కొన్ని రోజులుగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఒక చిత్రం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఆ సినిమానే.. ఆదిపురుష్. ఈ ఏడాది ఇండియాలో అతి పెద్ద హిట్గా నిలిచిన ‘తానాజీ’ని రూపొందించిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. మన ప్రభాస్ హీరోగా ఈ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇది భారతీయ హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం ఆధారంగా తెరకెక్కనుండటం, శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండటం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు. ఐతే ‘తానాజీ’తో ఫేమ్ సంపాదించిన ఓం రౌత్.. ఆ సినిమా చేయడానికంటే ముందే ‘ఆదిపురుష్’ కథ రాశాడట. ప్రభాస్ను దృష్టిలో ఉంచుకునే ప్రధాన పాత్రను తీర్చిదిద్దాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు ఓం రౌత్.
‘‘తానాజీ’ సెట్స్పైకి వెళ్లక ముందు నుంచే నా మదిలో ‘ఆది పురుష్’ ఆలోచన వచ్చింది. చాలా పరిశోధన చేసి, ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసుకున్నా. నా టీంకు ఈ కథ చెప్పగానే వాళ్లు చాలా ఎగ్జైట్ అయ్యారు. రెండు నెలల పాటు అందరం కూర్చుని ఆ రఫ్ డ్రాఫ్ట్ను తిరగరాశాం. స్క్రీన్ప్లేను అప్డేట్ చేశాం. కథా వస్తువులో మార్పులు లేనప్పటికీ దాన్ని ఎగ్జిక్యూషన్ మాత్రం కొత్తగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా కథను నవీకరించాం. లాక్డౌన్ ఎత్తేశాక ఈ మధ్యే ప్రభాస్ను కలిసి కథ వినిపించా. ప్రభాస్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతాడని నాకు అనిపించింది. అతడి పర్సనాలిటీ, ప్రశాంత చిత్తం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు.. ఇలా ‘ఆదిపురుష్’లో ప్రధాన పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలూ అతడిలో చూశాను. ప్రభాస్ ఒప్పుకోకుంటే ఈ సినిమా చేసేవాడినే కాదు. ఇది శ్రీరాముడి కథ అన్నది నిజం. కానీ రామాయణాన్ని పూర్తిగా చూపించాం. అందులో ఇది ఒక భాగం. చారిత్రక కోణం నుంచి ఇప్పటికే దీనిపై పరిశోధన పూర్తి చేశాం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’’ అని రౌత్ తెలిపాడు.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…