జైలర్ సినిమాతో తన బాక్సాఫీస్ సత్తా మళ్లీ అందరికీ చూపించాడు సూపర్ స్టార్ రజినీకాంత్. రోబో తర్వాత నిఖార్సయిన హిట్ లేని ఆయనకు జైలర్ ఆశించిన దాని కంటే పెద్ద విజయాన్నే అందించింది. యావరేజ్ కంటెంట్తోనే సూపర్ స్టార్ సాగించిన బాక్సాఫీస్ విధ్వంసం చూసి అందరూ షాకయ్యారు. ఈ బ్లాక్బస్టర్ తర్వాత ఉత్సాహంగా తన కొత్త చిత్రానికి రెడీ అయిపోయాడు రజినీ.
జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీ తన కొత్త చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. తమిళంలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిరిస్తోంది. ఈ సినిమా షూట్ మొదలవుతున్న సందర్భంగా కాస్ట్ అండ్ క్రూ వివరాలు వెల్లడించింది లైకా ప్రొడక్షన్స్. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం.
అందులో ఒకరు మలయాళ సీనియర్ నటి మంజు వారియర్ కాగా.. మరొకరు గురు ఫేమ్ రితికా సింగ్. వీరికి తోడు దుషారా విజయన్ అనే మరో అమ్మాయి కూడా నటిస్తోంది. ఐతే వీరిలో ఒక్క మంజు మాత్రమే రజినీకి జోడీ కావచ్చని భావిస్తున్నారు. రితికా, దుషారాలవి క్యారెక్టర్ రోల్స్ అయి ఉండొచ్చు. చిన్న వయస్కులైన వీళ్లిద్దరూ రజినీకి జోడీగా నటించే అవకాశాలు లేవు. మంజు ఇంతకుముందు అసురన్ మూవీలో ధనుష్కు జోడీగా నటించడం విశేషం.
ఇప్పుడు ఆయన మామ రజినీకి జోడీగా నటిస్తే అది విశేషమే అవుతుంది. జైలర్ సినిమాను మరో రేంజికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందరే ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నాడు. జై భీమ్ తరహాలోనే ఈ చిత్రం కూడా సామాజిక అంశాల నేపథ్యంలో నడుస్తుందట. తమిళనాడులో జరిగిన ఓ బూటకపు ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఇందులో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నాడు. తెలుగు నుంచి రానా కూడా ఒక కీ రోల్ చేస్తాడని వార్తలొస్తున్నాయి.
This post was last modified on October 3, 2023 12:19 am
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…