కరోనా లాక్డౌన్ వల్ల అతిగా నష్టపోయిన సినిమా ఏదైనా వుందంటే అది రాజమౌళి తీస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’. అన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతోన్న ఈ చిత్రానికి ఫైనాన్స్ పై వడ్డీ భారంతో పాటు అంత మంది ఆర్టిస్టుల డేట్స్ మళ్లీ సాధించడం అన్నిటికంటే పెద్ద కసరత్తు. షూటింగ్ మళ్లీ ఎప్పటికి మొదలవుతుందనేది తెలియదు కానీ, ఎప్పుడు స్టార్ట్ అయినా ముందుగా కాంబినేషన్ అవసరం లేని ఎన్టీఆర్ సీన్లను చిత్రీకరిస్తారట. అటు తారక్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తూ వుండడంతో ముందుగా తారక్ పని పూర్తి చేసి పంపించక తప్పదు. అంటే షూటింగ్స్ మళ్లీ మొదలయినా కానీ చరణ్ ఖాళీగానే వుండాలన్నమాట.
అందుకే ఈలోగా ‘ఆచార్య’ చిత్రం కోసం చరణ్ చేయనున్న ఎపిసోడ్ ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఎలాగో ‘ఆర్.ఆర్.ఆర్.’ చరణ్ మార్చుకున్న గెటప్ ఇప్పుడు లేదు కనుక కంటిన్యుటీ సమస్యలు కానీ, ఈ గెటప్ ఇంకో చోట రిపీట్ అయిందనే ఇబ్బందులు కానీ రావు. అందుకే ఆచార్య కోసం ముప్పయ్ రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో జాయిన్ అవ్వాలని చరణ్ నిర్ణయించుకున్నట్టు, అందుకు రాజమౌళి కూడా అనుకూలంగానే స్పందించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇలా తారుమారు తక్కెడ మారు గొడవ వుండేది కాదు కానీ ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోక తప్పదు.
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…