దసరా పోటీ అంటే మనమేదో బాలయ్య, రవితేజ, విజయ్ ల మధ్యే అనుకుంటున్నాం కానీ తాజాగా నేనున్నా అంటూ గుర్తు చేస్తున్నాడు బాలీవుడ్ హీరో టైగర్ శ్రోఫ్. అతను హీరోగా రూపొందిన గణపథ్ భారీ ఎత్తున తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇవాళ టీజర్ వచ్చింది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ స్కై ఫై థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషించారు. నిమిషంన్నర టీజర్ లో కాన్సెప్ట్ ఏంటో చెప్పారు. యాభై సంవత్సరాల తర్వాత 2070 ADలో జరిగే కథగా దర్శకుడు వికాస్ బహ్ల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
విజువల్స్ గట్రా బాగానే ఉన్నాయి. ఏదో సరికొత్త ప్రపంచంలో తీసుకెళ్లబోతున్న ఫీలింగ్ కలిగించారు. ఎప్పటిలాగే టైగర్ బాబు బ్రాండ్ ఫైట్లు, పోరాట దృశ్యాలు పెట్టారు. అయితే భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ఒక సూపర్ హీరో ఎదురుకోవడమనే కాన్సెప్ట్ తోనే ప్రభాస్ కల్కి 2898 రూపొందుతోంది. దానికి కొంచెం దగ్గరగా గణపథ్ ఉందనిపిస్తోంది. బడ్జెట్, క్యాస్టింగ్, క్వాలిటీ, విఎఫెక్స్ లాంటి విషయాల్లో కల్కితో దగ్గరగా వెళ్లడం కూడా జరిగే పని కాదు కానీ మొత్తానికి చర్చకైతే దారి తీసింది. దీనికి నూటా యాభై కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిందని ముంబై వర్గాలు ఉటంకిస్తున్నాయి.
ఇప్పుడీ గణపథ్ వల్ల సౌత్ లో మనకొచ్చిన ఇబ్బందులు పెద్దగా ఉండవు కానీ టైగర్ నాగేశ్వరరావు, లియోలకు బయట మార్కెట్లలో థియేటర్ల పరంగా సమస్య రావొచ్చు. భగవంత్ కేసరి తెలుగు వెర్షన్ కే పరిమితం చేయబోతున్న నేపథ్యంలో టెన్షన్ లేదు. మాస్ లో మంచి గ్రిప్ ఉన్న టైగర్ శ్రోఫ్ ఈ గణపథ్ తో టాప్ లీగ్ లోకి చేరతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పెద్దగా గుర్తింపు లేకపోయినా అదే పనిగా తెలుగు డబ్బింగ్ కూడా చేస్తున్నారంటే ఇదంతా జవాన్, పఠాన్ లాంటి సినిమాలు ఇచ్చిన ధైర్యమే అనుకోవాలి. చూడాలి కంటెంట్ ఏ మేరకు మెప్పిస్తుందో.
This post was last modified on September 29, 2023 9:13 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…