కొన్ని రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. వాటి దర్శకుల పేర్లు చెప్పినపుడు ఒక పేరు విని అందరూ షాకైపోయారు. ఆ పేరు.. మెహర్ రమేష్. కంత్రి, శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు తీసిన దర్శకుతను. షాడో తర్వాత ఏడెనిమిదేళ్లుగా అతను ఖాళీగా ఉన్నాడు. మరో సినిమా తీయలేదు. ఇక మళ్లీ అతణ్ని నమ్మి ఏ స్టార్ హీరో కూడా అవకాశం ఇవ్వడని అంతా అనుకుంటుంటే.. చిరంజీవి తనతో సినిమా చేయడానికి అంగీకరించడం పెద్ద షాకే. వీళ్లిద్దరి కలయికలో తమిళ హిట్ వేదాళంకు రీమేక్ రాబోతోందని అంటున్నారు. ఐతే ఈ ప్రాజెక్టు అధికారికంగా ఇంకా ఖరారవ్వలేదు.
ఐతే ఓ ఇంటర్వ్యూలో మెహర్ రమేష్ ఈ సినిమా గురించి మాట్లాడాడు. చిరంజీవి మీద చిన్నప్పటి నుంచి తనకున్న అభిమానం ఎలాంటిదో వివరించిన రమేష్.. దర్శకుడిగా తన తొలి చిత్రం వీర కన్నడిగ (కన్నడ ఆంధ్రావాలా) ప్రారంభోత్సవం జరుపుకున్నది చిరు పుట్టిన రోజైన ఆగస్టు 22నే అని వెల్లడించాడు. ఇక దర్శకుడిగా తాను సినిమా తీసి చాలా ఏళ్లయినప్పటికీ.. తానేమీ ఖాళీగా లేనని.. ఎన్నో సినిమాలకు స్క్రిప్టు డిస్కషన్లలో పాల్గొన్నానని అతను వివరించాడు. చిరంజీవితో సినిమా అన్నది అందరు దర్శకుల్లాగే తనకూ ఓ కల అని.. అది నెరవేరుతుందని ఊహించలేదని మెహర్ తెలిపాడు. చిరంజీవితో సినిమా కోసం మూడేళ్ల కిందటే పని మొదలుపెట్టానని.. అది ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చి ఆయన సినిమా చేయడానికి అంగీకరించాడని మెహర్ తెలిపాడు. అంతకుమించి ఈ సినిమా విశేషాలేమీ మెహర్ పంచుకోలేదు.
This post was last modified on August 24, 2020 10:09 pm
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…