తీసింది నాలుగు సినిమాలు. అందులో ఒకటి బ్లాక్బస్టర్. ఒకటి సూపర్ హిట్. ఒకటి యావరేజ్. ఇంకోటి మాత్రం డిజాస్టర్. మొత్తంగా చూసుకుంటే ఇది మంచి ట్రాక్ రికార్డే. అయినా సరే.. ఇప్పుడు తర్వాత ఏ సినిమా చేయాలో తెలియక క్రాస్ రోడ్స్లో నిలబడ్డాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్బస్టర్తో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రెండో చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కూడా బాగా ఆడింది.
‘నేల టిక్కెట్టు’ తేడా కొట్టినా.. ‘బంగార్రాజు’తో పర్వాలేదనిపించాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చిందని ఎంతో ఆనందించాడు కళ్యాణ్. ‘బ్రో డాడీ’ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీసే బాధ్యతను చిరు అతడి చేతిలో పెట్టాడు. ముందు అనుకున్న ప్రకారం అయితే.. ఈ పాటికి ఈ సినిమా షూట్ మొదలైపోయి ఉండాలి. సంక్రాంతి లక్ష్యంగా టీం ముందడుగు వేస్తుండాలి. కానీ ‘భోళా శంకర్’ రిజల్ట్ తర్వాత మొత్తం కథ మారిపోయింది. ఈ సినిమాను చిరు హోల్డ్లో పెట్టేశాడు.
ముందేమో స్క్రిప్టు మీద మళ్లీ పని చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత చూస్తే రీమేక్ సినిమాల పట్ల జనాల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుని చిరు పూర్తిగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. 157వ సినిమాగా చేయాల్సిన వశిష్ఠ మూవీనే ముందుకు తీసుకొచ్చి 156వ సినిమాగా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కళ్యాణ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను పూర్తిగా అటకెక్కించేసినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ స్థితిలో ఒక సినిమా క్యాన్సిల్ అయితే అది దర్శకుడికి చాలా చెడ్డ పేరు తెస్తోంది. ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా ఖాళీగా లేడు. కళ్యాణ్కు క్రియేటివ్, ట్రెండీ డైరెక్టర్గా పేరు లేదు. చిరుతో సినిమా చేస్తే.. రిజల్ట్తో సంబంధం లేకుండా కెరీర్ బాగుండేది. కానీ ఇప్పుడు చిరు సినిమానే క్యాన్సిల్ కావడంతో కళ్యాణ్ పరిస్థితి అయోమయంగా తయారైంది. ఈ స్థితి నుంచి అతను ఓ మోస్తరు స్టార్తో కూడా సినిమా ఓకే చేయించుకోవడం కష్టంగా మారేలా ఉంది. సొంత బేనర్లో కళ్యాణ్తో మూడు సినిమాలకు అవకాశమిచ్చి మంచి ఫలితాలే అందుకున్న నాగ్ సైతం అతడికి ఛాన్సివ్వడం కష్టంగానే కనిపిస్తోంది.
సినిమాల సక్సెస్ రేట్ పడిపోతోందని.. ఒకప్పట్లా జనం థియేటర్లకు రావట్లేదని ఈ మధ్య మన ఇండస్ట్రీలో తరచుగా ఆవేదన స్వరం…
గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…