భారతీయుడు, ఠాగూర్ సినిమాల్లో లంచం తీసుకోవడం ఎంత పెద్ద తప్పో వివరించి దాని కట్టడి చేయడం కోసం హత్యలు చేసినా పర్వాలేదనే రేంజ్ లో సందేశం ఇస్తారు కమల్ హాసన్, చిరంజీవిలు. అయితే ఇలాంటివి కేవలం తెరకే పరిమితం. నిజ జీవితంలో హీరోలకు అలాంటి పరిస్థితి వచ్చినా తప్పించుకోలేరని తాజా ఉదంతం చాటుతోంది. హీరో విశాల్ తన లేటెస్ట్ తమిళ హిట్ మార్క్ ఆంటోనీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం అక్షరాలా 6 లక్షల 50 వేల రూపాయలు ముంబై అధికారులకు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పిన వీడియో వైరలవుతోంది.
ఇదంతా ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. కెరీర్ లో మొదటిసారి సెన్సార్ క్లియరెన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, తప్పనిసరి పరిస్థితుల్లో పని జరిగాక బయట పెడుతున్నానని వివరాలు అందజేశారు. స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికెట్ కోసం 3 లక్షల 50 వేలు సమర్పించుకున్నాడు. అప్పటికే హిందీ డబ్బింగ్ కోసం ఒత్తిడి ఉండటంతో ఇవ్వాల్సి వచ్చింది. ఎం రాజన్, జీజ రాందాస్ పేరు మీద అకౌంట్ వివరాలు కూడా విశాల్ మీడియాకు విడుదల చేశాడు. ప్రధాన మంత్రి ఇలాంటివి సీరియస్ గా తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరూ తనలా ఇబ్బంది పడకూడదని అన్నాడు.
నిజంగా ఇది షాక్ కలిగించే విషయమే. పెద్ద హీరోలు కాబట్టి వాళ్లకు తగినంత గౌరవ మర్యాదలతో పాటు ఎలాంటి లంచాల బెడద ఉండదనుకుంటే ఇండస్ట్రీలోనే పీడించుకునే వాళ్ళు ఉండటం విచారకరం. అది కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులలో. విశాల్ ఇలా నిక్కచ్చిగా వివాదాలు బయటికి తేవడం ఇది మొదటిసారి కాదు. చాలా ఏళ్ళ క్రితం చెన్నైలో రోడ్డు మీద పైరసీ అమ్ముతున్న వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సంచలనం రేపాడు. ఇప్పుడీ ఇష్యూ. అయినా ఈ సంఘటనలు వినేసి ఊరుకుంటాం కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావన్న గ్యారెంటీ ఎవరూ ఇవ్వరు ఇవ్వలేరు.
This post was last modified on September 28, 2023 8:14 pm
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…