కొన్ని రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. వాటి దర్శకుల పేర్లు చెప్పినపుడు ఒక పేరు విని అందరూ షాకైపోయారు. ఆ పేరు.. మెహర్ రమేష్. కంత్రి, శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు తీసిన దర్శకుతను. షాడో తర్వాత ఏడెనిమిదేళ్లుగా అతను ఖాళీగా ఉన్నాడు. మరో సినిమా తీయలేదు. ఇక మళ్లీ అతణ్ని నమ్మి ఏ స్టార్ హీరో కూడా అవకాశం ఇవ్వడని అంతా అనుకుంటుంటే.. చిరంజీవి తనతో సినిమా చేయడానికి అంగీకరించడం పెద్ద షాకే. వీళ్లిద్దరి కలయికలో తమిళ హిట్ వేదాళంకు రీమేక్ రాబోతోందని అంటున్నారు. ఐతే ఈ ప్రాజెక్టు అధికారికంగా ఇంకా ఖరారవ్వలేదు.
ఐతే ఓ ఇంటర్వ్యూలో మెహర్ రమేష్ ఈ సినిమా గురించి మాట్లాడాడు. చిరంజీవి మీద చిన్నప్పటి నుంచి తనకున్న అభిమానం ఎలాంటిదో వివరించిన రమేష్.. దర్శకుడిగా తన తొలి చిత్రం వీర కన్నడిగ (కన్నడ ఆంధ్రావాలా) ప్రారంభోత్సవం జరుపుకున్నది చిరు పుట్టిన రోజైన ఆగస్టు 22నే అని వెల్లడించాడు. ఇక దర్శకుడిగా తాను సినిమా తీసి చాలా ఏళ్లయినప్పటికీ.. తానేమీ ఖాళీగా లేనని.. ఎన్నో సినిమాలకు స్క్రిప్టు డిస్కషన్లలో పాల్గొన్నానని అతను వివరించాడు. చిరంజీవితో సినిమా అన్నది అందరు దర్శకుల్లాగే తనకూ ఓ కల అని.. అది నెరవేరుతుందని ఊహించలేదని మెహర్ తెలిపాడు. చిరంజీవితో సినిమా కోసం మూడేళ్ల కిందటే పని మొదలుపెట్టానని.. అది ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చి ఆయన సినిమా చేయడానికి అంగీకరించాడని మెహర్ తెలిపాడు. అంతకుమించి ఈ సినిమా విశేషాలేమీ మెహర్ పంచుకోలేదు.
This post was last modified on August 24, 2020 10:09 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…