Movie News

సెన్సార్ కోసం 6.5 లక్షల లంచం

భారతీయుడు, ఠాగూర్ సినిమాల్లో లంచం తీసుకోవడం ఎంత పెద్ద తప్పో వివరించి దాని కట్టడి చేయడం కోసం హత్యలు చేసినా పర్వాలేదనే రేంజ్ లో సందేశం ఇస్తారు కమల్ హాసన్, చిరంజీవిలు. అయితే ఇలాంటివి కేవలం తెరకే పరిమితం. నిజ జీవితంలో హీరోలకు అలాంటి పరిస్థితి వచ్చినా తప్పించుకోలేరని తాజా ఉదంతం చాటుతోంది. హీరో విశాల్ తన లేటెస్ట్ తమిళ హిట్ మార్క్ ఆంటోనీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం అక్షరాలా 6 లక్షల 50 వేల రూపాయలు ముంబై అధికారులకు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పిన వీడియో వైరలవుతోంది.

ఇదంతా ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. కెరీర్ లో మొదటిసారి సెన్సార్ క్లియరెన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, తప్పనిసరి పరిస్థితుల్లో పని జరిగాక బయట పెడుతున్నానని వివరాలు అందజేశారు. స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికెట్ కోసం 3 లక్షల 50 వేలు సమర్పించుకున్నాడు. అప్పటికే హిందీ డబ్బింగ్ కోసం ఒత్తిడి ఉండటంతో ఇవ్వాల్సి వచ్చింది. ఎం రాజన్, జీజ రాందాస్ పేరు మీద అకౌంట్ వివరాలు కూడా విశాల్ మీడియాకు విడుదల చేశాడు. ప్రధాన మంత్రి ఇలాంటివి సీరియస్ గా తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరూ తనలా ఇబ్బంది పడకూడదని అన్నాడు.

నిజంగా ఇది షాక్ కలిగించే విషయమే. పెద్ద హీరోలు కాబట్టి వాళ్లకు తగినంత గౌరవ మర్యాదలతో పాటు ఎలాంటి లంచాల బెడద ఉండదనుకుంటే ఇండస్ట్రీలోనే పీడించుకునే వాళ్ళు ఉండటం విచారకరం. అది కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులలో. విశాల్ ఇలా నిక్కచ్చిగా వివాదాలు బయటికి తేవడం ఇది మొదటిసారి కాదు. చాలా ఏళ్ళ క్రితం చెన్నైలో రోడ్డు మీద పైరసీ అమ్ముతున్న వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సంచలనం రేపాడు. ఇప్పుడీ ఇష్యూ. అయినా ఈ సంఘటనలు వినేసి ఊరుకుంటాం కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావన్న గ్యారెంటీ ఎవరూ ఇవ్వరు ఇవ్వలేరు. 

This post was last modified on September 28, 2023 8:14 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

5 mins ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

15 mins ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

1 hour ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

1 hour ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

2 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

3 hours ago