కడుపు కోతను మించిన బాధ ఇంకేదీ ఉండదని అంటారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు ఎదిగొస్తున్న వయసులో దూరమైతే పడే వేదన అంతా ఇంతా కాదు. తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ఇటీవలే ఆ క్షోభను ఎదుర్కొన్నాడు. అతడి కూతురు మీరా మానసిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. కూతురిని పోగొట్టుకున్న బాధలో కుంగిపోయి ఉన్నాడు విజయ్.
తన కూతురితో పాటే తాను కూడా చనిపోయాను అంటూ అతను ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మాటతో విజయ్ ఎంతటి క్షోభను అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు. ఇత బాధలో కూడా విజయ్ ఆంటోని తన వృత్తి ధర్మాన్ని మాత్రం వీడలేదు. పుట్టెడు దుఃఖంలోనూ తన కొత్త చిత్రం రత్తం ప్రమోషన్స్ కోసం అతను బయటకు వచ్చాడు.
కూతురు చనిపోయిన తొమ్మిది రోజులకు మీడియా ముందుకు వచ్చి రత్తం ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి అతను తన చిన్న కూతురితో కలిసి రావడం గమనార్హం. మామూలుగానే విజయ్ ఆంటోనీ కొంచెం మూడీగా ఉంటాడు. ఈ ఈవెంట్లోనూ అతను అలాగే కనిపించాడు. రత్తం సెప్టెంబరు 28నే రిలీజ్ కావాల్సింది. కానీ మీరా మృతి నేపథ్యంలో ఒక వారం సినిమాను వాయిదా వేశారు.
ఈ రోజుల్లో ప్రమోషన్లు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో విజయ్ ఆంటోనీ ఇంత బాధలోనూ ప్రమోషన్కు వచ్చాడు. తమిళ్ పడం అనే సెన్సేషనల్ మూవీ తీసిన సి.ఎస్.అముదన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మహిమా నంబియార్ కథానాయికగా నటించింది. విజయ్ ఆంటోనీకి బిచ్చగాడు-2 మినహా కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేదు. రత్తంతో అతను బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…