జైలర్ సినిమాతో తన బాక్సాఫీస్ సత్తా మళ్లీ అందరికీ చూపించాడు సూపర్ స్టార్ రజినీకాంత్. రోబో తర్వాత నిఖార్సయిన హిట్ లేని ఆయనకు జైలర్ ఆశించిన దాని కంటే పెద్ద విజయాన్నే అందించింది. యావరేజ్ కంటెంట్తోనే సూపర్ స్టార్ సాగించిన బాక్సాఫీస్ విధ్వంసం చూసి అందరూ షాకయ్యారు. ఈ బ్లాక్బస్టర్ తర్వాత ఉత్సాహంగా తన కొత్త చిత్రానికి రెడీ అయిపోయాడు రజినీ.
జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీ తన కొత్త చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిరిస్తోంది. ఈ సినిమా షూట్ మొదలవుతున్న సందర్భంగా కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెల్లడించింది లైకా ప్రొడక్షన్స్. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం.
అందులో ఒకరు మలయాళ సీనియర్ నటి మంజు వారియర్ కాగా.. మరొకరు గురు ఫేమ్ రితికా సింగ్. వీరికి తోడు దుషారా విజయన్ అనే మరో అమ్మాయి కూడా నటిస్తోంది. ఐతే వీరిలో ఒక్క మంజు మాత్రమే రజినీకి జోడీ కావచ్చని భావిస్తున్నారు. రితికా, దుషారాలవి క్యారెక్టర్ రోల్స్ అయి ఉండొచ్చు. చిన్న వయస్కులైన వీళ్లిద్దరూ రజినీకి జోడీగా నటించే అవకాశాలు లేవు. మంజు ఇంతకుముందు అసురన్ మూవీలో ధనుష్కు జోడీగా నటించడం విశేషం.
ఇప్పుడు ఆయన మామ రజినీకి జోడీగా నటిస్తే అది విశేషమే అవుతుంది. జైలర్ సినిమాను మరో రేంజికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందరే ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నాడు. జై భీమ్ తరహాలోనే ఈ చిత్రం కూడా సామాజిక అంశాల నేపథ్యంలో నడుస్తుందట. తమిళనాడులో జరిగిన ఓ బూటకపు ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఇందులో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నాడు. తెలుగు నుంచి రానా కూడా ఒక కీ రోల్ చేస్తాడని వార్తలొస్తున్నాయి.
This post was last modified on October 3, 2023 12:19 am
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…
ఇమేజ్ ఉన్న హీరోలకు ఎదురయ్యే డైలమా ఒకటుంది. అదే వెబ్ సిరీస్ లకు ఎస్ చెప్పాలా వద్దాని. నాగ చైతన్య…