భారతీయుడు, ఠాగూర్ సినిమాల్లో లంచం తీసుకోవడం ఎంత పెద్ద తప్పో వివరించి దాని కట్టడి చేయడం కోసం హత్యలు చేసినా పర్వాలేదనే రేంజ్ లో సందేశం ఇస్తారు కమల్ హాసన్, చిరంజీవిలు. అయితే ఇలాంటివి కేవలం తెరకే పరిమితం. నిజ జీవితంలో హీరోలకు అలాంటి పరిస్థితి వచ్చినా తప్పించుకోలేరని తాజా ఉదంతం చాటుతోంది. హీరో విశాల్ తన లేటెస్ట్ తమిళ హిట్ మార్క్ ఆంటోనీ హిందీ డబ్బింగ్ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం అక్షరాలా 6 లక్షల 50 వేల రూపాయలు ముంబై అధికారులకు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పిన వీడియో వైరలవుతోంది.
ఇదంతా ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. కెరీర్ లో మొదటిసారి సెన్సార్ క్లియరెన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, తప్పనిసరి పరిస్థితుల్లో పని జరిగాక బయట పెడుతున్నానని వివరాలు అందజేశారు. స్క్రీనింగ్ కోసం 3 లక్షలు, సర్టిఫికెట్ కోసం 3 లక్షల 50 వేలు సమర్పించుకున్నాడు. అప్పటికే హిందీ డబ్బింగ్ కోసం ఒత్తిడి ఉండటంతో ఇవ్వాల్సి వచ్చింది. ఎం రాజన్, జీజ రాందాస్ పేరు మీద అకౌంట్ వివరాలు కూడా విశాల్ మీడియాకు విడుదల చేశాడు. ప్రధాన మంత్రి ఇలాంటివి సీరియస్ గా తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరూ తనలా ఇబ్బంది పడకూడదని అన్నాడు.
నిజంగా ఇది షాక్ కలిగించే విషయమే. పెద్ద హీరోలు కాబట్టి వాళ్లకు తగినంత గౌరవ మర్యాదలతో పాటు ఎలాంటి లంచాల బెడద ఉండదనుకుంటే ఇండస్ట్రీలోనే పీడించుకునే వాళ్ళు ఉండటం విచారకరం. అది కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులలో. విశాల్ ఇలా నిక్కచ్చిగా వివాదాలు బయటికి తేవడం ఇది మొదటిసారి కాదు. చాలా ఏళ్ళ క్రితం చెన్నైలో రోడ్డు మీద పైరసీ అమ్ముతున్న వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని సంచలనం రేపాడు. ఇప్పుడీ ఇష్యూ. అయినా ఈ సంఘటనలు వినేసి ఊరుకుంటాం కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావన్న గ్యారెంటీ ఎవరూ ఇవ్వరు ఇవ్వలేరు.
This post was last modified on September 28, 2023 8:14 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…