కరోనా లాక్డౌన్ వల్ల అతిగా నష్టపోయిన సినిమా ఏదైనా వుందంటే అది రాజమౌళి తీస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’. అన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతోన్న ఈ చిత్రానికి ఫైనాన్స్ పై వడ్డీ భారంతో పాటు అంత మంది ఆర్టిస్టుల డేట్స్ మళ్లీ సాధించడం అన్నిటికంటే పెద్ద కసరత్తు. షూటింగ్ మళ్లీ ఎప్పటికి మొదలవుతుందనేది తెలియదు కానీ, ఎప్పుడు స్టార్ట్ అయినా ముందుగా కాంబినేషన్ అవసరం లేని ఎన్టీఆర్ సీన్లను చిత్రీకరిస్తారట. అటు తారక్ కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తూ వుండడంతో ముందుగా తారక్ పని పూర్తి చేసి పంపించక తప్పదు. అంటే షూటింగ్స్ మళ్లీ మొదలయినా కానీ చరణ్ ఖాళీగానే వుండాలన్నమాట.
అందుకే ఈలోగా ‘ఆచార్య’ చిత్రం కోసం చరణ్ చేయనున్న ఎపిసోడ్ ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఎలాగో ‘ఆర్.ఆర్.ఆర్.’ చరణ్ మార్చుకున్న గెటప్ ఇప్పుడు లేదు కనుక కంటిన్యుటీ సమస్యలు కానీ, ఈ గెటప్ ఇంకో చోట రిపీట్ అయిందనే ఇబ్బందులు కానీ రావు. అందుకే ఆచార్య కోసం ముప్పయ్ రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్లో జాయిన్ అవ్వాలని చరణ్ నిర్ణయించుకున్నట్టు, అందుకు రాజమౌళి కూడా అనుకూలంగానే స్పందించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇలా తారుమారు తక్కెడ మారు గొడవ వుండేది కాదు కానీ ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకోక తప్పదు.
This post was last modified on August 25, 2020 2:04 pm
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…