కొన్ని రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. వాటి దర్శకుల పేర్లు చెప్పినపుడు ఒక పేరు విని అందరూ షాకైపోయారు. ఆ పేరు.. మెహర్ రమేష్. కంత్రి, శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు తీసిన దర్శకుతను. షాడో తర్వాత ఏడెనిమిదేళ్లుగా అతను ఖాళీగా ఉన్నాడు. మరో సినిమా తీయలేదు. ఇక మళ్లీ అతణ్ని నమ్మి ఏ స్టార్ హీరో కూడా అవకాశం ఇవ్వడని అంతా అనుకుంటుంటే.. చిరంజీవి తనతో సినిమా చేయడానికి అంగీకరించడం పెద్ద షాకే. వీళ్లిద్దరి కలయికలో తమిళ హిట్ వేదాళంకు రీమేక్ రాబోతోందని అంటున్నారు. ఐతే ఈ ప్రాజెక్టు అధికారికంగా ఇంకా ఖరారవ్వలేదు.
ఐతే ఓ ఇంటర్వ్యూలో మెహర్ రమేష్ ఈ సినిమా గురించి మాట్లాడాడు. చిరంజీవి మీద చిన్నప్పటి నుంచి తనకున్న అభిమానం ఎలాంటిదో వివరించిన రమేష్.. దర్శకుడిగా తన తొలి చిత్రం వీర కన్నడిగ (కన్నడ ఆంధ్రావాలా) ప్రారంభోత్సవం జరుపుకున్నది చిరు పుట్టిన రోజైన ఆగస్టు 22నే అని వెల్లడించాడు. ఇక దర్శకుడిగా తాను సినిమా తీసి చాలా ఏళ్లయినప్పటికీ.. తానేమీ ఖాళీగా లేనని.. ఎన్నో సినిమాలకు స్క్రిప్టు డిస్కషన్లలో పాల్గొన్నానని అతను వివరించాడు. చిరంజీవితో సినిమా అన్నది అందరు దర్శకుల్లాగే తనకూ ఓ కల అని.. అది నెరవేరుతుందని ఊహించలేదని మెహర్ తెలిపాడు. చిరంజీవితో సినిమా కోసం మూడేళ్ల కిందటే పని మొదలుపెట్టానని.. అది ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చి ఆయన సినిమా చేయడానికి అంగీకరించాడని మెహర్ తెలిపాడు. అంతకుమించి ఈ సినిమా విశేషాలేమీ మెహర్ పంచుకోలేదు.
This post was last modified on August 24, 2020 10:09 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…