Movie News

షూటింగుకు ముందే 95 కోట్ల ఆఫర్

మొన్నటి దాకా పెద్దగా ఎవరూ పట్టించుకోని బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీడియోల్ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. మొహం చాటేసిన దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. అడ్వాన్సులు ఇచ్చేందుకు వెంటపడుతున్నారు. ఇదంతా గదర్ 2 మహత్యమే. అతి పెద్ద హిందీ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ క్లాసిక్ సీక్వెల్ తర్వాత సన్నీ చేయబోయే సినిమాల లిస్టు పెరుగుతోంది. అమీర్ ఖాన్ నిర్మాతగా రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో స్పెషల్ ఏమనేగా మీ డౌట్. అక్కడికే వద్దాం.

సన్నీ డియోల్, రాజ్ కుమార్ సంతోషి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. అవి దామిని, ఘాయల్, ఘాతక్. అన్నీ సూపర్ డూపర్ హిట్లే. 1996 తర్వాత మళ్ళీ ఈ కాంబో సాధ్యపడలేదు. ఏవో విబేధాల వల్ల తిరిగి కలుసుకునే ప్రయత్నాలు చేయలేదు. పాతికేళ్ల తర్వాత చేతులు కలపబోతున్నారు. టైటిల్ గా ‘జిస్నే లాహోర్ నహీ దేఖా’ని పరిశీలిస్తున్నారు. ఇది అస్గర్ వజాహట్ రాసిన నవల ఆధారంగా రూపొందనుంది. 1947 ఇండియా పాకిస్థాన్ విభజన టైంలో లక్నో నుంచి లాహోర్ వెళ్లిన శరణార్ధుల విషాద పరిణామాల చుట్టూ తిరిగే కథగా దీన్ని రాసుకున్నారట. ఇంచుమిందు గదర్ లైనే ఇది.

కాకపోతే కమర్షియల్ టచ్ కన్నా సీరియస్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ప్రాజెక్ట్ లాక్ చేసుకున్న వెంటనే జీ5 సంస్థ నుంచి 95 కోట్లకు ఓటిటి డీల్ వచ్చిందని ముంబై టాక్. అయితే ఇంకా మంచి రేట్ వస్తుందనే ఉద్దేశంతో అమీర్ ఖాన్ ఇంకా ఎస్ చెప్పలేదట. అసలు గదర్ 2 బడ్జెటే ఎనభై కోట్లు దాటలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత మొత్తమంటే విశేషమే. వచ్చే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. సౌత్ లో కమల్ హాసన్, రజనీకాంత్ లు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చినట్టు అక్కడ షారుఖ్ ఖాన్ తో పాటు సన్నీ డియోల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 

This post was last modified on October 3, 2023 12:27 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఒక‌టి జ‌గ‌న్‌కు.. ఒక‌టి ష‌ర్మిల‌కు.. అవినాష్‌కు సున్నా

క‌డ‌ప‌లో అవినాష్ రెడ్డి క‌థ ముగిసిందా? ఎంపీ స్థానాన్ని అత‌ను కోల్పోవాల్సిందేనా? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే అంటున్నారు. క‌డ‌ప…

39 mins ago

ఆరంభం టాక్ ఏంటి

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా ప్రేక్షకుల అటెన్షన్ దక్కించుకోవడం కష్టం. ట్రైలర్ కట్ తో అది చేసి చూపించిన…

2 hours ago

రూ.10 లక్షలు ఇస్తే ‘నీట్’గా రాసేస్తా !

దేశమంతా ఈ ఆదివారం నీట్ - యూజీ పరీక్షలు జరిగాయి. దేశమంతా 24 లక్షల మంది పరీక్ష రాశారు. గత…

2 hours ago

దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు !

దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో…

2 hours ago

కామెడీ హీరో అదృష్టం బాగుంది

ఇమేజ్ ఉన్న మీడియం రేంజ్ స్టార్లకే ఓపెనింగ్స్ వస్తాయా రావా అనే టెన్షన్ ఉన్న పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. దానికి…

2 hours ago

కాంగ్రెస్‌లో చేరితే వైఎస్ 100 కోట్లు ఇస్తామ‌న్నారు: ఎర్ర‌బెల్లి

మాజీ మంత్రి, తెలంగాణ నాయ‌కుడు, బీఆర్ఎస్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో తాను…

3 hours ago