కరోనా లాక్డౌన్ వల్ల అతిగా నష్టపోయిన సినిమా ఏదైనా వుందంటే అది రాజమౌళి తీస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’. అన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతోన్న ఈ చిత్రానికి ఫైనాన్స్ పై వడ్డీ భారంతో పాటు అంత మంది ఆర్టిస్టుల డేట్స్ మళ్లీ సాధించడం అన్నిటికంటే పెద్ద కసరత్తు. షూటింగ్ మళ్లీ ఎప్పటికి మొదలవుతుందనేది తెలియదు కానీ, ఎప్పుడు స్టార్ట్ అయినా ముందుగా కాంబినేషన్ అవసరం లేని ఎన్టీఆర్ సీన్లను చిత్రీకరిస్తారట. అటు తారక్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తూ వుండడంతో ముందుగా తారక్ పని పూర్తి చేసి పంపించక తప్పదు. అంటే షూటింగ్స్ మళ్లీ మొదలయినా కానీ చరణ్ ఖాళీగానే వుండాలన్నమాట.
అందుకే ఈలోగా ‘ఆచార్య’ చిత్రం కోసం చరణ్ చేయనున్న ఎపిసోడ్ ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఎలాగో ‘ఆర్.ఆర్.ఆర్.’ చరణ్ మార్చుకున్న గెటప్ ఇప్పుడు లేదు కనుక కంటిన్యుటీ సమస్యలు కానీ, ఈ గెటప్ ఇంకో చోట రిపీట్ అయిందనే ఇబ్బందులు కానీ రావు. అందుకే ఆచార్య కోసం ముప్పయ్ రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో జాయిన్ అవ్వాలని చరణ్ నిర్ణయించుకున్నట్టు, అందుకు రాజమౌళి కూడా అనుకూలంగానే స్పందించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇలా తారుమారు తక్కెడ మారు గొడవ వుండేది కాదు కానీ ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోక తప్పదు.
This post was last modified on August 25, 2020 2:04 pm
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్…వరుసబెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ అధికారంలోకి…