కరోనా లాక్డౌన్ వల్ల అతిగా నష్టపోయిన సినిమా ఏదైనా వుందంటే అది రాజమౌళి తీస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’. అన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతోన్న ఈ చిత్రానికి ఫైనాన్స్ పై వడ్డీ భారంతో పాటు అంత మంది ఆర్టిస్టుల డేట్స్ మళ్లీ సాధించడం అన్నిటికంటే పెద్ద కసరత్తు. షూటింగ్ మళ్లీ ఎప్పటికి మొదలవుతుందనేది తెలియదు కానీ, ఎప్పుడు స్టార్ట్ అయినా ముందుగా కాంబినేషన్ అవసరం లేని ఎన్టీఆర్ సీన్లను చిత్రీకరిస్తారట. అటు తారక్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తూ వుండడంతో ముందుగా తారక్ పని పూర్తి చేసి పంపించక తప్పదు. అంటే షూటింగ్స్ మళ్లీ మొదలయినా కానీ చరణ్ ఖాళీగానే వుండాలన్నమాట.
అందుకే ఈలోగా ‘ఆచార్య’ చిత్రం కోసం చరణ్ చేయనున్న ఎపిసోడ్ ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఎలాగో ‘ఆర్.ఆర్.ఆర్.’ చరణ్ మార్చుకున్న గెటప్ ఇప్పుడు లేదు కనుక కంటిన్యుటీ సమస్యలు కానీ, ఈ గెటప్ ఇంకో చోట రిపీట్ అయిందనే ఇబ్బందులు కానీ రావు. అందుకే ఆచార్య కోసం ముప్పయ్ రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో జాయిన్ అవ్వాలని చరణ్ నిర్ణయించుకున్నట్టు, అందుకు రాజమౌళి కూడా అనుకూలంగానే స్పందించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇలా తారుమారు తక్కెడ మారు గొడవ వుండేది కాదు కానీ ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోక తప్పదు.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…