దసరా పోటీ అంటే మనమేదో బాలయ్య, రవితేజ, విజయ్ ల మధ్యే అనుకుంటున్నాం కానీ తాజాగా నేనున్నా అంటూ గుర్తు చేస్తున్నాడు బాలీవుడ్ హీరో టైగర్ శ్రోఫ్. అతను హీరోగా రూపొందిన గణపథ్ భారీ ఎత్తున తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ టీజర్ వచ్చింది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ స్కై ఫై థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించారు. నిమిషంన్నర టీజర్ లో కాన్సెప్ట్ ఏంటో చెప్పారు. యాభై సంవత్సరాల తర్వాత 2070 ADలో జరిగే కథగా దర్శకుడు వికాస్ బహ్ల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
విజువల్స్ గట్రా బాగానే ఉన్నాయి. ఏదో సరికొత్త ప్రపంచంలో తీసుకెళ్లబోతున్న ఫీలింగ్ కలిగించారు. ఎప్పటిలాగే టైగర్ బాబు బ్రాండ్ ఫైట్లు, పోరాట దృశ్యాలు పెట్టారు. అయితే భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ఒక సూపర్ హీరో ఎదురుకోవడమనే కాన్సెప్ట్ తోనే ప్రభాస్ కల్కి 2898 రూపొందుతోంది. దానికి కొంచెం దగ్గరగా గణపథ్ ఉందనిపిస్తోంది. బడ్జెట్, క్యాస్టింగ్, క్వాలిటీ, విఎఫెక్స్ లాంటి విషయాల్లో కల్కితో దగ్గరగా వెళ్లడం కూడా జరిగే పని కాదు కానీ మొత్తానికి చర్చకైతే దారి తీసింది. దీనికి నూటా యాభై కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిందని ముంబై వర్గాలు ఉటంకిస్తున్నాయి.
ఇప్పుడీ గణపథ్ వల్ల సౌత్ లో మనకొచ్చిన ఇబ్బందులు పెద్దగా ఉండవు కానీ టైగర్ నాగేశ్వరరావు, లియోలకు బయట మార్కెట్లలో థియేటర్ల పరంగా సమస్య రావొచ్చు. భగవంత్ కేసరి తెలుగు వెర్షన్ కే పరిమితం చేయబోతున్న నేపథ్యంలో టెన్షన్ లేదు. మాస్ లో మంచి గ్రిప్ ఉన్న టైగర్ శ్రోఫ్ ఈ గణపథ్ తో టాప్ లీగ్ లోకి చేరతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పెద్దగా గుర్తింపు లేకపోయినా అదే పనిగా తెలుగు డబ్బింగ్ కూడా చేస్తున్నారంటే ఇదంతా జవాన్, పఠాన్ లాంటి సినిమాలు ఇచ్చిన ధైర్యమే అనుకోవాలి. చూడాలి కంటెంట్ ఏ మేరకు మెప్పిస్తుందో.
This post was last modified on September 29, 2023 9:13 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…