Movie News

ప్రీమియర్ల అయోమయంలో నిర్మాతలు

గత ఏడాది కాలంగా మీడియం సినిమాల ప్రొడ్యూసర్లకు బాగా ఉపయోగడుతున్న ప్రమోషన్ అస్త్రం ప్రీమియర్లు. అసలు విడుదల తేదీకి ఒకటి రెండు రోజుల ముందు షోలు వేయడం వల్ల దాని తాలూకు టాక్ సోషల్ మీడియాలో వేగంగా వెళ్ళిపోయి తద్వారా ఓపెనింగ్స్ కి ఉపయోగపడుతున్నాయి. మేజర్, 777 ఛార్లీ, సామజవరగమన, మేం ఫేమస్, బేబీ లాంటివన్నీ ఈ స్ట్రాటజీ వల్ల లాభం పొందినవే. ఇదే ప్లాన్ రివర్స్ కొట్టినవి లేకపోలేదు. హిడింబ, రంగబలి, పెదకాపు 1 వగైరాలు అనవసరంగా ఈ మోడల్ జోలికి వెళ్లి దెబ్బ తిన్నాయి. మార్నింగ్ షో నుంచే నష్టపోయాయి. ఇక విషయానికి వద్దాం.

ఈ వారం 6న విడుదల కాబోయే చిత్రాల నిర్మాతలు ప్రీమియర్లు వేయాలా వద్దానే అయోమయంలో ఉన్నారు. స్కంద, చంద్రముఖి 2, పెదకాపు 1 మూడు రేపటి నుంచి డెడ్ స్లీప్ కి వెళ్లిపోతాయి. కాబట్టి కొత్త వాటికి బోలెడు స్కోప్ ఉంటుంది. మ్యాడ్ నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న నాగవంశీ నాలుగో తేదీ నుంచే ప్రధాన కేంద్రాల్లో షోలు వేయడం గురించి తన టీమ్ తో చర్చిస్తున్నారు. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుధీర్ బాబు మామా మశ్చీంద్రకు హైదరాబాద్ లో మాత్రమే అయిదో తేదీ సాయంత్రం షోలు వేయాలని చూస్తున్నారు.

ఇంకా ఏవీ ఫైనల్ కాలేదు. మీడియాకు మాత్రమే వేయాలా లేక సాధారణ ప్రేక్షకులకు కూడా ఓపెన్ చేయాలానే మీమాంస తీరడం లేదట. ఆరేడు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఓపెనింగ్స్ గురించి టెన్షన్ ఉంది. టాక్ చాలా కీలక పాత్ర పోషించనుంది. ఏ మాత్రం పాజిటివ్ వచ్చినా చాలు దసరాకు బాలకృష్ణ, రవితేజ, విజయ్ వచ్చేలోగా బాగా వర్కౌట్ చేసుకుని బయట పడొచ్చు. కాకపోతే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వల్ల ప్రతిదీ సవాలుగానే కనిపిస్తుంది. ఏదైనా సరే రేపు లేదా ఉదయం లోపే తేల్చేయాలి. లేదంటే డైరెక్ట్ గా రిలీజ్ రోజు కలుసుకోవడమే.

This post was last modified on October 2, 2023 11:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago