తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో దాదాపు అందరితోను (చిరంజీవి, వెంకటేష్ మినహా) పూరి జగన్నాథ్ సినిమాలు తీసాడు. సినిమాలపై ఇష్టం కలగడానికి, దర్శకుడిగా మారడానికి కారణం చిరంజీవి అని పూరి పలుమార్లు చెబుతుంటాడు. చిరంజీవిపై పూరి అభిమానం ‘ఇడియట్’లాంటి సినిమాల్లో క్లియర్గా చూపించాడు. అయితే ఇంతవరకు తన ఫేవరెట్ హీరోతో పూరి సినిమా చేయలేదు. ఖైదీ నంబర్ 150 ముందు ఈ కాంబినేషన్ దాదాపు ఓకే అయినట్టే అయి కాన్సిల్ అయిపోయింది.
లాక్డౌన్లో చిరంజీవి కోసం పూరి ఒక కథ రాస్తున్నట్టు విస్తృతంగా వినిపించింది. అయితే ఇప్పుడు పూరి మలి చిత్రం నాగార్జునతో వుంటుందని మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై నాగ్ కానీ, పూరి కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. నాగార్జునకు అయితే వైల్డ్ డాగ్ కాకుండా మరో రెండు సినిమాల కమిట్మెంట్స్ వున్నాయి. మరి చిరంజీవి కోసం పూరి కథ రాసాడో లేదో, రాసినా వినిపించాడో లేదో తెలియదు. ఆ కథే నాగార్జునకి చెప్పి ఓకే చేయించుకున్నాడని అంటున్నారు. బహుశా నాగార్జున బర్త్ డేకి, అంటే ఆగస్టు 29కి ఈ న్యూస్పై కాసింత క్లారిటీ రావచ్చు.
This post was last modified on August 25, 2020 2:20 am
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…