Movie News

సెన్సార్ కోసం 6.5 లక్షల లంచం

భారతీయుడు, ఠాగూర్ సినిమాల్లో లంచం తీసుకోవడం ఎంత పెద్ద తప్పో వివరించి దాని కట్టడి చేయడం కోసం హత్యలు చేసినా పర్వాలేదనే రేంజ్ లో సందేశం ఇస్తారు కమల్ హాసన్, చిరంజీవిలు. అయితే ఇలాంటివి కేవలం తెరకే పరిమితం. నిజ జీవితంలో హీరోలకు అలాంటి పరిస్థితి వచ్చినా తప్పించుకోలేరని తాజా ఉదంతం చాటుతోంది. హీరో విశాల్ తన లేటెస్ట్ తమిళ హిట్ మార్క్ ఆంటోనీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం అక్షరాలా 6 లక్షల 50 వేల రూపాయలు ముంబై అధికారులకు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పిన వీడియో వైరలవుతోంది.

ఇదంతా ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. కెరీర్ లో మొదటిసారి సెన్సార్ క్లియరెన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, తప్పనిసరి పరిస్థితుల్లో పని జరిగాక బయట పెడుతున్నానని వివరాలు అందజేశారు. స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికెట్ కోసం 3 లక్షల 50 వేలు సమర్పించుకున్నాడు. అప్పటికే హిందీ డబ్బింగ్ కోసం ఒత్తిడి ఉండటంతో ఇవ్వాల్సి వచ్చింది. ఎం రాజన్, జీజ రాందాస్ పేరు మీద అకౌంట్ వివరాలు కూడా విశాల్ మీడియాకు విడుదల చేశాడు. ప్రధాన మంత్రి ఇలాంటివి సీరియస్ గా తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరూ తనలా ఇబ్బంది పడకూడదని అన్నాడు.

నిజంగా ఇది షాక్ కలిగించే విషయమే. పెద్ద హీరోలు కాబట్టి వాళ్లకు తగినంత గౌరవ మర్యాదలతో పాటు ఎలాంటి లంచాల బెడద ఉండదనుకుంటే ఇండస్ట్రీలోనే పీడించుకునే వాళ్ళు ఉండటం విచారకరం. అది కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులలో. విశాల్ ఇలా నిక్కచ్చిగా వివాదాలు బయటికి తేవడం ఇది మొదటిసారి కాదు. చాలా ఏళ్ళ క్రితం చెన్నైలో రోడ్డు మీద పైరసీ అమ్ముతున్న వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సంచలనం రేపాడు. ఇప్పుడీ ఇష్యూ. అయినా ఈ సంఘటనలు వినేసి ఊరుకుంటాం కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావన్న గ్యారెంటీ ఎవరూ ఇవ్వరు ఇవ్వలేరు. 

This post was last modified on September 28, 2023 8:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు మార్కు చొరవ ఎవ్వరికీ సాధ్యం కాదంతే!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…

7 hours ago

డాల్బీ థియేటర్లు వస్తున్నాయ్….హైదరాబాద్ కూడా

మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…

8 hours ago

మిరాయ్ మెరుపుల్లో దగ్గుబాటి రానా

హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

9 hours ago

పాస్టర్ ప్రవీణ్.. ఇంకో కీలక వీడియో బయటికి

క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…

9 hours ago

కన్నప్ప ప్రీమియర్ వెనుక కహానీ ఏంటంటే

నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…

10 hours ago

ఏపీపై అమిత్ షా ఫోకస్ పెరిగినట్టే

వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…

11 hours ago