తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో దాదాపు అందరితోను (చిరంజీవి, వెంకటేష్ మినహా) పూరి జగన్నాథ్ సినిమాలు తీసాడు. సినిమాలపై ఇష్టం కలగడానికి, దర్శకుడిగా మారడానికి కారణం చిరంజీవి అని పూరి పలుమార్లు చెబుతుంటాడు. చిరంజీవిపై పూరి అభిమానం ‘ఇడియట్’లాంటి సినిమాల్లో క్లియర్గా చూపించాడు. అయితే ఇంతవరకు తన ఫేవరెట్ హీరోతో పూరి సినిమా చేయలేదు. ఖైదీ నంబర్ 150 ముందు ఈ కాంబినేషన్ దాదాపు ఓకే అయినట్టే అయి కాన్సిల్ అయిపోయింది.
లాక్డౌన్లో చిరంజీవి కోసం పూరి ఒక కథ రాస్తున్నట్టు విస్తృతంగా వినిపించింది. అయితే ఇప్పుడు పూరి మలి చిత్రం నాగార్జునతో వుంటుందని మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై నాగ్ కానీ, పూరి కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. నాగార్జునకు అయితే వైల్డ్ డాగ్ కాకుండా మరో రెండు సినిమాల కమిట్మెంట్స్ వున్నాయి. మరి చిరంజీవి కోసం పూరి కథ రాసాడో లేదో, రాసినా వినిపించాడో లేదో తెలియదు. ఆ కథే నాగార్జునకి చెప్పి ఓకే చేయించుకున్నాడని అంటున్నారు. బహుశా నాగార్జున బర్త్ డేకి, అంటే ఆగస్టు 29కి ఈ న్యూస్పై కాసింత క్లారిటీ రావచ్చు.
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…