సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. చిన్న టీజర్, రెండు మూడు పోస్టర్లు తప్ప దీనికి సంబంధించిన క్రేజీ ఇన్ఫో ఏదీ బయటికి రాలేదు. మొదటి లిరికల్ వీడియోను దసరా లోపే ప్రకటిస్తామని ఇటీవలే నిర్మాత నాగ వంశీ మ్యాడ్ ఫంక్షన్లో చెప్పిన నేపథ్యంలో అభిమానులు దాని కోసం ఎదురు చూస్తున్నారు. రికార్డింగ్ అయ్యింది కానీ మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇది కాకుండా లీకుల రూపంలో వస్తున్న కొన్ని సంగతులు ఆసక్తి రేపెలా ఉన్నాయి.
ముఖ్యంగా పాత్రలు వాటి మధ్య సంబంధాలు విశేషాలు చూద్దాం. గుంటూరు కారంలో మహేష్ బాబు తల్లి తండ్రులుగా జయరాం, రమ్యకృష్ణ కనిపిస్తారు. నాన్నమ్మ, తాతయ్యలుగా ప్రకాష్ రాజ్, జయసుధలు నటించారు. ఈ కుటుంబానికి శక్తివంతమైన రాజకీయ పార్టీ ఉంటుంది. స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఇదే కీలకం. వీళ్ళ పార్టీలోని కీలక సభ్యుడే మురళీశర్మ. ఆయన కూతురు శ్రీలీల. రెండు ఫ్యామిలీల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. ఇక సెకండ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి రావు రమేష్ గారమ్మాయి. సునీల్ మహేష్ స్నేహితుడిగా, వెన్నెల కిషోర్ మురళి శర్మ పిఎగా చేశాడు.
సెటప్ మొత్తం నీట్ గా సెట్ చేసుకున్న త్రివిక్రమ్ దీనికి పొలిటికల్ ఫ్లేవర్ అద్దడం వల్ల చాలా కొత్తగా ఉంటుందని పని చేసిన వాళ్ళు అంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబుతో రాజకీయ విసుర్లతో పాటు పోకిరి రేంజ్ లో ఊర మాస్ డైలాగులు వింటారని తెగ ఊరిస్తున్నారు. ఇవన్నీ అధికారికంగా వచ్చిన వివరాలు కాదు కానీ మంచి హైప్ ఇచ్చేలా ఉన్నాయి. జనవరి 12 ఎట్టి పరిస్థితుల్లో విడుదల కావాలని నిర్ణయించుకున్న గుంటూరు కారం ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లను తద్వారా థియేటర్లను లాక్ చేసుకునే పనిలో ఉందని సమాచారం. సంక్రాంతికి మళ్ళీ జెండా ఎగరడం ఖాయమని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
This post was last modified on October 1, 2023 10:15 pm
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…