెంట్ ఇచ్చింది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి కూడా నేను సైతం అంటూ రెడీ అవుతోంది. సలార్ వల్ల డేట్ మార్చుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో నాని హాయ్ నాన్న డిసెంబర్ 7 గురించి సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇవన్నీ హిందీ వెర్షన్ తో సహా రిలీజయ్యేవే. అలాంటప్పుడు క్లాష్ మాములుగా ఉండదు. ప్రభాస్ రాకకు కనీసం రెండు వారాల ముందు వస్తే వసూళ్ల పరంగా ఇబ్బంది ఉండదనే కోణంలో ఇలా ప్లాన్ చేస్తున్నారు కానీ ఫైనల్ గా పరస్పర ఓపెనింగ్స్ కి దెబ్బ తప్పదు.
ఒకపక్క షూటింగులు చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఒత్తిడిలో ఉన్న దర్శక నిర్మాతలకు రిలీజ్ డేట్ల పంచాయితీ పెద్ద తలనెప్పిగా మారింది. ఒక తేదీ ప్రకటించి నిశ్చింతగా ఉండటానికి లేదు. ఏ పెద్ద హీరో ఆ డేట్ కి వస్తాడోనని టెన్షన్ తో రోజులు గడపాల్సి వస్తోంది. ఆ భయమే నిజమైతే దానికి ప్రత్యాన్మయం వెతుక్కోవడం అంతకన్నా పెద్ద సమస్యగా మారుతోంది. మాములుగా డ్రై మంత్ గా భావించే డిసెంబర్ లో ఈ స్థాయిలో తాకిడి గతంలో ఎప్పుడు లేదు. నాగార్జునకు మాత్రమే ఈ నెలలో చెప్పుకోదగ్గ హిట్లున్నాయి. చూస్తుంటే ఈసారి సెంటిమెంట్లు లెక్కలు అన్నీ మారిపోయేలా ఉన్నాయి.
This post was last modified on October 3, 2023 1:28 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…