కొన్ని రోజులుగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఒక చిత్రం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఆ సినిమానే.. ఆదిపురుష్. ఈ ఏడాది ఇండియాలో అతి పెద్ద హిట్గా నిలిచిన ‘తానాజీ’ని రూపొందించిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. మన ప్రభాస్ హీరోగా ఈ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇది భారతీయ హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం ఆధారంగా తెరకెక్కనుండటం, శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండటం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు. ఐతే ‘తానాజీ’తో ఫేమ్ సంపాదించిన ఓం రౌత్.. ఆ సినిమా చేయడానికంటే ముందే ‘ఆదిపురుష్’ కథ రాశాడట. ప్రభాస్ను దృష్టిలో ఉంచుకునే ప్రధాన పాత్రను తీర్చిదిద్దాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు ఓం రౌత్.
‘‘తానాజీ’ సెట్స్పైకి వెళ్లక ముందు నుంచే నా మదిలో ‘ఆది పురుష్’ ఆలోచన వచ్చింది. చాలా పరిశోధన చేసి, ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసుకున్నా. నా టీంకు ఈ కథ చెప్పగానే వాళ్లు చాలా ఎగ్జైట్ అయ్యారు. రెండు నెలల పాటు అందరం కూర్చుని ఆ రఫ్ డ్రాఫ్ట్ను తిరగరాశాం. స్క్రీన్ప్లేను అప్డేట్ చేశాం. కథా వస్తువులో మార్పులు లేనప్పటికీ దాన్ని ఎగ్జిక్యూషన్ మాత్రం కొత్తగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా కథను నవీకరించాం. లాక్డౌన్ ఎత్తేశాక ఈ మధ్యే ప్రభాస్ను కలిసి కథ వినిపించా. ప్రభాస్ మాత్రమే ఈ పాత్రకు సరిపోతాడని నాకు అనిపించింది. అతడి పర్సనాలిటీ, ప్రశాంత చిత్తం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు.. ఇలా ‘ఆదిపురుష్’లో ప్రధాన పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలూ అతడిలో చూశాను. ప్రభాస్ ఒప్పుకోకుంటే ఈ సినిమా చేసేవాడినే కాదు. ఇది శ్రీరాముడి కథ అన్నది నిజం. కానీ రామాయణాన్ని పూర్తిగా చూపించాం. అందులో ఇది ఒక భాగం. చారిత్రక కోణం నుంచి ఇప్పటికే దీనిపై పరిశోధన పూర్తి చేశాం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’’ అని రౌత్ తెలిపాడు.
This post was last modified on August 24, 2020 4:49 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…