సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో బ్రహ్మోత్సవం ఒకటి. తనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి స్పెషల్ ఫిలిం ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలతో కొన్నేళ్లకే మళ్లీ జట్టు కట్టాడు మహేష్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కనీస స్థాయిలో కూడా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. టాలీవుడ్ చరిత్రలోనే ఆ సమయానికి అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా మీద సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఇది మహేష్కు అవమాన భారం మిగిల్చిందని చెప్పొచ్చు. ఇలాంటి డిజాస్టర్ ఇచ్చాక ఎవరికైనా దర్శకుడి మీద కోపం రావడం సహజం. కానీ మహేష్ మాత్రం తనతో చాలా బాగా మాట్లాడాడని.. తనకు అండగా నిలిచాడని చెప్పాడు శ్రీకాంత్.
తన కొత్త చిత్రం పెదకాపు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ రెస్పాన్స్ ఏంటో వెల్లడించాడు.
సినిమా పోయాక మహేష్ తనతో మాట్లాడుతూ.. మనం బాగానే ఉన్నాం కదా, కొన్నిసార్లు ఇలా అవుతుంటాయి అని ధైర్యం చెప్పినట్లు శ్రీకాంత్ తెలిపాడు. మనం కష్టంలో ఉన్నపుడు అండగా నిలిచే వాళ్లు ఉండటం ముఖ్యమని.. మహేష్ అలాగే తనకు సపోర్ట్ ఇచ్చాడని అతను చెప్పాడు.
ఇదిలా ఉండగా.. తమ కలయికలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీక్వెల్ వచ్చే అవకాశాలున్నట్లు శ్రీకాంత్ సంకేతాలు ఇవ్వడం విశేషం. నిర్మాత దిల్ రాజే ఈ ఆలోచన చేశాడని.. ఒక రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేస్తే ఆ సినిమా సీక్వెల్ ఆలోచన వచ్చిందంటూ తనకు ఫోన్ చేసి చెప్పాడని.. ఇది ఈ మధ్యే జరిగిందని కూడా శ్రీకాంత్ చెప్పడం విశేషం. ఐతే ఈ సినిమా కార్యరూపం దాల్చాలంటే కథ సహా అన్నీ కుదరాలని.. కాబట్టి వేచి చూద్దాం అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
This post was last modified on September 25, 2023 9:58 pm
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభా వేదికపై ఉన్న 98 ఏళ్ల…