Movie News

బ్ర‌హ్మోత్స‌వం పోయాక‌ అడ్డాల‌తో మ‌హేష్ ఏమ‌న్నాడు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో బ్ర‌హ్మోత్స‌వం ఒక‌టి. త‌న‌కు సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు లాంటి స్పెష‌ల్ ఫిలిం ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల‌తో కొన్నేళ్ల‌కే మ‌ళ్లీ జ‌ట్టు క‌ట్టాడు మ‌హేష్‌. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా క‌నీస స్థాయిలో కూడా ఆ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఆ స‌మ‌యానికి అతి పెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

ఈ సినిమా మీద సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఇది మ‌హేష్‌కు అవ‌మాన భారం మిగిల్చింద‌ని చెప్పొచ్చు. ఇలాంటి డిజాస్ట‌ర్ ఇచ్చాక ఎవ‌రికైనా దర్శ‌కుడి మీద కోపం రావ‌డం స‌హ‌జం. కానీ మ‌హేష్ మాత్రం త‌న‌తో చాలా బాగా మాట్లాడాడ‌ని.. త‌న‌కు అండ‌గా నిలిచాడ‌ని చెప్పాడు శ్రీకాంత్.
త‌న కొత్త చిత్రం పెద‌కాపు విడుద‌ల‌కు సిద్ధ‌మైన నేప‌థ్యంలో శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మ‌హేష్ రెస్పాన్స్ ఏంటో వెల్ల‌డించాడు.

సినిమా పోయాక మ‌హేష్ త‌న‌తో మాట్లాడుతూ.. మ‌నం బాగానే ఉన్నాం క‌దా, కొన్నిసార్లు ఇలా అవుతుంటాయి అని ధైర్యం చెప్పిన‌ట్లు శ్రీకాంత్ తెలిపాడు. మ‌నం క‌ష్టంలో ఉన్న‌పుడు అండ‌గా నిలిచే వాళ్లు ఉండ‌టం ముఖ్య‌మ‌ని.. మ‌హేష్ అలాగే త‌న‌కు సపోర్ట్ ఇచ్చాడ‌ని అత‌ను చెప్పాడు.

ఇదిలా ఉండ‌గా.. త‌మ క‌ల‌యిక‌లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సీక్వెల్ వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్లు శ్రీకాంత్ సంకేతాలు ఇవ్వ‌డం విశేషం. నిర్మాత దిల్ రాజే ఈ ఆలోచ‌న చేశాడ‌ని.. ఒక రోజు తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు లేస్తే ఆ సినిమా సీక్వెల్ ఆలోచ‌న వ‌చ్చిందంటూ త‌న‌కు ఫోన్ చేసి చెప్పాడ‌ని.. ఇది ఈ మ‌ధ్యే జ‌రిగింద‌ని కూడా శ్రీకాంత్ చెప్ప‌డం విశేషం. ఐతే ఈ సినిమా కార్య‌రూపం దాల్చాలంటే క‌థ స‌హా అన్నీ కుద‌రాల‌ని.. కాబ‌ట్టి వేచి చూద్దాం అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.

This post was last modified on September 25, 2023 9:58 pm

Share

Recent Posts

ఇన్‌స్పైరింగ్… 70 వయసు దగ్గరలో 7 సినిమాలు

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…

5 minutes ago

ఫోక్ డ్యాన్స‌ర్ల ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌… ర‌చ్చ ర‌చ్చ‌

భ‌ర్త ఎవ‌రితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వ‌స్తుంది. విష‌యం రూఢి చేసుకుంటుంది. భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ.. ప‌రాయి మ‌హిళ‌తో…

11 minutes ago

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…

40 minutes ago

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

1 hour ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

3 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

3 hours ago