భారతదేశపు స్పిల్బర్గ్ గా చెప్పుకునే దర్శకుడు శంకర్ ఒకేసారి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు చేయడం పెద్ద తలనెప్పిగా మారింది. ఇండియన్ 2 వల్ల కమల్ హాసన్ కు ఇబ్బంది లేదు కానీ గేమ్ చేంజర్ లేట్ అవ్వడం రామ్ చరణ్ ప్లానింగ్ మీద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దాదాపు మూడేళ్లు గడిచిపోయాయి. టైటిల్ అనౌన్స్ మెంట్ తప్ప నెలల తరబడి ఎలాంటి అప్డేట్ లేదు. లీకైన సాంగ్ విని అభిమానులు సంతోషపడటం తప్పించి పబ్లిసిటీ పరంగా మూడు వందల కోట్ల సినిమా బాగా వెనుకబడి ఉన్న మాట వాస్తవం. ఇక్కడి దాకా అందరికి తెలిసిన విషయాలే కాబట్టి అసలు మ్యాటర్ కు వద్దాం.
ఇండియన్ 2 తర్వాత మూడో భాగం కూడా శంకర్ మనసులో ఉంది. ముందు కమల్ ఒప్పుకోలేదు కానీ పలు దఫాల చర్చల అనంతరం అంగీకారం తెలిపినట్టు చెన్నై టాక్. ఎలాగూ క్యాస్టింగ్ అందుబాటులో ఉంది కనక కెజిఎఫ్, బాహుబలి లాగా తర్వాత తీయకుండా ఒకేసారి పూర్తి చేసేద్దామనే ప్రతిపాదన డిస్కషన్ లో ఉందట. ఒకవేళ అంతా ఓకే అనుకుంటే ఇండియన్ 3 గుట్టుచప్పుడు కాకుండా మొదలుపెట్టేస్తారు. అదే జరిగితే గేమ్ చేంజర్ కు ఇంకో కొత్త సమస్య వస్తుంది. 2024 సంక్రాంతి చేజారింది. వేసవికి గ్యారెంటీ లేదు. దసరా దీపావళిలకి వర్క్ అవుట్ కాదు.
ఫైనల్ గా 2025 జనవరికి గేమ్ చేంజర్ ఉండొచ్చనే ప్రచారం మెగా పవర్ స్టార్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ తదితరాలు చాలా ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు సైతం ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఫలానా సీజన్ లో వస్తుందని చెప్పేస్తే ఈ టెన్షన్ ఉండదు. బాల్ శంకర్ కోర్టులో ఉన్నప్పుడు వట్టి బ్యాటుతో రాజు గారు మాత్రం ఏం చేయగలరు. గేమ్ చేంజర్ పూర్తయితే బుచ్చిబాబు సినిమా మీద సీరియస్ ఫోకస్ పెట్టేందుకు చరణ్ కు అవకాశం దక్కుతుంది. కానీ అంతులేని కథలా శంకర్ రెండు పడవల ప్రయాణానికి ఆది తప్ప అంతం కనిపించడం లేదు.
This post was last modified on September 27, 2023 10:55 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…