తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో దాదాపు అందరితోను (చిరంజీవి, వెంకటేష్ మినహా) పూరి జగన్నాథ్ సినిమాలు తీసాడు. సినిమాలపై ఇష్టం కలగడానికి, దర్శకుడిగా మారడానికి కారణం చిరంజీవి అని పూరి పలుమార్లు చెబుతుంటాడు. చిరంజీవిపై పూరి అభిమానం ‘ఇడియట్’లాంటి సినిమాల్లో క్లియర్గా చూపించాడు. అయితే ఇంతవరకు తన ఫేవరెట్ హీరోతో పూరి సినిమా చేయలేదు. ఖైదీ నంబర్ 150 ముందు ఈ కాంబినేషన్ దాదాపు ఓకే అయినట్టే అయి కాన్సిల్ అయిపోయింది.
లాక్డౌన్లో చిరంజీవి కోసం పూరి ఒక కథ రాస్తున్నట్టు విస్తృతంగా వినిపించింది. అయితే ఇప్పుడు పూరి మలి చిత్రం నాగార్జునతో వుంటుందని మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై నాగ్ కానీ, పూరి కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. నాగార్జునకు అయితే వైల్డ్ డాగ్ కాకుండా మరో రెండు సినిమాల కమిట్మెంట్స్ వున్నాయి. మరి చిరంజీవి కోసం పూరి కథ రాసాడో లేదో, రాసినా వినిపించాడో లేదో తెలియదు. ఆ కథే నాగార్జునకి చెప్పి ఓకే చేయించుకున్నాడని అంటున్నారు. బహుశా నాగార్జున బర్త్ డేకి, అంటే ఆగస్టు 29కి ఈ న్యూస్పై కాసింత క్లారిటీ రావచ్చు.
This post was last modified on August 25, 2020 2:20 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…